Vijay Stampede: ‘‘విజయ్ జనాల అరుపుల్ని కనీసం పట్టించుకోలేదు’’: ప్రత్యక్ష సాక్షి..
- విజయ్ జనాల అరుపుల్ని కనీసం పట్టించుకోలేదు..
- కరెంట్ కట్, జనాల్లో తోపులాట ప్రమాదానికి కారణం..
- కరూర్ తొక్కిసలాటపై ప్రత్యక్ష సాక్షులు..
TVK Rally Stampede: తమిళ స్టార్ ,టీవీకే పార్టీ అధినేత విజయ్ నిర్వహించిన ర్యాలీ తీవ్ర విషాదాన్ని నింపింది. కరూర్లో శనివారం జరిగిన ర్యాలీలో తొక్కిసలాట జరిగి 40 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన రాజకీయం విమర్శలు ప్రతివిమర్శలకు కారణమవుతోంది. తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలు కన్నీరుమున్నీరవుతున్నాయి. విజయ్ ర్యాలీలో విద్యుత్ అంతరాయం, అకాస్మత్తుగా జనసమూహం, ఇరుకైన స్థలం కారణంగా ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
విజయ్ సాయంత్రం 7 గంటలకు వచ్చే సరికి జనసమూహం పెరిగిందని, ఆయన ప్రచారం బస్సుతో మరికొంత మంది వచ్చారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఆ సమయంలో చాలా మంది చెట్లు, కరెంట్ స్తంభాలు, ఇళ్ల పైకప్పులు ఎక్కినట్లు వెల్లడించారు. ఈ సమయంలో విద్యుత్ షాక్లను నివారించేందుకు అధికారులు కరెంట్ ను కట్ చేయాల్సి వచ్చిందని చెప్పారు.
Also Read
- Barrier Free Tolling: భారత్లో కొత్త రకం టోల్ విధానం.. వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా...
- Mamata Banerjee: తలకిందులుగా వేలాడదీయడం ఏంటి.? అమిత్ షాపై దీదీ ఆగ్రహం..
- AAP Crisis: ‘‘పంజాబ్ ద్రోహి’’ అంటూ హర్భజన్ సింగ్ ఇంటిపై ఆప్ దాడి...
- LPG Crisis: గ్యాస్ టెన్షన్కు గుడ్బై.. 15 దేశాల నుంచి ఎల్పీజీ దిగుమతి!
Read Also: Karur Stampede: కరూర్ తొక్కిసలాట ఘటనపై కలెక్టర్ సంచలన ప్రకటన.. మృతుల సంఖ్య పెరుగనుందా..?
‘‘విజయ్ రాగానే ప్రజలు ఒకర్ని ఒకరు తోసుకోవడం ప్రారంభించారు, విజయ్ దృష్టిని ఆకర్షించాలని కొందరు చెపపులు కూడా విసిరారు. చెట్లు, విద్యుత్ స్తంభాలు ఎక్కిన వారిలో కొంత మంది కాలువల్లో పడిపోయారు. కొంతమంది స్పృహ కోల్పోయారు. వీరికి సాయం చేయడానికి వచ్చిన అంబులెన్సులు జన సమూహాన్ని దాటి రాలేకపోయాయి.’’ అని ఒక ప్రత్యక్ష సాక్షి చెప్పారు. అప్పుడే పోలీసులు జన సమూహాన్ని చెదరగొట్టడానికి లాఠీ చార్జ్ చేసినట్లు మరొకరు పేర్కొన్నారు.
విజయ్ తన మార్గంలో వెళుతూ చేతులు ఊపుతూ ఉంటే, జన సమూహం అతడిని అనుసరించేది కాదని, ఇంత పెద్ద ఘటన జరిగేది కాదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. విజయ్ ప్రజల అరుపుల్ని కనీసం పట్టించుకోలేదని వెల్లడించారు. తొక్కిసలాట ఘటన తర్వాత విజయ్ తన ‘‘హృదయం ముక్కలైంది’’ అని అన్నారు. ఈ తొక్కిసలాటలో మరణించిన వారికి టీవీకే రూ. 20 లక్షల పరిహారం, గాయపడిన వారికి రూ. 2 లక్షల చొప్పున విరాళం ప్రకటించింది.
తాజావార్తలు
-
New OTT Rules 2026 : ఓటీటీలో కొత్త రూల్స్.. నిర్మాతలకు ‘షాక్’.. వసూళ్లు లేకపోతే రైట్స్ కట్!
-
Ashu Reddy: ప్రేమ, పెళ్లి పేరుతో 9 కోట్లు స్వాహ.. బిగ్ బాస్ అషు రెడ్డి పై సైబర్ కేసు
-
న్యూ లుక్లో YS Jagan.. యూరప్ టూర్కు బయల్దేరిన మాజీ సీఎం.!
-
Lungi Ngidi Injury: లుంగి ఎంగిడికి తీవ్ర గాయం.. 11 నిమిషాల్లోనే ఆస్పత్రికి అంబులెన్స్, తాజా అప్డేట్ ఇదే!
-
Amani: అందుకే మెగాస్టార్ సరసన నటించలేదు..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!