What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

What's Today Ntv

What's Today Ntv

* IPL: ఇవాళ ఐపీఎల్‌లో రెండు మ్యాచ్‌లు.. మధ్యాహ్నం 3.30కి చెన్నై వేదికగా సీఎస్కే వర్సెస్‌ లక్నో.. రాత్రి 7.30కి రాయ్‌పూర్‌ వేదికగా ఆర్సీబీ వర్సెస్‌ ముంబై ఇండియన్స్‌

* ఇవాళ హైదరాబాద్‌కు ప్రధాని నరేంద్ర మోడీ.. రూ.9,377 కోట్ల విలువైన పలు ప్రాజెక్టుల ప్రారంభం, శంకుస్థాపనలు.. పరేడ్‌ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి

* హైదరాబాద్‌లో పలుచోట్ల ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయి.. పరేడ్‌ గ్రౌండ్‌ వైపు వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలి.. మధ్యామ్నం 1 నుంచి రాత్రి 9 వరకు భారీ వాహనాలపై ఆంక్షలు ఉంటాయి.. రోడ్లపై వాహనాలు పార్క్‌ చేస్తే సీజ్‌ చేస్తాం-సీపీ సుమతి

* నేడు తమిళనాడు సీఎంగా విజయ్‌ ప్రమాణస్వీకారం.. ఉదయం 10 గంటలకు కార్యక్రమం.. నెహ్రూ స్టేడియంలో ఏర్పాట్లు పూర్తి.. విజయ్‌ ప్రమాణస్వీకారోత్సవానికి మాజీ ముఖ్యమంత్రులకు, కోలీవుడ్‌ ప్రముఖులకు ఆహ్వానం.. చెన్నైలోని 20 ప్రాంతాల్లో భారీ ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు.. ఈ నెల 13న బలనిరూపణకు అవకాశం.. విజయ్‌తో పాటు 9 మంది మంత్రుల ప్రమాణస్వీకారం

* ప్రధాని మోడీ పర్యటనలో పాల్గొనాలని సీఎం రేవంత్‌ రెడ్డికి కేంద్రం ఆహ్వానం.. ప్రధాని మోడీ చేయనున్న పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల కార్యక్రమాల్లో పాల్గొనాలని సీఎం రేవంత్‌కు ఆహ్వానం

* తూర్పుగోదావరి జిల్లా: నేడు రాజమండ్రిలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని మెగా మెడికల్ క్యాంపు ఏర్పాటు.. ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోతున్న తరుణంలో ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి ఏర్పాటు చేస్తున్న మెడికల్ క్యాంపు

* అనంతపురం: సింగనమల మండల కేంద్రంలో వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నూతన కార్యాలయంను ప్రారంభించనున్న మాజీ మంత్రి శైలజానాథ్..

* అనంతపురం : గుంతకల్ పరిధిలోని కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవాలయంలో నేటి నుంచి 12 వరకు హనుమాన్ జయంతి ఉత్సవాలు ప్రారంభం

* కర్నూలు: నేడు కోడుమూరు (మం) వెంకటగిరి శ్రీ గిడ్డాంజనేయ స్వామి జయంతి ఉత్సవాలలో విష్వక్సేసనపూజ, పుణ్యహవాచనం, అంకురార్పణ

* నంద్యాల: నేడు నందికొట్కూరు మం అల్లూరులో నూతన అంగన్వాడి కేంద్రాలు, సీసీ రోడ్లు, సబ్ స్టేషన్ ను ప్రారంభించనున్న ఎమ్మెల్యే జయసూర్య

* నంద్యాల: పాణ్యం (మం) కొత్తూరు శ్రీవల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రంలో నేడు నాగ దోష పూజలు, స్వామివారికి ప్రత్యేక అలంకరణలు, విశేష పూజలు.

* తిరుమల: వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి వెలుపల క్యూలైన్లలో వేచివున్న భక్తులు .. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 18 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 81,512 మంది భక్తులు .. తలనీలాలు సమర్పించిన 38,988 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.23 కోట్లు

* తిరుపతి: వైభవంగా సాగుతున్న తిరుపతి గంగజాతర… జాతరలో భాగంగా నేడు మాతంగి వేషం లో అమ్మవారిని దర్శించుకున్న భక్తులు