* అండర్-19 వరల్డ్కప్: ఇవాళ భారత్ – ఆఫ్ఘన్ మధ్య సెమీ ఫైనల్.. హరారె వేదికగా మధ్యాహ్నం ఒంటిగంటకు భారత్, ఆఫ్ఘన్ మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్
* నేడు ఆరోరోజు పార్లమెంట్ సమావేశాలు.. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ.. ధన్యవాద తీర్మానంపై సమాధానం ఇవ్వనున్న ప్రధాని మోడీ
* ఢిల్లీ: ఇవాళ పార్లమెంట్ ప్రాంగణంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీల నిరసనలు.. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని లోక్సభలో మాట్లాడకుండా చేయడంతో పాటు 8 మంది ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాల నిరసన ప్రదర్శనలు..
* అమరావతి: ఇవాళ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమావేశం.. ఉదయం 10.40 గంటలకు ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో భేటీ.. తాజా రాజకీయ పరిణామాలు, తిరుమల లడ్డూ అంశానికి సంబంధించి చర్చ
* ఇవాళ గుంటూరులో వైఎస్ జగన్ పర్యటన.. మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించనున్న జగన్.. జిల్లాలో పోలీస్ 30 యాక్ట్ అమలులో ఉందంటున్న పోలీసులు
* ఇవాళ్టి నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం.. ఇవాళ మిర్యాలగూడలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన..
* హైదరాబాద్: ఇవాళ్టి నుంచి మున్సిపాలిటీలకి, కార్పొరేషన్లకు పీసీసీ పరిశీలకుల నియామకం.. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు లేని నియోజకవర్గాల ప్రజాప్రతినిధులకు పార్టీ ఆఫీస్ బేరర్లు, కార్పొరేషన్ చైర్మన్లకు బాధ్యతలు ఇవ్వనున్న టీపీసీసీ
* హైదరాబాద్: ఎమ్మెల్యే కడియం శ్రీహరికి స్పీకర్ గడ్డం ప్రసాద్ నోటీసులు.. ఇవాళ ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని స్పీకర్ నోటీసులు
* తిరుపతి: ఇవాళ విద్యార్థి సంఘాల భారీ నిరసన.. మోహన్బాబు యూనివర్సిటీ అక్రమాలపై గళం విప్పనున్న విద్యార్థి లోకం.. SFI నాయకుల కిడ్నాప్ కేసులో మోహన్బాబు, విష్ణులను అరెస్ట్ చేయాలని డిమాండ్.. MBU గుర్తింపును రద్దు చేసి, వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్.. కిడ్నాప్ రాజకీయాలు నశించాలంటూ ఐక్య కార్యాచరణకు పిలుపునిచ్చిన SFI, AISF, NSUI, PDSU..
* రాజన్న సిరిసిల్ల జిల్లా: నేడు వేములవాడలో కేంద్రమంత్రి బండి సంజయ్ పర్యటన .. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్న కేంద్ర మంత్రి
* నల్లగొండ జిల్లా: నేడు మిర్యాలగూడ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. 200 కోట్లతో ఏర్పాటు చేయనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కు శంకుస్థాపన చేయనున్న సీఎం.. మహిళా సంఘాలకు చెక్కులు పంపిణీ చేయనున్న ముఖ్యమంత్రి.. అనంతరం గూడూరు వద్ద ఏర్పాటుచేసిన మున్సిపల్ ఎన్నికల ప్రచారం బహిరంగ సభలో పాల్గొననున్న సీఎం.
* తిరుమల: 4 కంపార్ట్మెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 69,389 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 20,247 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.72 కోట్లు
* అనంతపురం: తాడిపత్రి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో నేడు బడ్జెట్ సమావేశం.
