India at UN: ఆ దేశాల స్వార్థప్రయోజనాలకే “వీటో”.. యూఎన్లో గళమెత్తిన భారత్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India at UN: ఐక్యరాజ్య సమితిని సంస్కరించాలని భారత్ ఎప్పటి నుంచో కోరుతోంది. ముఖ్యంగా ఐదు దేశాలకు మాత్రమే శాశ్వత సభ్యత్వ హోదా, వీటో అధికారం ఉండటంపై గళమెత్తుతోంది. కేవలం ఈ ఐదు దేశాలు మాత్రమే ప్రపంచం మొత్తానికి ప్రాతినిధ్యం వహించలేవని చెబుతోంది. భారత్ వాదనకు ఇతర ప్రపంచదేశాలు కూడా మద్దతు తెలుపుతున్నాయి. భద్రతా మండలిని సంస్కరించాలని పలుమార్లు భారత్ యూఎన్ ను కోరింది.
అయితే ఆ దిశంగా కొన్ని దేశాలు ఎప్పటికప్పుడు అడ్డుకట్ట వేస్తున్నాయి. ప్రస్తుతం ఐరాస భద్రతా మండలిలో అమెరికా, బ్రిటన్, రష్యా, ఫ్రాన్స్, చైనాలకు శాశ్వత సభ్యత్వం, వీటో అధికారం ఉంది. 140 కోట్ల జనాభా ఉండీ, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అయిన భారత్ కు సభ్యత్వం లేకపోవడం పట్ల భారత్ పలుమార్లు తమ నిరసన తెలియజేసింది. నాలుగు దేశాలు అంగీకరించినప్పటికీ, జిత్తులమారి చైనా భారత్ శాశ్వత సభ్యత్వ హోదాకు ఒప్పుకోవడం లేదు.
Also Read
- Woman Constable: ఇదేం పద్దతి మేడం.. ఫిర్యాదు కోసం వచ్చిన వృద్ధుడి ఎదుట.. టేబుల్పై కాళ్లు పెట్టిన మహిళా కానిస్టేబుల్
- Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
- CM Yogi: "ఎవ్వరినీ వదిలి పెట్టను".. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
- Ketan Murder Case: కేతన్ హత్య కేసులో కొత్త ట్విస్ట్.. ఇద్దరు తల్లుల మధ్య మాటల యుద్ధం!
Read Also: Thailand: థాయ్లాండ్లో దారుణం.. 12 మంది స్నేహితులకు సైనైడ్ ఇచ్చి హత్య చేసిన మహిళ
ఇదిలా ఉంటే మరోసారి భారత్ వీటో అధికారంపై యూఎన్ లో ప్రస్తావించింది. వీటో అధికారాన్ని కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఉపయోగించుకుంటున్నాయని, నైతిక బాధ్యతతో కాదని భారత్ యూఎన్ సాధారణ సభలో వ్యాఖ్యానించింది. భారత కౌన్సిలర్ ప్రతీక్ మథూర్ ‘వీటో ఇనిషియేటివ్’ తీర్మానానికి ఏడాది పూర్తయిన సందర్భంగా ‘యూజ్ ఆఫ్ వీటో’పై యూఎన్ సాధారణ సభలో ప్రసంగించారు. గత 75 ఏళ్లుగా కేవలం స్వార్థ ప్రయోజనాల కోసం శాశ్వత సభ్యదేశాలు వీటోను వాడుకుంటున్నాయని, ఇదే తీరు కొనసాగినంత కాలం సభ్యదేశాలు వీటోను ఇలాగే వినియోగించుకుంటాయని, నైతిక బాధ్యతను పక్కన పెట్టి వ్యవహరిస్తాయని ప్రతీక్ మథూర్ అన్నారు.
గతేడాది ఉక్రెయిన్ యుద్ధం సమయంలో రష్యా తన వీటో అధికారాన్ని ఉపయోగించుకుంది. ఈ నేపథ్యంలో గత ఏప్రిల్ లో ‘వీటో ఇనిషియేటివ్’పై సాధారణ సభ్యదేశాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా కీలక నిర్ణయం తీసుకోవడం ఆందోళనకరం అని భారత్ తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఐరాస భద్రతా మండలిలో 5 శాశ్వత సభ్యదేశాలతో పాటు 10 తాత్కాలిక సభ్యదేశాలు ప్రతీ రెండేళ్ల పరిమితితో ఉంటాయి. ఈ 10 దేశాలకు వీటో అధికారం లేదు. భద్రతా మండలిలో ఆఫ్రికా, దక్షిణ అమెరికా ఖండాలకు ప్రాతినిథ్యం లేదని భారత్ పలుమార్లు ప్రస్తావించింది.
తాజావార్తలు
-
Sanjay Jaju : తెలంగాణ నూతన సీఎస్ గా సంజయ్ జాజు నియామకం
-
Varanasi Update: ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. ఈ సెప్టెంబర్ నాటికే..!
-
Shah Rukh Khan: ‘నా భర్త కంటే మీరే ఇష్టం’.. మహిళా అభిమాని మాటకు షారుఖ్ ఇచ్చిన సమాధానం వైరల్
-
Woman Constable: ఇదేం పద్దతి మేడం.. ఫిర్యాదు కోసం వచ్చిన వృద్ధుడి ఎదుట.. టేబుల్పై కాళ్లు పెట్టిన మహిళా కానిస్టేబుల్
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!