Bengal: సీఎం సువేందు తొలి కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం
- బెంగాల్లో సీఎం సువేందు తొలి కేబినెట్ భేటీ
- పలు కీలక నిర్ణయాలకు ఆమోదం
- కేబినెట్ నిర్ణయాలు వెల్లడించిన సీఎం సువేందు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ బెంగాల్లో ముఖ్యమంత్రి సువేందు అధికారి ఆధ్వర్యంలో తొలి కేబినెట్ సమావేశం అయింది. ఈ సందర్భంగా మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు వెంట కంచె నిర్మాణం కోసం 45 రోజుల్లో బీఎస్ఎఫ్కు భూములు బదిలీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ప్రజాకేంద్రీకృత పరిపాలన, భద్రత, సుపరిపాలన లక్ష్యంగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు ముఖ్యమంత్రి సువేందు అధికారి తెలిపారు.
సోమవారం నబన్నలో మంత్రులతో సువేందు అధికారి తొలి మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నాక.. సువేందు మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఘన విజయం అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. బెంగాల్ చరిత్రలో తొలిసారి ఎలాంటి హింస, బెదిరింపులు లేకుండా ఎన్నికలు జరిగాయని పేర్కొన్నారు. ప్రజల కోసం పనిచేస్తామని, ఎన్నికల సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారిని ఎప్పటికీ మర్చిపోమని తెలిపారు. వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Also Read
- Kangana Ranaut-Baba Ramdev: నా యవ్వనం గురించి మీకెందుకు బెంగ.. బాబా రామ్దేవ్పై కంగనా ఫైర్
- School Holidays: కుక్కల బెడదతో స్కూళ్లకు సెలవులు.. 4 రోజులు ఆన్లైన్ క్లాసులే..
- Amit shah: రేపు తమిళనాడులో దక్షిణాది ముఖ్యమంత్రులతో అమిత్ షా భేటీ.. ఆ 3 అంశాలపై చర్చ
- Gen-z Viral Video: మేము "జెన్-జీ" ఏమైనా చేస్తాం అంటే బాగుండదు.. లడఖ్ వైరల్ వీడియోపై సీఎం సెటైర్లు..
నిర్ణయాలు ఇవే..
కేబినెట్ సమావేశంలో తీసుకున్న ప్రధాన నిర్ణయాల్లో భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు వెంట కంచె నిర్మాణానికి 45 రోజుల్లో బీఎస్ఎఫ్కు భూముల బదిలీ, ఐఏఎస్, ఐపీఎస్, డబ్ల్యూబీపీఎస్ అధికారులపై రాష్ట్రం వెలుపల డిప్యూటేషన్, శిక్షణ కార్యక్రమాల పరిమితుల ఎత్తివేత, ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో అవకాశం కోల్పోయిన అభ్యర్థులకు ఐదేళ్ల వయో పరిమితి సడలింపు, భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)ను తక్షణ అమలు చేయడం, ఆయుష్మాన్ భారత్, ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన వంటి కేంద్ర పథకాల అమలు చేసేందుకు నిర్ణయం తీసుకుంది.
‘‘45 రోజుల్లో బీఎస్ఎఫ్కు భూములు అప్పగిస్తాం. దీనికి కేబినెట్ ఆమోదం తెలిపింది” అని సీఎం సువేందు అధికారి వెల్లడించారు. రాష్ట్ర అధికారులకు బయటి శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కల్పించడం ద్వారా పరిపాలనా సమన్వయం, సంస్థాగత అనుభవం పెరుగుతుందని ప్రభుత్వం తెలిపింది. ‘‘బాధ్యతాయుతమైన, పారదర్శకమైన, ప్రజా అనుకూల పరిపాలన నిర్మాణానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. రాష్ట్ర ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం’’. అని సువేందు అధికారి స్పష్టం చేశారు.
మే 4న విడుదలైన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 294 స్థానాలకు గాను 207 స్థానాలు కమలం పార్టీ కైవసం చేసుకుంది. ఇక గత శనివారం ముఖ్యమంత్రిగాసువేందు అధికారి ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో పాటుదిలీప్ ఘోష్, అగ్నిమిత్ర పాల్, అశోక్ కిర్తానియా, ఖుదిరామ్ టుడు, నిశిత్ ప్రమాణిక్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.
తాజావార్తలు
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
-
Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!