* అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక ఒప్పందం.. 60 రోజుల కాల్పుల విరమణ, అణు కార్యక్రమంపై మళ్లీ చర్చలు.. తాత్కాలిక ఒప్పందానికి తుది ఆమోదం తెలపాల్సి ఉన్న ఇరాన్, అమెరికా
* ఐపీఎల్ 2026: నేడు రాజస్థాన్, గుజరాత్ మధ్య క్వాలిఫయర్-2 మ్యాచ్.. ముల్లాన్పూర్లో రాత్రి 7.30 గంటలకు మ్యచ్
* ఢిల్లీకి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్.. నేడు ఖర్గే, రాహుల గాంధీతో భేటీకానున్న డీకే శివకుమార్.. రాహుల్ను కలవనున్న సిద్ధరామయ్య.. సీఎల్పీ సమావేశం.. సీఎం ప్రమాణ స్వీకారం, కేబినెట్ కూర్పు అంశాలపై కీలక సమావేశాలు
* అమరావతి: ఇవాళ ఉదయం 10.30కు ఏపీ సచివాలయానికి సీఎం చంద్రబాబు.. వివిధ శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష.
* అమరావతి: ఇవాళ ఏపీకి కేంద్ర జౌళి శాఖా మంత్రి గిరి రాజ్ సింగ్.. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం చంద్రబాబుతో సమావేశం.. ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబుతో భేటీ కానున్న కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్
* అమరావతి: ఆర్టీసీ సమస్యలపై ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష … ఆర్టీసీలో పలు సమస్యల పరిష్కారంపై ప్రధాన చర్చ.. సమావేశంలో పాల్గొననున్న రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి , స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణ బాబు, RTC ఎండీ, ఉన్నతాధికారులు. సంస్థ ఆర్థిక పరిస్థితి, ఉద్యోగుల సంక్షేమం, విద్యుత్ బస్సుల వినియోగం, ప్రయాణికులకు మెరుగైన సేవలు, బస్సుల నిర్వహణ తదితర అంశాలపై సమావేశంలో చర్చ.
* హైదరాబాద్: ఇవాళ సాయంత్రం గాంధీభవన్లో టి.కాంగ్రెస్ పీఏసీ భేటీ.. పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి, మీనాక్షి నటరాజన్, కాంగ్రెస్ నేతలు.. భేటీలో SIR, తాజా రాజకీయ పరిణామాలపై చర్చ
* హైదరాబాద్: ఇవాళ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ముందుకు బీఆర్ఎస్ నేతల బృందం.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న రైతు డిస్కంపై ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొననున్న కేటీఆర్
* కొమురం భీం జిల్లా లో నేడు రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల పర్యటన.. రౌఠసంకేపల్లి లో జరిగే కార్యక్రమం లో పాల్గొననున్న గవర్నర్. ఉదయం 10.35 గంట లకు హెలికాప్టర్ ద్వారా జిల్లా కలెక్టరేట్ చేరుకోనున్న గవర్నర్. మధ్యాహ్నం 3 గంటలకు రౌఠసంకె పల్లి గ్రామంలో కోమురం భీం జల్ జంగిల్ జమీన్ స్ఫూర్తి గ్రామోత్సవం-2026 కార్యక్రమానికి హాజరు కానున్నారు గవర్నర్.
* జయశంకర్ భూపాలపల్లి జిల్లా: కాళేశ్వరంలో ఘనంగా చివరి దశకు చేరిన సరస్వతి అంత్య పుష్కరాలు.. పుష్కరాల 9వ రోజు త్రివేణి సంగమం వద్ద పుష్కర స్నానాలు.. వేకువజామున నుండి తెలుగు రాష్ట్రాల తోపాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి కాళేశ్వరానికి తరలివస్తున్న భక్తులు.. త్రివేణి సంగమంలో భక్తుల పుణ్యస్నానాలు,గోదావరిమాతకు ప్రత్యేక పూజలు..
* శ్రీ సత్యసాయి : పరిగిలో శ్రీ సప్తమాతృక దేవి (పన్నాడమ్మ) అమ్మవారి ఉత్సవాలు, నేడు జ్యోతుల ఉత్సవం, గ్రామోత్సవము.
* తిరుపతి: నేడు ఎస్వీ యూనివర్శిటీ అంబేద్కర్ విగ్రహం వద్ద డీఎస్సీ–2025 నియామకాల్లో అక్రమాలు, అవకతవకలు వ్యహారంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం తరపున ధర్నా.
