UP: యూపీలో దారుణం.. కన్నబిడ్డల్ని కడతేర్చిన కసాయి తల్లి
- యూపీలో దారుణం
- కన్నబిడ్డల్ని కడతేర్చిన కసాయి తల్లి
- నిందితురాలి స్టేట్మెంట్తో షాకైన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నవమాసాలు మోసి.. కని పెంచిన బిడ్డల్ని ఓ కసాయి తల్లి అర్ధాంతరంగా కడతేర్చింది. ముక్కుపచ్చలారని చిన్నారులకు నిండు నూరేళ్ల నిండిపోయేలా చేసింది. ఈ హృదయ విదారకరమైన సంఘటన ఉత్తరప్రదేశ్లోని ఔరయ్యలో చోటుచేసుకుంది.
ఔరయ్యలోని బరావా గ్రామానికి చెందిన ప్రియాంకకు నలుగురు పిల్లలు. ఏడాదిన్నర క్రితం భర్త చనిపోయాడు. అనంతరం ఆమె తన దగ్గర బంధువుతో సహజీవనం చేస్తోంది. అయితే గురువారం ఉదయం ప్రియాంక తన పిల్లలను కేశంపూర్ ఘాట్ దగ్గర తీసుకెళ్లి ఇష్టానుసారంగా కొట్టి చంపి నదిలో పడేసింది. ఈ ఘటనలో 4, 5 ఏళ్ల పిల్లలిద్దరూ ఘాట్ దగ్గర శవాలుగా కనిపించారు.. మరో ఆరేళ్ల బాలుడు అదృష్టవశాత్తూ ఘటనాస్థలం నుంచి తప్పించుకుని సురక్షింగా బయటపడ్డాడు. మరో ఏడాదన్నర చిన్నారి మాత్రం కనిపించకుండాపోయింది.
Also Read
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Shamli Encounter: అంకిత్ బలియాన్ హత్య కేసులో కీలక మలుపు.. పోలీసుల ఎన్కౌంటర్లో ఇద్దరు నిందితులు హతం
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
- Mumbai: ప్రియురాలిపై అనుమానం.. విషం కలిపిన కూల్డ్రింక్తో హత్య
సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనాస్థలికి చేరుకుని నిందితురాలు ప్రియాంకను అదుపులోకి తీసుకున్నారు. తానే పిల్లలను చంపినట్లుగా నేరం అంగీకరించింది. పిల్లల్ని పోషించలేక.. బిడ్డల ఆకలి బాధ చూడలేక చంపేసినట్లు తెలిపింది. ఆమె మాటలు విన్న పోలీసులు షాక్కు గురయ్యారు. ఇదిలా ఉంటే ప్రియాంక భర్త చనిపోయాక.. దగ్గర బంధువుతో రిలేషన్ కొనసాగిస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారులు నది ఒడ్డున విగతజీవులుగా పడి ఉన్న దృశ్యాలు మనసును కలిచి వేస్తున్నాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
తాజావార్తలు
-
NBK111 : బాలయ్య – గోపీచంద్ మలినేని సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ డేట్ ఫిక్స్
-
Suriya 49: ‘సూర్య 49’లో విలన్ గా అక్కినేని నాగార్జున?.. భారీ క్లాష్ రాబోతోందా?
-
Dharman : రజనీకాంత్ – రామ్ పోతినేని ‘ధర్మన్’ సంక్రాంతి రిలీజ్?
-
Xiaomi 18 Fold: షియోమి 18 ఫోల్డ్.. 6,000mAh బ్యాటరీ.. 7.6 ఇంచెస్ డిస్ప్లే, 67W ఫాస్ట్ ఛార్జింగ్
-
Ayodhya Ram Mandir: రూ.4కోట్లు చెక్ ఇచ్చింది.. అకౌంట్లో చూస్తే 3 రూపాయలే ఉన్నాయ్..అయోధ్య చెక్ బౌన్స్ కథ వింటే..
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!