Bengal Election: బెంగాల్లో రికార్డ్ స్థాయిలో ఓటింగ్.. ఎవరికి లాభం.. ఎవరికి నష్టం!
- బెంగాల్లో రికార్డ్ స్థాయిలో ఓటింగ్
- గత ఎన్నికల కంటే 10 శాతం అధికం
- తమదే విజయం అంటూ ప్రధాన పార్టీలు నమ్మకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ బెంగాల్లో జరిగిన మొదటి దశ పోలింగ్లో ఓటర్లు సునామీ సృష్టించారు. ఓటర్లంతా పోలింగ్ కేంద్రాలకు జాతరలా తరలివచ్చారు. మునుపెన్నడూ లేనంతగా ఓటర్లు తండోపతండాలుగా తరలివచ్చారు. స్వాతంత్ర్యం వచ్చాక బెంగాల్లో ఈ స్థాయిలో ఓటింగ్ నమోదు కావడం ఇదే తొలిసారి. స్వాతంత్ర్యం వచ్చాక ఇప్పటి వరకు బెంగాల్లో మూడు ప్రభుత్వాలు మారాయి. తొలుత కాంగ్రెస్.. అటు తర్వాత వామపక్షాలు.. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ ఏలుబడి చేస్తోంది. ఈ మూడు ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినప్పుడు.. ఎప్పుడూ ఇంత పోలింగ్ నమోదు కాలేదు. ఇదే తొలిసారి కావడం విశేషం.
పశ్చిమ బెంగాల్లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. గురువారం 152 స్థానాలకు పోలింగ్ జరిగింది. దాదాపు 92.88 శాతం ఓటింగ్ నమోదైనట్లుగా లెక్కలొచ్చాయి. గత ఎన్నికల కంటే 10 శాతం ఎక్కువ ఓటింగ్ నమోదైంది. ఎలక్షన్ ముందు ఎన్నికల సంఘం చేపట్టిన ‘‘సర్’’పై పెద్ద ఎత్తున దుమారం రేగింది. అర్హుల ఓట్లు తొలగించారంటూ టీఎంసీ ఆరోపించింది. అయితే ఈసారి పోలింగ్ కోసం కేంద్ర బలగాలను ఎన్నికల సంఘం దింపింది. దీంతో ఓటర్లు స్వేచ్ఛగా వచ్చి పోలింగ్లో పాల్గొన్నారు. పైగా కొత్త ఓటర్లు నూతనోత్సాహంతో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటేశారు. ఇక ఓటు వేయకపోతే ఓటు తొలగిస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ కారణంతో కూడా ఓటర్లు సునామీలా దూసుకొచ్చి ఓటేశారు.
Also Read
- Kangana Ranaut-Baba Ramdev: నా యవ్వనం గురించి మీకెందుకు బెంగ.. బాబా రామ్దేవ్పై కంగనా ఫైర్
- School Holidays: కుక్కల బెడదతో స్కూళ్లకు సెలవులు.. 4 రోజులు ఆన్లైన్ క్లాసులే..
- Amit shah: రేపు తమిళనాడులో దక్షిణాది ముఖ్యమంత్రులతో అమిత్ షా భేటీ.. ఆ 3 అంశాలపై చర్చ
- Gen-z Viral Video: మేము "జెన్-జీ" ఏమైనా చేస్తాం అంటే బాగుండదు.. లడఖ్ వైరల్ వీడియోపై సీఎం సెటైర్లు..
ఇక 2011లో మమతా బెనర్జీ వామపక్షాల కంచుకోటను బద్ధలుకొట్టారు. అనూహ్యంగా మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చారు. అప్పుడు బీజేపీ ఒక్క సీటు కూడా గెలవలేదు. ఇక 2016లో కూడా మరోసారి తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అప్పుడు బీజేపీ 59 సీట్లు గెలుచుకుంది. ఇక 2021లో జరిగిన ఎన్నికల్లో తిరిగి మమత అధికారంలోకి వచ్చినప్పటికీ.. ఆ ఎన్నికల్లో బీజేపీ 92 సీట్లు గెలుచుకుని బలమైన సందేశం పంపింది.
ఇప్పుడు తాజాగా జరిగిన ఎన్నికల్లో 92 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది. 2011లో స్వల్ప శాతంతో మమత అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు పెరిగిన పోలింగ్ శాతం ఎవరికి కలిసొస్తుందన్న దానిపై సర్వత్రా చర్చ నడుస్తోంది. మమతకు కలిసొస్తుందా? లేదంటే బీజేపీకి కలిసొస్తుందా? అన్నది మే 4న తేలిపోనుంది. ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి.
తాజావార్తలు
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
-
Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!