Maharashtra: అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాం.. మహావికాస్ అఘాడి ప్రకటన
- మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు మొదలు
- మహావికాస్ అఘాడి శనివారం సంయుక్తంగా విలేకరుల సమావేశం
- అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేస్తామని మహావికాస్ అఘాడీ ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లోక్సభ ఎన్నికల అనంతరం మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు మొదలయ్యాయి. శివసేన, యుబిటి చీఫ్ ఉద్ధవ్ థాకరే, ఎన్సిపి (ఎస్పి) చీఫ్ శరద్ పవార్ మరియు కాంగ్రెస్ నాయకుడు పృథ్వీరాజ్ చవాన్ ఎన్డిఎ కూటమిని లక్ష్యంగా చేసుకుని లోక్సభలో విజయం సాధించింది. ఈ క్రమంలో మహావికాస్ అఘాడి శనివారం సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేస్తామని మహావికాస్ అఘాడీ ప్రకటించింది. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ. ఎన్డీఏ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
Also Read
- Nashik Forced Conversion: బలవంతపు మతమార్పిడి, లైంగిక వేధింపుల ప్రధాన నిందితురాలు నిదా ఖాన్ అరెస్టు
- DMK vs AIADMK: డీఎంకె-ఏఐఏడీఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. మూకుమ్మడిగా రాజీనామా చేస్తాం.. విజయ్ ఎమ్మెల్యేల హెచ్చరిక
- Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
- TVK Vijay: విజయ్కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్లపై వామపక్షాలు గుర్రు!
శివసేన (ఉద్ధవ్ వర్గం) అధినేత ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వాన్ని తీవ్రంగా టార్గెట్ చేశారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఇది (లోక్సభ ఎన్నికలు) పోరాటమని.. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయని అన్నారు. ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఎన్డీయే ప్రభుత్వంగా మారిందని.. ఈ ప్రభుత్వం ఎంతకాలం పని చేస్తుందనేది అనుమానమేని వ్యాఖ్యానించారు. మరోవైపు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ మాట్లాడుతూ.. “ప్రధాని రోడ్ షో మరియు ర్యాలీ ఎక్కడ జరిగినా.. మేము అక్కడ గెలిచాము. కాబట్టి, ప్రధానమంత్రికి ధన్యవాదాలు చెప్పడం నా కర్తవ్యంగా భావిస్తున్నాను.” అని పేర్కొన్నారు.
Petrol: వాహనదారులకు షాక్.. కర్ణాటకలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
కాంగ్రెస్ నాయకుడు పృథ్వీరాజ్ చవాన్ మాట్లాడుతూ, “మహారాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు.. ప్రతి ఒక్కరికీ మా కృతజ్ఞతలు తెలియజేయడానికి మేమంతా కలిసి ఈ రోజు మీటింగ్ ఏర్పాటు చేశామన్నారు. మహారాష్ట్ర ప్రజలు MVA అభ్యర్థులను గెలిపించారని తెలిపారు. లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత మొదటిసారిగా మహారాష్ట్రలోని భారత్ కూటమి నేతలు ఈరోజు సమావేశమయ్యారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు అందరం కలిసి వచ్చామని.. లోక్సభ ఎన్నికల్లో ప్రజలు తమకు ఎలా ఓటేశారో, అదే ప్రేమను అసెంబ్లీ ఎన్నికల్లోనూ చూపించాలని తెలిపారు. మహారాష్ట్రలో అధికార మార్పిడి జరుగుతుందని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొ్న్నారు.
తాజావార్తలు
-
Weather Forecast Today: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. రెండు రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు!
-
Laila: జ్యోతికకు తెలిస్తే చంపేస్తుంది.. సూర్య పై ఓపెన్ కామెంట్స్ చేసిన లైలా
-
IPL Playoffs: ఐపీఎల్ ప్లేఆఫ్స్ లో.. వరుసగా ఐదు మ్యాచ్లలో ఐదు అర్ధ సెంచరీలు సాధించిన తొలి భారతీయుడు అతనే..
-
PEDDI North America Bookings : పెద్ది ఓవర్సీస్.. నార్త్ అమెరికా బుకింగ్స్ ఓపెన్.. 30 నిమిషాల్లో ఊచకోత
-
Nashik Forced Conversion: బలవంతపు మతమార్పిడి, లైంగిక వేధింపుల ప్రధాన నిందితురాలు నిదా ఖాన్ అరెస్టు