UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
- UPI కొత్త MDR విధానాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్..
- ఎండీఆర్ ఛార్జీలను రద్దు చేయాలని కోరిన పిటిషనర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UPI Charges: UPI చెల్లింపుల ఛార్జీల అంశం సుప్రీంకోర్టుకు చేరింది. రూ. 2000 దాటిన యూపీఐ మర్చంట్ లావాదేవీలపై రూ. 0.4 శాతం మర్చంట్ డిస్కౌంట్ రేట్(MDR) విధించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. సెప్టెంబర్ 14న దీనిపై నోటిఫికేషన్ జారీ చేసింది. అక్టోబర్ 15 నుంచి ఈ ఛార్జీలు అమలులోకి వస్తాయని ప్రకటించింది. అయితే, కేంద్రం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అంజన్ దత్తా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సెప్టెంబర్ 15 నుంచి అమలు కాబోతున్న ఎండీఆర్ ఫ్రేమ్ వర్క్ను రద్దు చేయాలని పిటిషన్లో కోరారు.
కొత్త విధానాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలైంది. ఎండీఆర్ అమలుకు ముందు తగిన చట్టపరమైన ప్రక్రియ, పారదర్శకత, ప్రజలతో సంప్రదింపులు జరగలేదని, ప్రభుత్వం తగిన విధానం పాటించలేదని పిటిషనర్ ఆరోపించారు. పేమెంట్ సెటిల్మెంట్ సిస్టమ్ యాక్ట్-2007లోని సెక్షన్ 10ఏ కింద తీసుకున్న చర్యల చట్టబద్ధతను కూడా పిటిషనర్ ప్రశ్నించారు.
Also Read
- UPI Charges: మళ్లీ క్యాష్ ఎకానమీ వైపు భారత్? రిటైలర్ల ఆందోళన
- Cooking Oil Prices: పండగల వేళ సామాన్యుడికి ఊరట.. వంటనూనెలపై దిగుమతి కేంద్రం కీలక అడుగు!
- CBI Case: అమెరికా మిషనరీ సంస్థపై CBI కేసు.. 1,000కుపైగా విదేశీ డెబిట్ కార్డుల వ్యవహారం!
- Disha Salian Case: ‘‘ఆమె ఎవరో నాకు తెలియదు’’.. దిశా కేసుపై ఆదిత్య ఠాక్రే కామెంట్స్..
అక్టోబర్ 15 నుంచి కొత్త ఎండీఆర్ విధానం..
వ్యక్తి నుంచి వ్యాపారికి (పర్సన్ టూ మర్చంట్)(P2M) లావాదేవీలపై ఎండీఆర్ అమలులోకి రాబోతోంది. రూ. 2,000 దాటిని వ్యాపార చెల్లింపులపై 0.4 శాతం ఎండీఆర్ విధిస్తారు. సాధారణ వినియోగదారుడు యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు పడవని, ఇది వ్యాపారి చెల్లించే ఛార్జ్ అని కేంద్రం చెబుతోంది. వ్యక్తికి వ్యక్తి(పర్సన్ టూ పర్సన్) మధ్య జరిగే యూపీఐ లావాదేవీలు ఉచితంగానే కొనసాగుతాయని స్పష్టం చేసింది. రూ. 2000 లోపు ఉండే వ్యాపార చెల్లింపులపై కూడా ఎండీ ఆర్ ఉండదు. చిన్న వ్యాపారులు ప్రభావితంకారని కేంద్రం చెబుతోంది. నెలకు రూ. 1 లక్ష లోపు యూపీఐ ద్వారా స్వీకరించే వ్యాపారిపై కూడా ఈ ఎండీఆర్ ఛార్జీలు ఉండవని చెబుతోంది.
తాజావార్తలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
-
ED Raids : అమెరికన్లకు ఫేక్ కాల్స్.. భారత్లో ఈడీ మెరుపు దాడులు.!
-
OTR: కేంద్ర మంత్రి బండి సంజయ్ కు కీలక బాధ్యతలు..?
-
AP High Court: బీసీలకు 34% రిజర్వేషన్లపై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం..
-
Rashmika Mandanna: గానకోకిల బయోపిక్లో నేషనల్ క్రష్.. క్లాప్ కొట్టిన కమల్ హాసన్!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!