Eknath Shinde: సిద్ధిఖీ హత్యలో నిందితులను కఠినంగా శిక్షిస్తాం..
- బాబా సిద్ధిఖీ హత్యలో నిందితులను కఠినంగా శిక్షిస్తాం..
- రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే..
- ప్రజలకు సేవ చేయడమంటే ఆఫీసులో ఉండి.. ఫేస్బుక్ లైవ్లో ప్రభుత్వాన్ని నడపటం కాదు: ఏక్నాథ్ షిండే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Eknath Shinde: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయాలు హీట్ ఎక్కాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఈ క్రమంలో సీఎం ఏక్నాథ్ షిండే మాట్లాడుతూ.. ఎన్సీపీ నేత, మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్యకు సంబంధించిన నిందితులను ఎవరి కూడా వదిలి పెట్టేది లేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.. ఈ ఘటన చాలా దురదృష్టకరం అని చెప్పుకొచ్చారు. ఈ హత్యకు సంబంధించిన పలువురు నిందితులు ఇప్పటికే అరెస్ట్ చేశాం.. ఇందులో భాగస్వాములైన వారిపై సర్కార్ కఠిన చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి షిండే వెల్లడించారు.
Read Also: Unique Tradition: వైరెటీ సంప్రదాయం.. ఆవుల మందతో తొక్కించుకుంటున్న యువకులు
Also Read
ఇక, ఈ సందర్భంగా శివసేన (యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేపై సీఎం ఏక్ నాథ్ షిండే తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నేను మహావికాస్ అఘాడి సర్కార్ లో భాగస్వామిగా ఉండేవాణ్ణి.. ఆ ప్రభుత్వం బాలాసాహెబ్ ఠాక్రే ఆశయాలకు విరుద్ధంగా పని చేసింది.. శివసేన, బీజేపీ పార్టీలు సరైన మార్గంలోనే వెళ్తున్నాయి.. ఉద్ధవ్ ఠాక్రే ఆయన వ్యక్తిగత ప్రయోజనాల కోసమే కాంగ్రెస్తో జత కట్టాయని ఆరోపించారు. ఇది బాలాసాహెబ్ ఠాక్రే ఎప్పుడూ కోరుకోలేదని ఆయన పేర్కొన్నారు. శివసేన కార్యకర్తలుగా పార్టీ క్రమశిక్షణను అనుసరిస్తూ.. మార్పు అవసరమని గ్రహించాం.. అందులో భాగంగానే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామన్నారు. ముఖ్యమంత్రిగా ప్రజలకు సేవ చేయడం అంటే ఆఫీసులో ఉండి.. ఫేస్బుక్ లైవ్లో సర్కార్ నడపడం కాదని విమర్శించారు. ప్రజల మధ్యలో ఉండి పాలన చేయాలని ఉద్ధవ్ ఠాక్రేను ఉద్దేశించి ఏక్ నాథ్ షిండే విమర్శలు గుప్పించారు. ఇక, మొత్తం 288 స్థానాలకు ఈనెల 20న ఎన్నికలు జరగనుండగా.. 23న తుది ఫలితాలు వెల్లడించనున్నారు.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!