Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
* ఢిల్లీలో రెండో రోజు స్పీకర్ల సదస్సు.. పార్లమెంట్ లో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన జరుగుతున్న సదస్సు.. సమావేశానికి వివిధ రాష్ట్రాల శాసనసభ స్పీకర్లు, ప్రిసైడింగ్ అధికారులు
* నేడు కాళేశ్వరం కమిషన్ ముందుకు కాళేశ్వరం నిర్మాణంలో పాల్గొన్న ఇంజనీర్లు. బహిరంగ విచారణ ద్వారా ఇంజనీర్లను విచారించనున్న కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్.. నేటి నుంచి శనివారం వరకు 40 మంది కాళేశ్వరం ఇంజనీర్లను విచారించనున్న కమిషన్ చైర్మన్ సీపీ ఘోష్
Also Read
* విజయవాడ: ఇవాళ ఉదయం 7:30కు ఇంద్రకీలాద్రికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా కనకదుర్గమ్మ ఆలయంలో శుద్ధి కార్యక్రమం చేపట్టనున్న పవన్ కల్యాణ్
* తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. 1 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 65,604 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 24,266 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.85 కోట్లు
* విజయనగరం: నేడు పొలం పిలుస్తుంది పోస్టల్ ఆవిష్కరణ కార్యాక్రమంలో పాల్గొనున్న విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు.
* హైదరాబాద్: ఉదయం 10 గంటలకు రాజ్ భవన్ లో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మతో మంత్రి సీతక్క భేటి.. ములుగు గ్రామ పంచాయతీకి మున్సిపాలిటీ హోదా కల్పించిన బిల్లుకు ఆమోద ముద్ర వేయాలని కోరనున్న సీతక్క.. ములుగును మున్సిపాలిటీగా మారుస్తూ సెప్టెంబర్ 2022లో బిల్లు పాస్ చేసిన అసెంబ్లీ.. రెండు సంవత్సరాలుగా పెండింగ్ లోనే ములుగు మున్సిపాలిటీ అంశం
* ప్రకాశం : మద్దిపాడు మండలం వెల్లంపల్లిలో పొగాకు బోర్డును పరిశీలించనున్న విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్..
* ప్రకాశం: పొన్నలూరు మండలం చౌటపాలెంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి..
* ప్రకాశం : ఇవాళ ఒంగోలుకు చేరుకోనున్న వారాహీ మహా రథ యాత్ర.. ఆది వారాహి శక్తి ఆలయం ఆధ్వర్యంలో తిరుపతి నుంచి విశాఖపట్నం వరకు నిర్వహిస్తున్న శ్రీ వారాహి అమ్మవారి మహా రథయాత్ర.. నగరంలో కర్నూలు రోడ్డు ఫ్లై ఓవర్ వినాయక గుడి వద్ద నుంచి నెల్లూరు బస్టాండ్ డీఆర్ఆర్ఎం హైస్కూల్ వరకు సాగనున్న రథయాత్ర..
* విశాఖ: నేడు నగరానికి రానున్న ఏపీ విద్యాశాఖ మంత్రి నారాలోకేష్.. రాత్రికి NTR భవన్ లో బస చేయనున్న మంత్రి
* తిరుమల: ఇవాళ ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో డిసెంబర్ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లు విడుదల చెయ్యనున్న టీటీడీ
* విశాఖ: నేడు విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం స్వర్ణోత్సవ వేడుకలు… హాజరుకానున్న IMD ఉన్నతాధికారులు.. ఖచ్చితమైన వాతావరణ సమాచారం కోసం 1974లో ఏర్పాటు చేసిన కేంద్రం…
* విశాఖ: నేడు GVMC కౌన్సిల్ సాధారణ సమావేశం… 75 అంశాలతో ఎజెండా అంశాలపై చర్చించనున్న కౌన్సిల్… కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి సమావేశం కావడంతో వాడివేడి గా జరిగే అవకాశం .. .
* నెల్లూరు జిల్లా: రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జరిగే ఇది మంచి ప్రభుత్వం.. కార్యక్రమంలో పాల్గొంటారు.
* నెల్లూరు: రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తిరుమలలో పర్యటిస్తారు
* శ్రీ సత్యసాయి : తిరుమలలో లడ్డు ప్రసాద తయారీ విషయంలో జరిగిన అపచారాన్ని నిరసిస్తూ హిందూపురం పట్టణంలో హిందూ సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ
* విజయవాడ: ముంబై నటి జత్వాని కాదంబరి కేసులో A1 నిందితుడి కుక్కల విద్యాసాగర్ ను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ కోర్టులో పోలీసుల పిటిషన్.. నేడు విచారణకు వచ్చే అవకాశం
* తిరుపతి: రేపు శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో శాంతి హోమం.. మహా శివుడి జన్మ నక్షత్రమైన ఆరుద్ర రోజున ఉదయం 9 గంటల కు అద్భుత రాయల మండపం లో శాంతి హోమం నిర్వహించనున్న అర్చకులు
తాజావార్తలు
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
-
Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో