US: రష్యన్ ఆయిల్ బ్రహ్మణులకే లాభదాయకం.. ట్రంప్ సలహాదారుడి వివాదాస్పద వ్యాఖ్యలు..
- రష్యన్ ఆయిల్తో సంపన్నులకే లాభం..
- బ్రహ్మణులకే లబ్ధి చేకూరుతోందని ట్రంప్ సన్నిహితుడి వ్యాఖ్యలపై దుమారం..
- భారత్లో అధికార, ప్రతిపక్ష పార్టీల నుంచి విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US: డొనాల్డ్ ట్రంప్ భారత్పై విధించిన 50 శాతం సుంకాలు భారత్, రష్యాను మరింత దగ్గర చేయడమే కాకుండా, చైనాతో భారత స్నేహాన్ని ముందుకు తీసుకెళ్లాలా చేసింది. చైనాలోని టియాంజిన్లో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) శిఖరాగ్ర సమావేశంలో మోడీతో పుతిన్, జిన్పింగ్లు భేటీ అయ్యారు. అయితే, ఈ పరిణామాలు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్కి ఎక్కడా లేని కోపాన్ని తెప్పిస్తున్నట్లు తెలుస్తోంది.
Read Also: USA: మోడీ-పుతిన్ మీటింగ్.. భారత్తో సంబంధాలపై అమెరికా కొత్త నిర్వచనం..
Also Read
- Bangladesh: బంగ్లాదేశ్కు భారత్ ‘‘కరెంట్ షాక్’’..
- PM Modi: ‘‘సరిహద్దుల్లో శాంతి తప్పనిసరి’’.. జిన్పింగ్కు తేల్చి చెప్పిన మోడీ..
- Suvendu Adhikari: చిన్మోయ్ కృష్ణదాస్ కన్నీరు.. హిందువుల పరిస్థితిపై బెంగాల్ సీఎం కామెంట్స్..
- PM Modi-Xi Jinping: ఒకరి నుంచి మరొకరం నేర్చుకోవచ్చు: మోడీతో భేటీలో జిన్పింగ్..
తాజాగా, వైట్ హౌజ్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో భారత్పై తన ఆక్రోశాన్ని వెల్లగక్కాడు. భారత్, రష్యన్ ఆయిల్ని కొంటున్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఇది ‘‘బ్రహ్మణులకే లాభదాయకంగా ఉంటుంది’’ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు సోమవారం భారత్లో ఆగ్రహాన్ని రేకెత్తించాయి. చాలా మంది ఈ వ్యాఖ్యల్ని ‘కులతత్వ’, ‘దుష్ట’ వ్యాఖ్యలుగా అభివర్ణించారు. ‘‘హిందూ వ్యతిరేక’’, ‘‘భారత వ్యతిరేక’’ వ్యాఖ్యలుగా ఖండించారు. భారత్పై సుంకాలు విధించడంతో రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతింటున్న సమయంలో ఈ వ్యాఖ్యలు మరింత నష్టదాయకంగా మారాయి.
సాధారణంగా ‘‘బొస్టన్ బ్రాహ్మణ్’’ అనేది ఒకప్పుడు అమెరికాలో న్యూ ఇంగ్లాండ్ లోని అమెరికన్ సంపన్న ఉన్నత వర్గాన్ని సూచించడానికి విస్తృతంగా ఉపయోంచే పదం. ధనికులను సూచించేందుకు ఇంగ్లీష్లో ఈ పదాన్ని ఉపయోగిస్తుంటారు. నవారో ప్రకారం.. రష్యా నుంచి భారత్ కొనుగోలు చేస్తున్న ఆయిల్ సంపన్నులకు మాత్రమే ఉపయోగపడుతున్నాయని, దీని వల్ల సగలు భారతీయుడికి ఎలాంటి ప్రయోజనం దక్కలేదని నవారో ఆరోపించారు. అయితే, ఈ వ్యాఖ్యల్ని అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు తీవ్రంగా ఖండించారు. ప్రధాని మోడీ ఆర్థిక మండలి సభ్యుడు సంజీవ్ సన్యాల్, కాంగ్రెస్ నేత పవన్ ఖేరా, శివసేన యూబీటీ ప్రతినిధి ప్రియాంకా చతుర్వేది కూడా ఈ వ్యాఖ్యల్ని వ్యతిరేకించారు.
తాజావార్తలు
-
Greenfield Highway : గ్రీన్ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
-
Secret Soldiers: ‘చైనా’ పేరుతో సెన్సార్ బోర్డ్లో ప్రకంపనలు.. రంగంలోకి విదేశీ వ్యవహారాల శాఖ!
-
OTR: సిగ్గా.. భయమా.. మొహమాటమా? అంజిరెడ్డి తీరుపై బీజేపీలో హాట్ టాపిక్
-
OTR: సిక్కోలులో వైసీపీకి గ్రూపుల గోల! స్థానిక ఎన్నికల వేళ అసలు రచ్చ ఇదేనా?
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!