Vijay Stampede: ‘‘విజయ్ జనాల అరుపుల్ని కనీసం పట్టించుకోలేదు’’: ప్రత్యక్ష సాక్షి..
- విజయ్ జనాల అరుపుల్ని కనీసం పట్టించుకోలేదు..
- కరెంట్ కట్, జనాల్లో తోపులాట ప్రమాదానికి కారణం..
- కరూర్ తొక్కిసలాటపై ప్రత్యక్ష సాక్షులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TVK Rally Stampede: తమిళ స్టార్ ,టీవీకే పార్టీ అధినేత విజయ్ నిర్వహించిన ర్యాలీ తీవ్ర విషాదాన్ని నింపింది. కరూర్లో శనివారం జరిగిన ర్యాలీలో తొక్కిసలాట జరిగి 40 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన రాజకీయం విమర్శలు ప్రతివిమర్శలకు కారణమవుతోంది. తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలు కన్నీరుమున్నీరవుతున్నాయి. విజయ్ ర్యాలీలో విద్యుత్ అంతరాయం, అకాస్మత్తుగా జనసమూహం, ఇరుకైన స్థలం కారణంగా ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
విజయ్ సాయంత్రం 7 గంటలకు వచ్చే సరికి జనసమూహం పెరిగిందని, ఆయన ప్రచారం బస్సుతో మరికొంత మంది వచ్చారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఆ సమయంలో చాలా మంది చెట్లు, కరెంట్ స్తంభాలు, ఇళ్ల పైకప్పులు ఎక్కినట్లు వెల్లడించారు. ఈ సమయంలో విద్యుత్ షాక్లను నివారించేందుకు అధికారులు కరెంట్ ను కట్ చేయాల్సి వచ్చిందని చెప్పారు.
Also Read
- Sonam Raghuvanshi: హనీమూన్ మర్డర్ కేసులో సోనమ్ బెయిల్ పిటిషన్ రద్దుపై కీలక పరిణామం.. సర్వత్రా ఉత్కంఠ
- Kerala: వ్యాయామానికి మతం రంగు.. కేరళలో వివాదంగా ‘‘ఇస్లామిక్-ఫ్రెండ్లీ జిమ్’’..
- E85 Fuel: E85 ఇంధనంపై కేంద్రం కీలక ప్రకటన.. భారీగా తగ్గనున్న పెట్రో ధరలు..!?
- Modi-Delcy Rodriguez: మోడీతో వెనిజులా అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ భేటీ.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ
Read Also: Karur Stampede: కరూర్ తొక్కిసలాట ఘటనపై కలెక్టర్ సంచలన ప్రకటన.. మృతుల సంఖ్య పెరుగనుందా..?
‘‘విజయ్ రాగానే ప్రజలు ఒకర్ని ఒకరు తోసుకోవడం ప్రారంభించారు, విజయ్ దృష్టిని ఆకర్షించాలని కొందరు చెపపులు కూడా విసిరారు. చెట్లు, విద్యుత్ స్తంభాలు ఎక్కిన వారిలో కొంత మంది కాలువల్లో పడిపోయారు. కొంతమంది స్పృహ కోల్పోయారు. వీరికి సాయం చేయడానికి వచ్చిన అంబులెన్సులు జన సమూహాన్ని దాటి రాలేకపోయాయి.’’ అని ఒక ప్రత్యక్ష సాక్షి చెప్పారు. అప్పుడే పోలీసులు జన సమూహాన్ని చెదరగొట్టడానికి లాఠీ చార్జ్ చేసినట్లు మరొకరు పేర్కొన్నారు.
విజయ్ తన మార్గంలో వెళుతూ చేతులు ఊపుతూ ఉంటే, జన సమూహం అతడిని అనుసరించేది కాదని, ఇంత పెద్ద ఘటన జరిగేది కాదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. విజయ్ ప్రజల అరుపుల్ని కనీసం పట్టించుకోలేదని వెల్లడించారు. తొక్కిసలాట ఘటన తర్వాత విజయ్ తన ‘‘హృదయం ముక్కలైంది’’ అని అన్నారు. ఈ తొక్కిసలాటలో మరణించిన వారికి టీవీకే రూ. 20 లక్షల పరిహారం, గాయపడిన వారికి రూ. 2 లక్షల చొప్పున విరాళం ప్రకటించింది.
తాజావార్తలు
-
Summer Holidays Extended: భారీ శుభవార్త.. జూన్ 14 వరకు వేసవి సెలవులు పొడిగింపు..
-
Sonam Raghuvanshi: హనీమూన్ మర్డర్ కేసులో సోనమ్ బెయిల్ పిటిషన్ రద్దుపై కీలక పరిణామం.. సర్వత్రా ఉత్కంఠ
-
Kerala: వ్యాయామానికి మతం రంగు.. కేరళలో వివాదంగా ‘‘ఇస్లామిక్-ఫ్రెండ్లీ జిమ్’’..
-
Team India Injuries: టీమిండియాకు వరుస షాక్లు.. కోహ్లీ ఔట్.. రోహిత్కు గాయం..! హార్దిక్ కూడా అనుమానమేనా..?
-
E85 Fuel: E85 ఇంధనంపై కేంద్రం కీలక ప్రకటన.. భారీగా తగ్గనున్న పెట్రో ధరలు..!?
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!