West Nile fever: కేరళలో ‘‘వెస్ట్ నైలు ఫీవర్’’ కలకలం.. 5 కేసులు నమోదు.. లక్షణాలు ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
West Nile fever: కేరళలో కొత్త వ్యాధి విస్తరిస్తోంది. ముఖ్యంగా త్రిసూర్, మలప్పురం, కోజికోడ్ జిల్లాలో ‘వెస్ట్ నైలు ఫీవర్’’ అనే జ్వరం సోకుతోంది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 5 కేసులు నమోదైనట్లుగా కేరళ ఆరోగ్యమంత్రి ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ వైరల్ ఇన్ఫెక్షన్ కేసుల పట్ల అన్ని జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. అయితే, ఈ జ్వరం కేరళలో నమోదవ్వడం ఇప్పుడే తొలిసారి కాదు. 2011లో కేరళలో ఈ జ్వరాన్ని తొలిసారిగా గుర్తించారు. 2019లో మలప్పురానికి చెందిన ఆరేళ్ల బాలుడు ఈ జ్వరంతో మరణించాడు. మళ్లీ 2022లో త్రిసూర్ జిల్లాలో 47 ఏళ్ల వ్యక్తి మరణించాడు.
వెస్ట్ నైలు జ్వరం అంటే ఏమిటి..? లక్షణాలు..
Also Read
- Ayodhya Ram Mandir: రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!
- Maharashtra Politics: ఉద్ధవ్ ఠాక్రే కోటలో మరోసారి చీలిక.. షిండే, లోక్సభ స్పీకర్తో భేటీకి ఎంపీలు రెడీ..
- Tamil Nadu Debt Crisis: పుట్టిన ప్రతి బిడ్డపై రూ.1.28 లక్షల అప్పు.. శ్వేతపత్రంలో సంచలన విషయాలు
- Dehradun: నేలరాలిన విద్యాకుసుమం.. 12వ తరగతి టాపర్ ఆత్మహత్య
1937లో ఉగాండాలో తొలిసారిగా ఈ ‘‘వెస్ట్ నైలు వైరస్’’ని గుర్తించారు. ఇది క్యూలెక్స్ జాతి దోమల ద్వారా వ్యాప్తిస్తుంది. ఈ దోమ కాటుకు గురైతే వైరస్ మన శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. వ్యాధి సోకిన పక్షులను దోమలు కుట్టిన సందర్భంలో ఇది దోమశరీరంలోకి ఆ తర్వాత మనిషిని కుట్టడం ద్వార మనిషి శరీరంలోకి వైరస్ ప్రవేశిస్తోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. 110 కంటే ఎక్కువ పక్షి జాతులు ఈ వైరస్ని కలిగి ఉంటాయి. వేసవి కాలంలో దోమ కాటుకు గురైతే ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది.
Read Also: Rajamouli: ‘బాహుబలి’ని మీరే చంపుకుంటున్నారా ? అంటే జక్కన్న సమాధానం ఇదే!
లక్షణాలు:
వైరస్ సోకిన తర్వాత తలనొప్పి, జ్వరం, కండరాల నొప్పి, తల తిరగడం, జ్ఞాపకశక్తి కోల్పోవడం వంటి లక్షణాలు ఉంటాయి. కొంతమందికి జ్వరం, తలనొప్పి, వాంతులు మరియు దురద వంటి లక్షణాలు ఉంటాయి మరియు ఒక శాతం కేసులలో మెదడు దెబ్బతినడం వల్ల అపస్మారక స్థితికి మరియు కొన్నిసార్లు మరణానికి దారితీస్తుందని కేరళ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
ఈ వైరస్ వల్ల ప్రజలు చనిపోతారా..?
వ్యాధి సోకిన చాలా మందికి చిన్నపాటి అనారోగ్యం ఉంటుంది. కానీ వృద్ధులు, పిల్లలు వంటి బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్న వారు ఎక్కువ అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. జపనీస్ ఎన్సెఫాలిటిస్తో పోలిస్తే మరణాల రేటు సాపేక్షంగా తక్కువగా ఉంటుంది. రిపోర్టుల ప్రకారం, వెస్ట్ నైలు ఫీవర్ మానవుల్లో ప్రాణాంతక నాడీ సంబంధిత వ్యాధికి కారణమవుతుంది.
దీనిని గుర్తించేందుకు ఈ వైరస్ ప్రతినిరోధకాల కోసం రక్త పరీక్ష చేయాల్సి ఉంటుంది. ఈ వైరస్కి మందులు, వ్యాక్సిన్ అందుబాటులో లేదు. లక్షణాల ఆధారంగా చికిత్స చేయాల్సి ఉంటుంది. యాంటీబయాటిక్స్ పనిచేయవు. తీవ్రమైన సందర్భాల్లో ఇంట్రావీనస్ ఫ్లూయిడ్స్, నొప్పి మందులు, నర్సింగ్ కేర్ వంటి సౌకర్యాలు అందించాలి.
ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు దోమలు కుట్టకుండా దోమ తెరలు వాడటం ద్వారా ఈ వ్యాధిని అరికట్టవచ్చు. ఒకసారి ఈ వైరస్ సోకితే మళ్లీ జీవితాంతం ఇమ్యూనిటీ ఉంటుందని నమ్ముతారు. అయితే కొన్ని సందర్భాల్లో బలహీనమైన ఇమ్యునిటీ ఉన్న వారికి మళ్లీ వచ్చే అవకాశం ఉంటుంది.
తాజావార్తలు
-
Dia Mirza : ప్రకృతి వనరులను అమ్మాయిలా వాడుకుని వదిలేయకండి.. నాగ్ హీరోయిన్ కామెంట్స్
-
Keerthy Suresh : కీర్తి సురేష్ కోర్ట్రూమ్ డ్రామా రిలీజ్ డేట్ ఫిక్స్ …
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Commodore CallBack 8020: డిజిటల్ వ్యసనానికి చెక్.. 48MP కెమెరా, డ్యూయల్ డిస్ప్లేతో కమోడోర్ కాల్బ్యాక్ 8020 లాంచ్
-
AP Weather Today: ఏపీకి వాతావరణ హెచ్చరిక.. ఆ రెండు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ!
ట్రెండింగ్
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!
-
Ayodhya Ram Mandir: రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!
-
Historical Day: నేడు ట్రిపుల్ ధమాకా.. టీమిండియా ఫ్యాన్స్కు పండగే.. 12 గంటల పాటు నాన్స్టాప్ ఎంటర్టైన్మెంట్!
-
8560mAh భారీ బ్యాటరీ, 6000 నిట్స్ డిస్ప్లే, IP69K రక్షణతో HONOR X70 Pro Max లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 7540mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI Turbo 5 లాంచ్.! ధర ఎంతంటే.?