USAID Row: భారత్కి అమెరికా నిధులపై వాషింగ్టన్ పోస్ట్ కథనం.. బీజేపీపై కాంగ్రెస్ రివర్స్ ఎటాక్..
- భారత్కి అమెరికా నిధులపై వాషింగ్టన్ పోస్ట్ కథనం..
- బీజేపీపై కాంగ్రెస్ రివర్స్ అటాక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
USAID Row: అమెరికాలోని గత బైడెన్ ప్రభుత్వం భారత ఎన్నికల్లో జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించిందంటూ ఇటీవల డోనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. USAID ద్వారా 21 మిలియన్ డాలర్ల నిధులను భారత్లో ‘‘ఓటర్ల ఓటు’’ కోసం కేటాయించారని ట్రంప్ ఆరోపించారు. 2024 భారత లోక్సభ ఎన్నికల్లో జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించారనే ఆరోపణల నడుమ అధికార బీజేపీ కాంగ్రెస్పై విరుచుకుపడుతోంది.
Also Read
- Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
- West Bengal: అక్రమ బంగ్లాదేశీయుల బహిష్కరణ.. బెంగాల్లో సీఏఏ స్టార్ట్..
- Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడిలో ఎన్ఐఏ సంచలన ఛార్జిషీట్.. ఆ ఇద్దరి గైడ్స్ ఎంత పని చేశారంటే..!
- Congress: డీఎంకే వల్ల కాలేదు, 59 ఏళ్ల కాంగ్రెస్ కోరిక తీర్చిన విజయ్..
ఇదిలా ఉంటే, తాజాగా వాషింగ్టన్ పోస్ట్ ఓ కథనంలో ఈ 21 మిలియన్ డాలర్ల నిధుల గురించి ఎలాంటి రికార్డులు లేవని నివేదించింది. భారతదేశానికి అమెరికా నిధులు ఇచ్చిందని ఇటీవల డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ(DOGE) పేర్కొంది. వాషింగ్టన్ పోస్ట్ డోజ్ వాదనల్ని తోసిపుచ్చింది. USAID బంగ్లాదేశ్ కోసం $21 మిలియన్ల ఒప్పందాన్ని కలిగి ఉందని అమెరికన్ దినపత్రిక పేర్కొంది.
2008 నుంచి ఎన్నికలకు సంబంధించిన ఏ ప్రాజెక్టుకు SAID నుండి భారతదేశం నిధులు పొందలేదని ఇండియన్ ఎక్స్ప్రెస్ రాసిన ఇలాంటి కథనాన్ని వాషింగ్టన్ పోస్ట్ నివేదిక సమర్థించింది. ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం బీజేపీ, కాంగ్రెస్ మధ్య తీవ్ర రాజకీయ వివాదానికి కారణమైంది. వాషింగ్టన్ పోస్ట్ నివేదికను ప్రస్తావిస్తూ, కాంగ్రెస్ ప్రతినిధి పవన్ ఖేరా మాట్లాడుతూ.. బీజేపీ, దాని అంధ మద్దతుదారులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్, రాహుల్ గాంధీలు విదేశీ సాయాన్ని కోరానని కాషాయ పార్టీ నేతలు ధ్వజమెత్తుతున్నారు. భారతదేశంలో ఓటర్ల సంఖ్యను పెంచడానికి అమెరికా నుంచి ఎలాంటి నిధులు రాలేదనన్న ది వాషింగ్టన్ పోస్ట్ కథనం కాంగ్రెస్కి ఆయుధంగా మారింది.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!