Indrani Mukerjea: షీనా బోరా హత్య కేసులో కీలక మలుపు.. ఇంద్రాణి కుమార్తె ఏం వాంగ్మూలం ఇచ్చిందంటే..!
- షీనా బోరా హత్య కేసులో కీలక మలుపు
- సంచలనంగా మారిన ఇంద్రాణి కుమార్తె వాంగ్మూలం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసు అందరికీ గుర్తుండే ఉంటుంది. దశాబ్దకాలంగా ఈ కేసు నడుస్తోంది. ఈ కేసులో తల్లి ఇంద్రాణి ముఖర్జియా, ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నా నిందితులుగా ఉన్నారు. తాజాగా ఈ కేసు కీలక మలుపు తిరిగింది. ఇంద్రాణి ముఖర్జియా మరో కుమార్తె విధి ముఖర్జియా సంచలన వ్యాఖ్యలు చేసింది. సీబీఐకి తాను ఎలాంటి వాంగ్మూలం ఇవ్వలేదని తేల్చి చెప్పింది. సీబీఐ చార్జిషీట్లో ఉన్న వాంగ్మూలం నకిలీని పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం కోర్టులో ఖండించారు.
ఇది కూడా చదవండి: Trump: ఆ ముగ్గురూ కలిసి అమెరికాపై కుట్ర.. చైనా కవాతుపై ట్రంప్ ఆరోపణలు
Also Read
- Sana Malik: పాకిస్తాన్లోని ఇస్లామిక్ చట్టాన్ని భారత్ లో అమలు చేయాలి.. ఎమ్మెల్యే సనా మాలిక్ సంచలన వ్యాఖ్యలు
- Ketan Agarwal Murder: 6 నెలల ప్లానింగ్.. 2004 ఫోన్ కాల్స్, 238 గంటల టాక్ టైమ్.. వణుకు పుట్టిస్తున్న మర్డర్ స్కెచ్..
- PM Modi: వెనెజువెలాకు భారత్ అండ.. సహాయ సహకారాలు అందిస్తామన్న ప్రధాని మోడీ..
- Ayodhya: రామాలయ నిధుల వివాదంలో కొత్త ట్విస్ట్.. PMOకు సైతం లెక్కలు ఇవ్వని రామ్ మందిర్ ట్రస్ట్!
ఇంద్రాణి ముఖర్జియా మరో కుమార్తె విధి ముఖర్జియా కోర్టుకు కీలక విషయాలు వెల్లడించింది. ఈ కేసును వాదించుకోవడానికి తన తల్లి దగ్గర ఎలాంటి నిధులు లేవని.. ఆమెకు సంబంధించిన ఆభరణాలు, రూ.7 కోట్ల నగదును మీడియా అధినేత పీటర్ ముఖర్జియా కుమారులు రాహుల్, రాబిన్ దొంగిలించారని ఆరోపించింది. కుట్రపూరితంగా ఇంద్రాణిని ఈ కేసులో ఇరికించారని వాపోయింది. ఇంద్రాణిని అరెస్ట్ చేసినప్పుడు తాను మైనర్ అని చెప్పింది. ఈ దుర్ఘటన నుంచి ఇప్పటికీ కోలుకోలేకపోతున్నట్లు వెల్లడించింది. కేసు విచారణలో భాగంగా ముంబై పోలీసుల ఎదుట హాజరయ్యానని.. అలాగే సీబీఐ అడిగిన ప్రశ్నలకకు కూడా సమాధానం ఇచ్చినట్లు తెలిపారు. అయితే సీబీఐ బయట పెట్టిన వాంగ్మూలాలతో తనకు సంబంధం లేదని పేర్కొన్నారు. విచారణ సమయంలో తనతో బలవంతంగా సంతకాలు పెట్టించుకున్నారని ఆరోపించింది. ఇంద్రాణి, సంజీవ్ను కుట్రపూరితంగా కేసులో ఇరికించారని వాపోయింది.
ఇది కూడా చదవండి: Tejashwi Yadav: నడిరోడ్డుపై కళాకారులతో తేజస్వి యాదవ్ డ్యాన్స్.. వీడియో వైరల్
2012లో షీనా బోరాను ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జియా, డ్రైవర్ శ్యామ్రాయ్, సంజీవ్ ఖన్నాలు హత్య చేసినట్లు కేసు నమోదైంది. 2015లో ఓ ఆయుధాల కేసులో శ్యామ్ అరెస్టు కాగా షీనా హత్య కేసు వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు ఇంద్రాణి, సంజీవ్, పీటర్లను అరెస్టు చేశారు. ఈ హత్య తర్వాత షీనా బతికే ఉందని నమ్మించేందుకు ఆమె మెయిల్ నుంచి ఇంద్రాణి సందేశాలు పంపించినట్లు విచారణలో తేలింది.
తాజావార్తలు
-
Hindu Culture : శుభకార్యాల్లో రూ. 101, రూ. 501 ఎందుకు ఇస్తారు? ఈ ఒక్క రూపాయి సెంటిమెంట్ ఎందుకో తెలుసా ?
-
Hyderabad: ప్రజల ప్రాణాలతో చెలగాటం.. ఎలుకల మధ్య తయారైన ఫుడ్.. కుళ్లిన బిర్యానీ, కూరగాయలు..
-
Plastic Water Bottle: ప్లాస్టిక్ వాటర్ బాటిల్ను ఎంతకాలం వాడొచ్చు? వాటి కింద ఉన్న నంబర్ల అర్థం ఏమిటి?
-
Honda Vario EVO 160: హోండా వారియో ఇవో 160 స్కూటర్ విడుదల.. యమహా ఏరోక్స్ 155కు గట్టి పోటీ!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
ట్రెండింగ్
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!
-
IND vs BAN: నేడు టీమిండియాకు కీలక మ్యాచ్.. గెలవకుంటే ఇంటికే.. కొడితే గట్టిగా కొట్టాల్సిందే!