Pahalgam attack: ‘‘కాశ్మీర్లో రక్తపాతం సృష్టిస్తాం’’.. దాడికి ముందు లష్కర్ కమాండర్..
- పహల్గామ్ దాడికి ముందు లష్కరే తోయిబా కమాండర్ హెచ్చరిక..
- కాశ్మీర్లో రక్తపాతం పారిస్తామని వ్యాఖ్యలు..
- పీఓకేలోని రావల్ కోట్లో జరిగిన ఉగ్రవాద కార్యక్రమంలో కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pahalgam attack: పహల్గామ్ దాడికి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ దాడికి కొన్ని రోజులు ముందే, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. కాశ్మీర్ తమ జీవనాడి అని, కాశ్మీర్ కోసం పోరాడుతున్నవారికి సాయం చేస్తామని చెప్పారు. పరోక్షంగా ఉగ్రవాదానికి మద్దతు ఉంటుందని చెప్పారు. మునీర్ ఈ వ్యాఖ్యలు చేసిన రోజుల వ్యవధిలోనే ఉగ్రదాడి జరిగింది. మంగళవారం జరిగిన పహల్గామ్ ఉగ్రదాడిలో, కాశ్మీర్ అందాలను చూసేందుకు వచ్చిన అమాయకపు టూరిస్టుల్ని ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఈ దాడి వెనక పాక్ ప్రేరేపిత లష్కరే తోయిబాకు చెందిన ‘‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’’ ఉగ్రవాద సంస్థ హస్తం ఉంది.
Read Also: Pahalgam Terror Attack: పహల్గామ్ టెర్రర్ అటాక్ని ఖండించిన చైనా..
Also Read
- Jantar Mantar: జంతర్ మంతర్లో నిరసనలు అవసరమా? ఢిల్లీ హైకోర్టు ప్రశ్న
- Delhi: ఘోరం.. వెబ్ సిరీస్ చూసి భార్యను చంపిన టెకీ.. ఆ తర్వాత ఏం చేశాడంటే..!
- Agni-4: అగ్ని-4 శక్తి ఇదే.. పాకిస్తాన్ మొత్తం, బీజింగ్-షాంఘై కూడా భారత పరిధిలోనే..
- PM Modi: ఆందోళన వద్దు.. ధైర్యంగా ఉండండి.. టీఎంసీ తిరుగుబాటు ఎంపీలకు మోడీ భరోసా
దీనికి తోడు, ఇటీవల పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లోని రావల్కోట్ లోని ఖై గాలాలో జరిగిన ఓ ర్యాలీలో లష్కరే తోయిబా కమాండర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. జమ్మూ కాశ్మీర్లో జిహాద్, రక్తపాతానికి పిలుపునిచ్చాడు. జమ్మూ కాశ్మీర్ యునైటెడ్ మూవ్మెంట్ (జెకెయుఎం) ఉగ్రసంస్థ లీడ్ కమాండర్ అబూ ముసా, సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ, ఆర్టికల్ 370 రద్దు మరియు కాశ్మీర్ జనాభాను మార్చడానికి లోయలో దాడులకు పిలుపునిచ్చాడు.
‘‘భారతదేశం జనాభాను మార్చడానికి ఆర్టికల్ 370 మరియు 35ఎలను తొలగించింది. మీరు మీ 10 లక్షల మంది సైన్యాన్ని మోహరించారు. మీరు పుల్వామా, పూంచ్, రాజౌరిలో ‘రామ్ రామ్’ను ప్రతిధ్వనించాలనుకున్నారు. లష్కరే తోయిబా మీ సవాలును స్వీకరిస్తుంది. మూసివేసిన కోర్టు గదుల లోపల, మోడీ మీరు మీ ఆదేశాలను ఆమోదించారు. కానీ యుద్ధభూమి ముజాహిదీన్లది. ఇన్షా అల్లాహ్, మేము బుల్లెట్లను కురిపిస్తాము, మీ మెడలు కోస్తాము , మా అమరవీరుల త్యాగాలను గౌరవిస్తాము’’ అని విద్వేష ప్రసంగం చేశాడు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది.
Pakistani govt forces officially in uniform were providing security for the Lashkar-e-Taiba Terror conference in which LeT militant cmdr Abu Musa was heard spewing venom against Hindus in the Khaigala area of Rawalkot, Poonch #AzadKashmir (Pakistan occupied J&K). pic.twitter.com/A4zTDOY5QT
— Subcontinental Defender 🛃 (@Anti_Separatist) April 19, 2025
తాజావార్తలు
-
FCRA Bill: ‘మా చట్టాల గురించి మీకెందుకు?’.. అమెరికాకు భారత్ ఘాటు సమాధానం
-
Sarfaraz Khan: నేను ఇమడలేకపోతున్నాను.. కానీ పోరాడతా’.. సర్ఫరాజ్ పోస్ట్ వైరల్.. అసలు అర్థం ఇదేనా?
-
Jantar Mantar: జంతర్ మంతర్లో నిరసనలు అవసరమా? ఢిల్లీ హైకోర్టు ప్రశ్న
-
TG Education: స్కూల్ ఫీజుల నియంత్రణపై కీలక అడుగు.. ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ..
-
Defence Agreement: రక్షణ ఒప్పందంపై సౌదీ-పాక్-టర్కీ సంతకాలు.. ఉద్దేశమిదేనంట!
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!