Gyanvapi Mosque case: “విజయం అంచున ఉన్నాం”.. జ్ఞానవాపి నివేదికపై హిందూ తరపు న్యాయవాది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gyanvapi Mosque case: జ్ఞానవాపి మసీదు కేసులో ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐఏ) సర్వే నివేదిక వచ్చిన తర్వాత.. తాము విజయానికి చేరువలో ఉన్నామంటూ హిందూ పక్షం న్యాయవాది విష్ణుశంకర్ జైన్ గురువారం అన్నారు. ఏఎస్ఐ సర్వే నివేదిక వాజుఖానాలోని ఉన్నది శివలింగమా..? లేక ఫౌంటైనా.? అనేది తేలుస్తుందని ఆయన చెప్పారు. ‘‘వాజుఖనాలోని బావిలోని చేపలు చనిపోవడంతో వాటిని క్లీనింగ్ కోసం కోర్టులో దరఖాస్తు చేశాము. ఇక్కడ కూడా ఏఎస్ఐ సర్వే కోసం సుప్రీం కోర్టులో దరఖాస్తు చేస్తాం. సర్వేపై స్టే తొలగించాలని కోరాము. ప్రస్తుతం దీని కస్టడీ వారణాసి జిల్లా మెజిస్ట్రేట్ వద్ద ఉంది. ఏఎస్ఐ నివేదిక వచ్చిన తర్వాత మేము విజయం అంచున ఉంటామని నేను చెప్పగలను’’ అని ఆయన అన్నారు.
Read Also: Nani: బలగం వేణు దర్శకత్వంలో రెండో సినిమాకి నాని గ్రీన్ సిగ్నల్?
Also Read
- Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
- Siddaramaiah: డీకేకు చెక్ పెట్టాలని సిద్ధరామయ్య ప్లాన్.. హైకమాండ్ షాక్
- Congress: భారత్పై నెతన్యాహూ ప్రశంసలు.. మోడీపై కాంగ్రెస్ విమర్శలు..
- Trinamool Congress: ‘‘ముస్లింల కోసమే పనిచేసింది’’.. టీఎంసీ పార్టీ చీఫ్ రాజీనామా..
జ్ఞాన్వాపి మసీదు అక్రమ ఆక్రమణ నుంచి విముక్తి పొందే రోజు మనం చూడగమని విష్ణు శంకర్ జైన్ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే ఏఎస్ఐ తన నివేదికను గురువారం బహిరంగపరచాలని హార్డ్ కాపీని ఇరు వర్గాలకు అందించాలని వారణాసి జిల్లా కోర్టు బుధవారం తీర్పు చెప్పింది. కోర్టు ఆదేశాల తర్వాత హిందూ న్యాయవాది హరిశంకర్ జైన్ మాట్లాడుతూ.. ‘‘మసీదు నిర్మాణానికి మార్గం కల్పించడానికి మందిరాన్ని కూల్చివేసినట్లు చూపించడానికి ఆధారాలు ఉన్నాయి’’ అని వాదించారు. కోర్టులో వాదనల తర్వాత ఇరు పక్షాలు అంగీకరించడంతో నివేదిక బహిరంగపరచాలని కోర్టు ఆదేశించింది.
అంతకుముందు జనవరి 16న జ్ఞాన్వాపి మసీదులోని ‘వజుఖానా’లో శివలింగం ఉందని ఆరోపించబడుతున్న ప్రాంతాన్ని శుభ్రం చేయాలని కోరుతూ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేయగా.. అందుకు అత్యున్నత న్యాయస్థానం అంగీకరించింది. 2022లో కోర్టు ఆదేశాల మేరకు మసీదులో వీడియోగ్రఫీ సర్వే నిర్వహించారు. ఇందులో వాజూఖానా ప్రాంతంలోని ఓ కొలనులో శివలింగం వంటి ఆకారం బయటపడింది. హిందువులు దీనిని శివలింగం అని చెబుతుండగా.. మసీదు కమిటీ మాత్రం దీన్ని ‘ఫౌంటెన్’ అని చెబుతోంది.
తాజావార్తలు
-
IPL 2026: క్వాలిఫయర్-2లో రాజస్థాన్పై గుజరాత్ ఘనవిజయం.. ఫైనల్లో బెంగళూరుతో ఢీ.!
-
OTR : తెలంగాణలో పెరిగిపోతున్న ఫ్రంటల్ పైరవీలు!
-
Story Board: కర్ణాటకలో సీఎం మార్పునకు కారణాలేంటి..?
-
Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
-
Honor Win Turbo: హానర్ విన్ టర్బో రిలీజ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..