Vishwa Hindu Parishad: దేశవ్యాప్త హింసకు వ్యతిరేకంగా ‘హనుమాన్ చాలీసా’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలకు గత వారం దేశవ్యాప్తంగా ముస్లింలు ఆందోళనలు చేస్తున్నారు. శుక్రవారం ప్రార్థనల అనంతరం పెద్ద ఎత్తున ఆందోళన, నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఇదే సమయంలో కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలు చెలరేగాయి. ముఖ్యంగా యూపీలోని ప్రయాగ్ రాజ్, కాన్పూర్, సహరాన్ పూర్ ప్రాంతాల్లో రాళ్ల దాడులు జరిగాయి. జార్ఖండ్ రాంచీలో హింసాత్మక ఘటనలు చెలరేగాయి. పోలీసులకు, ఆందోళనకారుల ఘర్షణల్లో ఇద్దరు మరణించారు. పశ్చిమ బెంగాల్ హౌరాలో కూడా పెద్ద ఎత్తున హింస చెలరేగింది.
ఇదిలా ఉంటే జూన్ 10న దేశవ్యాప్తగా జరిగిన హింసాత్మక ఘటనలకు వ్యతిరేకంగా విశ్వహిందూ పరిషత్ మంగళవారం నిరసనలకు పిలుపినిచ్చింది. ఢిల్లీలో మంగళవారం అన్ని దేవాలయాల్లో ప్రజలు ‘ హనుమాన్ చాలీసా’ పారాయణం చేయాలని పిలుపునిచ్చింది. ప్రపంచవ్యాప్తంగా భారత్ పరువు తీయడానికి ప్రణాళికబద్ధంగా కుట్ర జరుగుతోందని విశ్వహిందూ పరిషత్ ఆరోపించింది. ఇందులో భాగంగానే శుక్రవారం మసీదుల్లో ప్రార్థనల అనంతరం దేవాలయాలు, ఇళ్లపై హింసాత్మక దాడులు జరిగాయని, రాళ్లు రువ్వారని వీహెచ్పీ పేర్కొంది.
Also Read
- Mamata Banerjee: నా సీటు నుంచి పోటీ చేయండి.. మమతా బెనర్జీకి బంపర్ ఆఫర్..
- Rajya Sabha: రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. కీలక నేతలకు అవకాశం
- DK.Shivakumar: డీకే.శివకుమార్ కేబినెట్పై విమర్శలు.. మహిళలకు చోటు లేకపోవడంపై నిలదీత
- INDIA alliance: ఇండియా కూటమికి డీఎంకే షాక్.. జూన్ 8 సమావేశం బాయ్కాట్..
జూన్ 10న ఢిల్లీలో నుపుర్ శర్మ, నవీన్ జిందాల్ వ్యాఖ్యలకు వ్యతిరేఖంగా జామా మసీదులో ఆందోళన, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అయితే మేము ఎలాంటి ఆందోళనకు పిలుపుఇవ్వలేదని.. ఇది ఎంఐఎం వ్యక్తుల పనిగా మసీదు ఇమాన్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఎలాంటి అనుమతులు లేకుండా ఆందోళనలు చేయడంతో ఢిల్లీ పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఈ ఘటనల వెనక కొంతమంది హస్తం ఉందని పోలీసులు ఆరోపిస్తున్నారు.
నుపుర్ శర్మను చంపుతామని బెదిరించడం, ఆమె హత్యకు చట్టవిరుద్ధమైన ఫత్వాలు జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు ఢిల్లీ వీహెచ్పీ చీఫ్ కపిల్ ఖన్నా. దీనికి నిరసనగా ఢిల్లీలోని హిందూ సమాజం చిన్న, పెద్ద ఆలయాల వద్ద గురువారం రాత్రి 8 గంటలకు హనుమాన్ చాలీస్ పారాయణంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. హనుమాన్ చాలీసా గురించి భక్తులకు తెలిసేలా దేవాలయాల్లో నోటీసులు పెట్టాలని ఆలయ నిర్వాహకులకు సూచించారు.
తాజావార్తలు
-
Vaibhav Brand Value: ఐపీఎల్ సంచలనం వైభవ్ సూర్యవంశీ బ్రాండ్ వాల్యూ షురూ.. ఏడాదికి 2 కోట్లు..
-
Mamata Banerjee: నా సీటు నుంచి పోటీ చేయండి.. మమతా బెనర్జీకి బంపర్ ఆఫర్..
-
NDA Meeting Andhra Pradesh: ఎన్డీఏ భేటీలో రాజ్యసభ స్థానాల పంపకం.. టీడీపీకి 3, జనసేనకు 1..?
-
Trump: నా యుద్ధ అధికారాల్ని పరిమితం చేయడం దేశద్రోహం.. డెమోక్రాట్లపై ట్రంప్ ఆగ్రహం
-
Rajya Sabha: రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. కీలక నేతలకు అవకాశం
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!