Vodafone Idea AGR dues : కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. వోడాఫోన్ ఐడియాకు భారీ ఊరట..
- వోడాఫోన్ ఐడియాకు ఊరట
- AGR బాకీలపై మారటోరియం
- వడ్డీ భారం తగ్గింపు
- టెలికాం పోటీకి బలం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vodafone Idea AGR dues : తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన టెలికాం దిగ్గజం వోడాఫోన్ ఐడియాను గట్టెక్కించే దిశగా కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. బుధవారం సమావేశమైన కేంద్ర క్యాబినెట్, కంపెనీ చెల్లించాల్సిన సుమారు రూ. 87,695 కోట్ల సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (AGR) బాకీల విషయంలో ఊరట ప్యాకేజీకి ఆమోదం తెలిపింది. ఈ ప్యాకేజీలో భాగంగా కంపెనీ తన బాకీలను చెల్లించే విషయంలో ఐదేళ్ల పాటు మారటోరియం విధిస్తూ ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది.
అంటే, ఈ భారీ మొత్తాన్ని వోడాఫోన్ ఐడియా తక్షణమే చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ నిధులను ఫ్రీజ్ చేయడమే కాకుండా, వీటి చెల్లింపు గడువును 2031-32 ఆర్థిక సంవత్సరం నుండి 2040-41 వరకు, అంటే పదేళ్ల పాటు వాయిదాల పద్ధతిలో చెల్లించేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఈ నిర్ణయం వల్ల కంపెనీకి తక్షణమే నగదు లభ్యత పెరగడంతో పాటు, నెట్వర్క్ విస్తరణ , 5G సేవలపై పెట్టుబడి పెట్టేందుకు అవకాశం లభిస్తుంది.
Also Read
- Renukaswamy Murder: నటుడు దర్శన్కు బిగుస్తోన్న ఉచ్చు.. సహ నిందితుడి సంచలన వాంగ్మూలం
- Rahul Gandhi: ఇటలీ ప్రధాని మెలోనీని టార్గెట్ చేసిన కాంగ్రెస్.. రాహుల్ గాంధీ వీడియో వైరల్
- Bihar: ఇన్స్టాలో ప్రేమ.. పెళ్లైన గంటల్లోనే వధువు మృతి.. ఏం జరిగిందంటే..!
- Kangana Ranaut: ‘‘పాకిస్తాన్ ప్రేమ ఎప్పుడు ముగుస్తుంది’’.. బాలీవుడ్ పరువు తీసిన కంగనా..
Konaseema District: ఏపీలో శివలింగం ధ్వంసం కేసులో సంచలన విషయాలు.. నిందితుడు ఎవరంటే..?
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వెనుక బలమైన కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా భారతదేశ టెలికాం రంగం కేవలం రెండు ప్రైవేట్ కంపెనీల గుత్తాధిపత్యంలోకి వెళ్లకుండా ఉండాలంటే, మూడో ప్రధాన సంస్థగా వోడాఫోన్ ఐడియా మనుగడ సాగించడం అత్యవసరం. ఒకవేళ ఈ కంపెనీ దివాలా తీస్తే, అందులో దాదాపు 49 శాతం వాటా కలిగిన ప్రభుత్వానికి భారీ నష్టం వాటిల్లడమే కాకుండా, సుమారు 20 కోట్ల మంది వినియోగదారులు ఇబ్బందులు పడతారని కేంద్రం భావించింది. అందుకే, ఈ ఐదేళ్ల మారటోరియం కాలంలో పెండింగ్ బాకీలపై ఎటువంటి అదనపు వడ్డీని కూడా వసూలు చేయకూడదని నిర్ణయించడం విశేషం.
దీనివల్ల కంపెనీకి సుమారు రూ. 18,000 కోట్ల వరకు వడ్డీ భారం తగ్గే అవకాశం ఉంది. అయితే, ఈ ఫ్రీజ్ చేసిన మొత్తాన్ని టెలికాం శాఖ మరోసారి క్షుణ్ణంగా ఆడిట్ చేసి సమీక్షిస్తుందని, తుది లెక్కలు కమిటీ నివేదిక ఆధారంగా ఖరారు అవుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. మొత్తం మీద ఈ భారీ ప్యాకేజీ వోడాఫోన్ ఐడియాకు ఊపిరి పోయడమే కాకుండా, టెలికాం రంగంలో ఆరోగ్యకరమైన పోటీని నిలబెట్టడానికి దోహదపడనుంది.
Hyundai Creta Sales 2025: ఈ ఏడాది అమ్మకాల్లో హ్యుందాయ్ క్రేటా సంచలనం.. గంటకు 23 కార్లు విక్రయం..!
తాజావార్తలు
-
Offer for Gamers: వీడియో గేమ్ ఆడేవారికి రూ.1.38 కోట్ల ప్యాకేజీ.. డిగ్రీ అవసరం లేకుండానే ఉద్యోగం..
-
Renukaswamy Murder: నటుడు దర్శన్కు బిగుస్తోన్న ఉచ్చు.. సహ నిందితుడి సంచలన వాంగ్మూలం
-
BE ALERT: అనకాపల్లిలో దారుణం.. బాలికపై లైంగిక దాడి, తల్లిపైనా పోక్సో కేసు
-
Khiladi Wife: పక్కా ప్లాన్ చేసింది.. భర్తను లేపేసింది..
-
Rahul Gandhi: ఇటలీ ప్రధాని మెలోనీని టార్గెట్ చేసిన కాంగ్రెస్.. రాహుల్ గాంధీ వీడియో వైరల్
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!