Kolkata Doctor Case: ఇంత అర్జెంట్ ఎందుకు..? ఆర్జీ కర్ ఆస్పత్రి పనులపై హైకోర్టు ప్రశ్న..
- ఆర్జీ కర్ ఆస్పత్రి పునరుద్ధరణ పనులపై హైకోర్టు ఆగ్రహం..
- ఇంత అత్యవసరం ఏంటి..? అని ప్రభుత్వానికి ప్రశ్న..
- నేర దృశ్యం చెక్కుచెదరకుండా ఉందని నిరూపించడానికి ఫోటోలు సమర్పించాలి..
- బెంగాల్ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kolkata Doctor Case: ట్రైనీ డాక్టర్పై అత్యాచారం, హత్య జరిగిన కోల్కతాలోని ఆర్జీ కర్ ఆస్పత్రి పునరుద్ధరణ పనులపై కలకత్తా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హత్యాచారం జరిగిన సెమినార్ హాల్ సమీపంలోని భాగాలను పునరుద్ధరించాల్సిన అత్యవసరం ఏమిటి..? అని బెంగాల్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. శుక్రవారం ఈ అంశాన్ని హైకోర్టు విచారించింది. నేరం జరిగిన ప్రదేశం నుంచి సాక్ష్యాలు నాశనం చేయడానికి ఆస్పత్రిలో అత్యవసరంగా సెమినార్ హాలు చుట్టూ కూల్చివేత పనులు జరిగాయనే ఆరోపణలపై సమాధానం చెప్పాలని మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.
Read Also: Rajanna Sirisilla District: బాబాయ్ ని ఇరికించేందుకు అబ్బాయి కిడ్నాప్ డ్రామా.. అవాక్కైన పోలీసులు
Also Read
- Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై "సింగం" ఫార్ములా బ్లాక్బస్టర్!!
- Delhi: ఢిల్లీ అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు బట్టబయలు.. వంటవాడి నిర్లక్ష్యానికి 21 మంది బలి..
- TMC Rebellion: కోల్కతా టు ఢిల్లీ.. పార్లమెంట్కు పాకిన టీఎంసీ తిరుగుబాటు సెగ.. దీదీకి తప్పని అగ్నిపరీక్ష!
- Delhi: అభిజీత్ దిప్కే పిలుపునకు భారీ స్పందన.. ‘కాక్రోచ్ మాస్కులు’ ధరించి నిరసన బాట పట్టిన యువత..
అయితే, రాష్ట్ర ప్రభుత్వం తరుపున వాదిస్తున్న న్యాయవాది ఈ ఆరోపణల్ని తోసిపుచ్చారు. వైద్యుల కోసం వాష్రూములను నిర్మించడానికి పనులు చేపడుతున్నట్లు చెప్పాడు. కూల్చివేత పనులు జరుగుతున్న ప్రదేశం సంఘటన స్థలానికి దగ్గర్లో లేదని, దీనిపై వస్తున్న ఆరోపణలు నిజం కాదని చెప్పారు. అయితే, చీఫ్ జస్టిస్ టీఎస్ శివజ్ఞానం మాట్లాడుతూ.. ఇలాంటి సమయంలో పనులు చేయడాన్ని ప్రశ్నించారు. ‘‘ అత్యవసరంగా 12 గంటల్లో రెస్ట్ రూములను అందించడం అంత ముఖ్యమా..? మీరు ఏదైనా జిల్లా కోర్టు కాంప్లెక్స్ వెళ్లండి. మహిళలకు రెస్ట్ రూములు ఉన్నాయో లేదో చూడండి. నేను బాధ్యతతో చెబుతున్నాను, పీడబ్ల్యూడీ ఏం చేస్తుంది..? కోర్టు సముదాయాలల్లో అక్కడ విశ్రాంతి గదుల పరిస్థితిని చూడండి’’ అంటూ న్యాయమూర్తి మండిపడ్డారు.
కోల్కతాలోని ఆర్జీ కర్ ఆస్పత్రిలో 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్పై అత్యంత దారుణంగా అత్యాచారం, హత్య జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసును హైకోర్టు సీబీఐకి అప్పగించింది. బెంగాల్ ప్రభుత్వం, పోలీసుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. బుధవారం ఆస్పత్రిలోకి చొరబడి కొందరు దుండగులు దాడి చేయడంపై కూడా పోలీసుల తీరును ప్రశ్నించింది. బాధితురాలికి మద్దతుగా బుధవారం పెద్ద ఎత్తున ర్యాలీ జరిగిన సమయంలో ఈ దాడి జరిగింది. 7000 మంది ప్రజలు గుమిగూడే విషయం పోలీసులకు తెలియకపోవడం పూర్తిగా వైఫల్యమే అని కోర్టు వ్యాక్యానించింది. నేరం జరిగిన ప్రదేశం చెక్కుచెదరకుండా ఉందని నిరూపించేందుకు ఫొటోలతో కూడిన అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
తాజావార్తలు
-
Fish Prasadam 2026 : ఈనెల 8న రాత్రి 9 గంటల నుంచి ‘చేప ప్రసాదం’ పంపిణీ..
-
Varansi: అదంతా ఫేకు.. వారణాసి బడ్జెట్’పై స్టార్ యాక్టర్ సంచలనం!
-
Kalki 2: వచ్చే నెల నుంచే ‘కల్కి 2’ నాన్-స్టాప్ షూటింగ్!
-
SlumDog – 33 Temple Road: ‘స్లమ్డాగ్ – 33 టెంపుల్ రోడ్’ కు డబ్బింగ్ చెప్పిన విజయ్ సేతుపతి… టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
-
Nag Ashwin: కమల్ హాసన్ మిస్ చేసుకున్న కథతో.. నాన్-స్టాప్ మ్యూజికల్ వింతగా ‘సింగ్ గీతం’
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!