మా సీఎస్ను పంపేదిలేదు..! తెగేసిచెప్పిన దీదీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ప్రభుత్వం, పశ్చిమ బెంగాల్ సర్కార్ మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి.. తాజాగా, మరోసారి ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ… తమ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బంద్యోపాధ్యాయ్ ని రిలీవ్ చేయలేనని.. కేంద్రానికి పంపించేది లేదంటూ లేఖలో పేర్కొన్నారు.. తమ సీఎస్.. కేంద్రం దగ్గర రిపోర్ట్ చేయాలన్న ఉత్తర్వులను చూసి ఆశ్చర్యపోయానన్న ఆమె.. కేంద్రం ఏకపక్షంగా ఇచ్చిన ఆదేశాలను తనను షాక్కు గురుచేశాయని.. బెంగాల్ ప్రభుత్వం ఇలాంటి తీవ్ర పరిస్థితుల్లో తన చీఫ్ సెక్రటరీని రిలీవ్ చేయలేదని లేఖలో పేర్కొన్నారు. గతంలో ఆయన పదవీకాలాన్ని పొడిగిస్తూ ఇచ్చిన చట్టపరమైన ఆదేశాలు చెల్లుబాటు అవుతాయని తాము భావిస్తున్నట్లు కూడా లేఖలో రాసుకొచ్చారు దీదీ.. అంతేకాదు.. రాష్ట్రంలో కరోనా సంక్షోభ నిర్వహణను సీఎస్ చూసుకుంటారని కూడా తెలిపారు మమత బెనర్జీ.. కాగా, ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహించిన సమావేశానికి సీఎం మమతా బెనర్జీ.. హాజరుకాకపోవడంపై సీరియస్ అయిన కేంద్రం.. కొన్ని గంటల వ్యవధిలోనే చీఫ్ సెక్రటరీ ఢిల్లీలో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే.. ఆ ఉత్తర్వుల ప్రకారం.. ఇవాళ ఉదయం 10 గంటలకు బెంగాల్ సీఎస్ ఆలాపన్ బంద్యోపాధ్యాయ్ ఢిల్లీలో రిపోర్ట్ చేయాల్సి ఉంది. కానీ, ఇదే సమయంలో.. ప్రధానికి లేఖ రాశారు దీదీ. ఆ ఆదేశాలు చట్టపరంగా చెల్లవని, ఇవి అసాధారణం, రాజ్యాంగ విరుద్ధమని తన లేఖలో పేర్కొన్నారు బెంగాల్ ముఖ్యమంత్రి.
Also Read
- Ayodhya Ram Mandir: బ్యాంకులకు చేరిన రామాలయ కానుకల చోరీ కేసు.. ఎస్బీఐతో పాటు మరో 5 బ్యాంకులకు నోటీసులు!
- Mumbai: ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం.. రెస్క్యూ ఆపరేషన్ ఫెయిల్.. చివరికిలా..!
- EV Push: ఢిల్లీలో సర్కార్ సంచలనం.. 2028 నుంచి పెట్రోల్ బైక్లపై కంప్లీట్ బ్యాన్!
- Ketan Agarwal Case: చదువులో జీరో.. ఇంటర్ ఫెయిల్ తర్వాత సియా ఏం చేసిందంటే..!
తాజావార్తలు
-
Raghav Niharika: బాలీవుడ్ నటుడితో తెలుగు అమ్మాయి లవ్ ట్రాక్? నెట్టింట ఫొటోలు వైరల్!
-
Eng vs NZ: ఇంగ్లండ్కు చుక్కలు చూపించిన న్యూజిలాండ్.. 160 పరుగుల భారీ విజయం, టెస్ట్ సిరీస్ కైవసం.!
-
Ayodhya Ram Mandir: బ్యాంకులకు చేరిన రామాలయ కానుకల చోరీ కేసు.. ఎస్బీఐతో పాటు మరో 5 బ్యాంకులకు నోటీసులు!
-
Mumbai: ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం.. రెస్క్యూ ఆపరేషన్ ఫెయిల్.. చివరికిలా..!
-
India Qualifies Olympics: 128 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్లో క్రికెట్.. అర్హత సాధించిన భారత మహిళలు.!
ట్రెండింగ్
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!