Gujarat: దారుణం.. మహిళా రోగుల వీడియోలు వైరల్.. ప్రభుత్వం సీరియస్
- గుజరాత్ ఆస్పత్రిలో దారుణం
- మహిళా రోగుల వీడియోలు ఆన్లైన్లో ప్రత్యక్షం
- విచారణకు ఆదేశించిన ప్రభుత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గుజరాత్ ఆస్పత్రికి సంబంధించిన ఓ దారుణం వెలుగులోకి వచ్చింది. ఆస్పత్రిలో మహిళలకు సంబంధించిన విషయాలు చాలా రహస్యంగా ఉంటాయి. ట్రీట్మెంట్ గానీ.. పరీక్షలు గానీ అత్యంత గోప్యంగా నిర్వహిస్తారు. అలాంటిది రాజ్కోట్లోని పాయల్ ప్రసూతి వార్డుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. మహిళా రోగులకు నర్సింగ్ సిబ్బంది ఇంజెక్షన్లు ఇస్తున్న సీసీటీవీ దృశ్యాలు ఆన్లైన్లో వైరల్ అవుతున్నాయి. దీంతో మహిళ భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో సీరియస్ అయింది. వీడియోలు ఆన్లైన్లోకి రావడంపై దర్యాప్తునకు ఆదేశించింది.
ఇది కూడా చదవండి: Guntur Crime News: రోడ్డెక్కిన ప్రభుత్వ ఉద్యోగి అక్రమ సంబంధాల వ్యవహారం!
Also Read
- Ketan Agarwal Case: కేతన్ పాస్పోర్ట్ పోయినప్పుడు జరిగిందిదే.. క్యాబ్ డ్రైవర్ సంచలన వ్యాఖ్యలు
- Ketan Agarwal Case: షాపింగ్ కోసం కేతన్ నుంచి రూ.కోటి కొట్టేసిన సియా.. అవి ఎవరికిచ్చిందంటే..!
- Viral Video: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న తాతా.. 18 వేల అడుగుల ఎత్తు నుంచి దూకేసిన 80 ఏళ్ల వృద్ధుడు!
- Modi-Khamenei: ఖమేనీ అంత్యక్రియలకు హాజరుకానున్న భారత్.. ఎవరెళ్తున్నారంటే..!
అయితే వీడియోలు ఆన్లైన్లోకి రావడంపై రాజ్కోట్ ఆసుపత్రి డైరెక్టర్ స్పందించారు.. సీసీటీవీ సర్వర్ హ్యాక్ అయిందని.. అందువల్లే ఆస్పత్రి దృశ్యాలు సోషల్ మీడియాలోకి వచ్చినట్లు పేర్కొన్నారు. ‘‘ఆసుపత్రి వీడియోలు ఎలా వైరల్ అయ్యాయో నాకు తెలియదు. మా సీసీటీవీ సర్వర్ హ్యాక్ అయినట్లు కనిపిస్తోంది. అయితే ఇది ఎందుకు జరిగిందో మాకు కూడా తెలియదు. పోలీసులకు తెలియజేస్తాము. మేము ఫిర్యాదు కూడా చేశాం. దర్యాప్తులో పోలీసులతో సహకరిస్తాము.’’ అని ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్ అమిత్ అక్బరి అన్నారు.
ఇది కూడా చదవండి: Gold Rates: సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న పసిడి.. మరింత పైపైకి బంగారం ధరలు
ఆన్లైన్ దృశ్యాలు అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల దృష్టికి రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. వైద్యులతో సహా మొత్తం ఆసుపత్రి సిబ్బందిని విచారిస్తున్నారు. ‘‘వీడియోలలోని కంటెంట్పై దర్యాప్తు జరుగుతోంది. ఈ వీడియోలను ఎవరు తీశారు, ఏ ఉద్దేశ్యంతో తీశారు అనే దానిపై మేము దర్యాప్తు చేస్తున్నాము. సైబర్ క్రైమ్ ఐటీ చట్టంలోని 66E, 67 సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తాము.’’ అని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
NTRIVIKRAM: పురాణాలకు, జన్యుశాస్త్రానికి లింక్.. ఏం చేస్తున్నావయ్యా త్రివిక్రమ్?
-
France Heatwave: ఫ్రాన్స్ను హడలెత్తిస్తోన్న ఎండలు.. వెయ్యికి చేరిన మృతులు
-
ENE Repeat : అంతా ఒకే కానీ, రిలీజ్ అదే రోజు ఎందుకంటే?
-
Minister Seethakka : కేంద్రానికి తెలంగాణ కౌంటర్.. సీతక్క వినతిలో కీలక డిమాండ్లు.!
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
ట్రెండింగ్
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!