* నేడు భారత్ పర్యటనకు ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ.. GOAT టూర్లో భాగంగా 3 రోజులు ఇండియాలో మెస్సీ.. 14 ఏళ్ల తర్వాత భారత్లో పర్యటిస్తున్న మెస్సీ.. హైదరాబాద్ సహా కోల్కతా, ముంబై, ఢిల్లీలో పర్యటన
* హైదరాబాద్: నేడు ఉప్పల్ స్టేడియంలో ఫ్లెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్.. రాత్రి 7 గంటలకు ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ – సీఎం రేవంత్ జట్ల మధ్య మ్యాచ్.. మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్ వీక్షించేందుకు ఉప్పల్ స్టేడియానికి రాహుల్ గాంధీ
* నేడు సాయంత్రం 4.15 గంటలకు హైదరాబాద్ కి రాహుల్ గాంధీ.. ఎయిర్పోర్ట్ నుంచ ఫల్కునుమా ప్యాలెస్ హోటల్కి రాహుల్.. రాత్రి 7 గంటలకు ఉప్పల్ స్టేడియంకి రాహుల్ గాంధీ.. రాత్రి 9.15కి ఎయిర్ పోర్ట్ కి బయలుదేరనున్న రాహుల్ గాంధీ..
* హైదరాబాద్లో యూపీ మాజీ సీఎం, సమాజ్వాది పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్.. Vision India: AI Summitకు ముఖ్య అతిథిగా హాజరుకానున్న అఖిలేష్..
* తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికకు ఏర్పాట్లు .. నేడు పోలింగ్ సామాగ్రి పంపిణీ చేయనున్న అధికారులు
* తూర్పుగోదావరి జిల్లా: నేడు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 4వ జాతీయ లోక్ అదాలత్ 2025.. జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టుల్లో జరుగనున్న జాతీయ లోక్ అదాలత్.. ఈ ఉదయం 9:30 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగుతున్న జాతీయ లోక్ అదాలత్
* తిరుమల: 26 కంపార్ట్మెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 67,202 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 25,864 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.4.04 కోట్లు
* అనంతపురం : నగరంలోని మొదటి రోడ్డు ఈశ్వరాలయంలో అయ్యప్ప స్వామి గ్రామోత్సవం.
* నేడు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కార్యక్రమాలు.. సాయంత్రం 3.00 గంటలకు టెక్కలి మేజర్ పంచాయతీలో గ్రామపంచాయతీ కార్యాలయంలో నూతన సచివాలయ భవనం ప్రారంభోత్సవం చేయనున్నారు. సాయంత్రం 4.00 గంటలకు టెక్కలి ప్రభుత్వ బాలికల పాఠశాలకు సంబంధించిన క్రీడా మైదానం పనులకు శంకుస్థాపన చేయనున్నారు.. సాయంత్రం 4.30 గంటలకు టెక్కలి RDO కార్యాలయంలో నూతనంగా నిర్మించిన సమావేశ మందిరం ప్రారంభోత్సవం చేయనున్నారు..