Avani Dias: ఆస్ట్రేలియన్ జర్నలిస్ట్ అవనీ డయాస్ ఎవరు.? భారత్ విడిచి వెళ్లాలని కేంద్రం ఆదేశించిందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Avani Dias: ఆస్ట్రేలియన్ జర్నలిస్ట్ అవనీ డయాస్ అంశం ఇటీవల వివాదాస్పదంగా నిలిచింది. తన రిపోర్టింగ్ కారణంగా భారత్ని విడిచిపెట్టి వెళ్లాలని అధికారులు కోరారని ఆమె ఎక్స్ వేదికగా ఆరోపించింది. అయితే, ఆమె వ్యాఖ్యలు తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయని, ఆమె వీసా ఉల్లంఘనలకు పాల్పడిందని కేంద్రం చెప్పింది.
అవనీ డయాస్ ఎవరు..?
Also Read
- Abhijeet Dipke: టైమ్ కావాలి, పంజాబ్ పేపర్ లీక్పై స్పందిస్తాము..
- NTA Exam Reform: పరీక్షా సంస్కరణల హైపవర్ కమిటీ సభ్యులు వీరే..
- PM Modi: పరీక్షా సంస్కరణలకు ప్రధాని మోడీ శ్రీకారం.. నందన్ నీలేకనికి కీలక బాధ్యత..
- Gen Z Protest: ‘‘ మా దేశంలో బిర్యానీ ప్లేట్కే అమ్ముడుపోతారు’’.. భారత యువతపై పాకిస్తాన్ యూత్ ప్రశంసలు..
అవనీ డయాస్ ఆస్ట్రేలియా ABC న్యూస్లో దక్షిణాసియా బ్యూరో చీఫ్గా ఉన్నారు. గతంలో ఆమె యూత్ రేడియో స్టేషన్ ట్రిపుల్ జెలో కరెంట్ అఫైర్స్ షో హ్యాక్కి హోస్ట్గా వ్యవహరించారు. ఈమె 2019 న్యూ సౌత్ వేల్స్ ప్రీమియర్స్ మల్టికల్చరల్ కమ్యూనికేషన్స్ అవార్డ్స్, పబ్లిక్ ఇంట్రెస్ట్ అవార్డుతో సహా పలు జర్నలిస్టిక్ అవార్డులను గెలుచుకున్నారు
అయితే, ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత ప్రభుత్వ ఏజెంట్ ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించాడు. ఇవి పూర్తిగా అసంబద్ధ, ప్రేరేపిత వ్యాఖ్యలని భారత్ కొట్టిపారేసింది. దీనిపై ఆమె గత నెలలో యూట్యూబ్లో ఒక నివేదికను ప్రచురించింది.
అవనీ ఏ ఆరోపణలు చేసింది..?
నరేంద్రమోడీ ప్రభుత్వం గురించి క్లిష్టమైన నివేదిక తర్వాత తన వీసా పొడగింపులో సమస్యలను ఎదుర్కొన్నట్లు 32 ఏళ్ల అవనీ ఆరోపించారు. తనను భారత్ తక్షణమే విడిచివెళ్లాలని కోరినట్లు, తనకు లోక్సభ ఎన్నికలను కవల్ చేయడానికి అనుమతించలేదని పేర్కొ్ంది. తన రిపోర్టింగ్ కారణంగా వీసా పొడిగింపు లభించదని ప్రభుత్వ అధికారి చెప్పడంతో గత వారం తాను ఆస్ట్రేలియాకు తిరిగి వచ్చానని అవనీ డయాస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ Xలో తెలిపారు. నా రిపోర్టింగ్ లైన్ క్రాస్ చేసిందని చెప్పారని, ఆస్ట్రేలియా ప్రభుత్వం జోక్యం తర్వాత తన విమానానికి 24 గంటల ముందు మరో రెండు నెలలు వీసా పొడగించినట్లు తెలిసింది.
భారత్ స్పందనేంటి..?
జర్నలిస్టు వీసా నిబంధనల్ని ఉల్లంఘించారని కేంద్రం ఆరోపించింది. ఆమె చేసిన ఆరోపణలు తప్పుదోవ పట్టిచేలా ఉన్నాయని చెప్పింది. ప్రస్తుతం ఆమెకు 2 నెలల వీసాను పొడగించినట్లు తెలిపింది. ఎన్నికలు కవర్ చేయడానికి అనుమతించలేదని, దేశం విడిచి వెళ్లమని చెప్పారని ఆమె చేసిన వాదనల్లో నిజం లేదని తెలిపింది. గతంలో ఆమె వీసా కేవలం ఏప్రిల్ 20 వరకు చెల్లుబాటులో ఉందని అధికారులు తెలిపారు.
ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ కార్యాలయం, ఇతర దౌత్యవేత్తలు లాబీయింగ్ చేసిన తర్వాత ఎన్నికలు కవర్ చేయడానికి ఏబీసీ న్యూస్ జర్నలిస్టు అవనీ డయాస్కి వీసా పొడగించారు. భారత అధికారులు వీసాను పొడిగించినప్పటికీ శ్రీమతి డయాస్ తన ఇష్టానుసారం దేశం విడిచి వెళ్లాలని నిర్ణయించుకున్నారని ఆస్ట్రేలియా అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
The Paradise: 20 కోట్ల వ్యూస్తో దుమ్మురేపిన ‘ఆయా షేర్’.. ‘ది ప్యారడైజ్’ రిలీజ్ డేట్పై బిగ్ అప్డేట్!
-
Indian Idol 16 Winner: ఇండియన్ ఐడల్ 16 విజేతగా జ్యోతిర్మయి నాయక్.. ట్రోఫీతో పాటు రూ. 20 లక్షల ప్రైజ్ మనీ
-
Ram Charan: రామ్ చరణ్కు గాయం.. సర్జరీ కోసం కోయంబత్తూరు, RC17పై ప్రభావం?
-
CM Revanth Reddy : యువతే గేమ్చేంజర్.. మోడీపై రేవంత్ విమర్శలు
-
Sikandar Raza: ‘త్వరలోనే కొన్ని పరుగులు కొనుక్కుంటా’.. ఓటమిపై సికందర్ రజా ఆసక్తికర వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో చర్మ దురదకు చెక్.. త్రిఫలతో సహజ చిట్కాలు!
-
CSK-Hardik Pandya: ఇద్దరు టాప్ స్టార్ ప్లేయర్స్, రూ.10 కోట్లు.. హార్దిక్ పాండ్య కోసం సీఎస్కే భారీ ఆఫర్!
-
Ishan Kishan: వైభవ్ సూర్యవంశీకి అన్ని తెలుసు.. ఆ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త అని హెచ్చరించాం!
-
IND vs ZIM 3rd T20: మరో ఇద్దరు అరంగేట్రం.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. పిచ్, వెదర్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!