Gyanvapi Mosque case: “విజయం అంచున ఉన్నాం”.. జ్ఞానవాపి నివేదికపై హిందూ తరపు న్యాయవాది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gyanvapi Mosque case: జ్ఞానవాపి మసీదు కేసులో ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐఏ) సర్వే నివేదిక వచ్చిన తర్వాత.. తాము విజయానికి చేరువలో ఉన్నామంటూ హిందూ పక్షం న్యాయవాది విష్ణుశంకర్ జైన్ గురువారం అన్నారు. ఏఎస్ఐ సర్వే నివేదిక వాజుఖానాలోని ఉన్నది శివలింగమా..? లేక ఫౌంటైనా.? అనేది తేలుస్తుందని ఆయన చెప్పారు. ‘‘వాజుఖనాలోని బావిలోని చేపలు చనిపోవడంతో వాటిని క్లీనింగ్ కోసం కోర్టులో దరఖాస్తు చేశాము. ఇక్కడ కూడా ఏఎస్ఐ సర్వే కోసం సుప్రీం కోర్టులో దరఖాస్తు చేస్తాం. సర్వేపై స్టే తొలగించాలని కోరాము. ప్రస్తుతం దీని కస్టడీ వారణాసి జిల్లా మెజిస్ట్రేట్ వద్ద ఉంది. ఏఎస్ఐ నివేదిక వచ్చిన తర్వాత మేము విజయం అంచున ఉంటామని నేను చెప్పగలను’’ అని ఆయన అన్నారు.
Read Also: Nani: బలగం వేణు దర్శకత్వంలో రెండో సినిమాకి నాని గ్రీన్ సిగ్నల్?
Also Read
- Manu Bhaker: జెన్-జీ ఉద్యమంపై మను భాకర్ కీలక వ్యాఖ్యలు
- Supreme Court: సహజీవనంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. 498A వర్తింపు.. కానీ, షరతులు వర్తిస్తాయి..!
- Abhijeet Dipke: అమెరికా చదువుపై విమర్శలు.. క్లారిటీ ఇచ్చిన అభిజీత్ దీప్కే
- LPG e-KYC Deadline: గ్యాస్ వినియోగదారులకు కీలక హెచ్చరిక.. ఈ డెడ్లైన్ మిస్ అయితే.. నో గ్యాస్..!
జ్ఞాన్వాపి మసీదు అక్రమ ఆక్రమణ నుంచి విముక్తి పొందే రోజు మనం చూడగమని విష్ణు శంకర్ జైన్ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే ఏఎస్ఐ తన నివేదికను గురువారం బహిరంగపరచాలని హార్డ్ కాపీని ఇరు వర్గాలకు అందించాలని వారణాసి జిల్లా కోర్టు బుధవారం తీర్పు చెప్పింది. కోర్టు ఆదేశాల తర్వాత హిందూ న్యాయవాది హరిశంకర్ జైన్ మాట్లాడుతూ.. ‘‘మసీదు నిర్మాణానికి మార్గం కల్పించడానికి మందిరాన్ని కూల్చివేసినట్లు చూపించడానికి ఆధారాలు ఉన్నాయి’’ అని వాదించారు. కోర్టులో వాదనల తర్వాత ఇరు పక్షాలు అంగీకరించడంతో నివేదిక బహిరంగపరచాలని కోర్టు ఆదేశించింది.
అంతకుముందు జనవరి 16న జ్ఞాన్వాపి మసీదులోని ‘వజుఖానా’లో శివలింగం ఉందని ఆరోపించబడుతున్న ప్రాంతాన్ని శుభ్రం చేయాలని కోరుతూ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేయగా.. అందుకు అత్యున్నత న్యాయస్థానం అంగీకరించింది. 2022లో కోర్టు ఆదేశాల మేరకు మసీదులో వీడియోగ్రఫీ సర్వే నిర్వహించారు. ఇందులో వాజూఖానా ప్రాంతంలోని ఓ కొలనులో శివలింగం వంటి ఆకారం బయటపడింది. హిందువులు దీనిని శివలింగం అని చెబుతుండగా.. మసీదు కమిటీ మాత్రం దీన్ని ‘ఫౌంటెన్’ అని చెబుతోంది.
తాజావార్తలు
-
Donga Naa Koduku: జాగ్రత్త.. ‘దొంగ నా కొడుకు’ వస్తున్నాడు! ఇంట్రెస్టింగ్ అనౌన్స్మెంట్ చూశారా..
-
Nani – Nithiin: 20 ఏళ్లలో ఎంత మార్పు.. ఒకప్పుడు నితిన్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్.. ఇప్పుడు అదే హీరోకు నిర్మాతగా!
-
Manu Bhaker: జెన్-జీ ఉద్యమంపై మను భాకర్ కీలక వ్యాఖ్యలు
-
Amazon Sale: అమేజాన్ ‘గ్రేట్ ఫ్రీడమ్ సేల్’లో అద్భుత ఆఫర్స్.. ఆ ఫోన్లపై ఏకంగా రూ.10 వేలు తగ్గింపు..
-
Supreme Court: సహజీవనంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. 498A వర్తింపు.. కానీ, షరతులు వర్తిస్తాయి..!
ట్రెండింగ్
-
Kitchen Hacks : ఈ సింపుల్ చిట్కాతో.. కరివేపాకు పాడవకుండా నెలరోజులు ఫ్రెష్గా ఉంటుంది..!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వానపాముల బెడదా..? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా చెక్ పెట్టండి.!
-
7050mAh భారీ బ్యాటరీ, 6.83 అంగుళాల కర్వ్డ్ OLED డిస్ప్లే, 50MP Sony కెమెరాతో రానున్న vivo S2.!
-
Mushroom Onion Pakoda: ఈజీ స్నాక్ రెసిపీ..10 నిమిషాల్లో కరకరలాడే ‘మష్రూమ్ ఆనియన్ పకోడీ’.! చేసేయండి ఇలా..
-
Mumbai Indians Captain: ముగ్గురు దిగ్గజాల సపోర్ట్.. తెలుగు ఆటగాడికి ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ!