Tamil Nadu: ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం.. విజయ్ అభిమానుల్లో తీవ్ర ఆవేదన.. ఆత్మహత్యాయత్నం కలకలం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu: తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ స్పష్టమైన మెజారిటీ సాధించలేకపోవడంతో ప్రభుత్వం ఏర్పాటు ఆలస్యం అవుతోంది. ఈ పరిణామాలు విజయ్ అభిమానుల్లో తీవ్ర భావోద్వేగాలకు దారితీస్తున్నాయి. శనివారం జరగాల్సిన విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా రద్దు కావడంతో పార్టీ కార్యకర్తల్లో అసంతృప్తి మరింత పెరిగింది. ఇదే సమయంలో విజయ్కు మద్దతుగా ఉన్న ఓ అభిమాని ఆత్మాహుతికి యత్నించడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
సుమారు 40 ఏళ్ల వయసున్న ఇసక్కియప్పన్ అనే వ్యక్తి తనకు తాను నిప్పంటించుకుని తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విజయ్ ముఖ్యమంత్రి కావడంలో జరుగుతున్న జాప్యంపై తీవ్ర ఆవేదనతోనే ఈ చర్యకు పాల్పడ్డాడని స్థానికులు చెబుతున్నారు. ఇదే వ్యక్తి గతంలో కూడా విజయ్ ముఖ్యమంత్రి కావాలనే ఆకాంక్షతో తన ముఖానికి 16 అడుగుల పొడవైన ‘వేల్’ (ఈటె)ను గుచ్చుకున్నట్లు సమాచారం. దీంతో అతని తీవ్ర అభిమాన భావోద్వేగాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి.
Also Read
- Swine Flu H1N1 in India: H1N1 కొత్త వేరియంట్ వచ్చిందా? కరోనా లాంటి ముప్పు ఉందా? ICMR కీలక సమాచారం
- Kangana Ranaut: ‘వాళ్లంతా పనికిమాలిన వాళ్లు’.. తాప్సీ, బాబా రామ్దేవ్పై కంగనా ఘాటు వ్యాఖ్యలు
- CJP: ఢిల్లీలో సెప్టెంబర్ 5న భారీ నిరసన మార్చ్.. మరోసారి ఆందోళనకు సిద్ధమైన విద్యార్థులు
- Tamil Nadu: తీవ్ర దుమారం రేపుతోన్న పొట్టి దుస్తుల వ్యవహారం.. మంత్రి కీర్తన ఘాటు స్పందన
ఇక రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు అంశంపై ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో తమిళిసై సౌందరరాజన్ స్పందించారు. రాష్ట్ర ప్రజలు కొత్త ప్రభుత్వం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని, ఈ సమయంలో శాంతి భద్రతలు కాపాడటం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. విజయ్ తన అభిమానులకు, కార్యకర్తలకు శాంతిని పాటించాలని, ఎలాంటి ప్రమాదకర చర్యలకు పాల్పడవద్దని వెంటనే పిలుపునివ్వాలని తమిళిసై విజ్ఞప్తి చేశారు. రాజకీయ పరిస్థితులపై భావోద్వేగంతో స్పందిస్తున్న కార్యకర్తల పరిస్థితి ఆందోళన కలిగిస్తోందన్నారు.
ఇదిలా ఉండగా, వల్లియూర్ ప్రాంతంలో మరో యువకుడు కూడా ఆత్మాహుతికి యత్నించినట్లు వార్తలు వచ్చాయి. అలాగే వీసీకే కార్యాలయం వెలుపల ఓ యువకుడిపై బ్లేడుతో దాడి జరిగిన ఘటన కూడా ఉద్రిక్తతలకు దారితీసింది. అయితే, ప్రస్తుతం తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చుట్టూ నెలకొన్న రాజకీయ అనిశ్చితి, అభిమానుల భావోద్వేగాలు రాష్ట్ర రాజకీయాలను మరింత హీటెక్కుతున్నాయి..
తాజావార్తలు
-
Rajni Autobiography : ఆత్మకథ రాస్తున్న రజనీ.. సినిమాగా తీస్తే అదొక అద్భుతమే
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
Strait of Hormuz: హోర్ముజ్పై ఇరాన్ కొత్త ప్లాన్.. ప్రపంచ దేశాలకు బిగ్ షాక్..
-
KA Productions: కిరణ్ అబ్బవరం బ్యానర్లో మరో డిఫరెంట్ మూవీ.. గూస్బంప్స్ తెప్పిస్తున్న మిస్టరీ పోస్టర్!
-
Irumudi Movie Controversy : ‘ఇరుముడి’ సినిమాపై వివాదం.. ఆ సీన్లు తొలగించాలని డిమాండ్
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!