UP: యూపీలో దారుణం.. కన్నబిడ్డల్ని కడతేర్చిన కసాయి తల్లి
- యూపీలో దారుణం
- కన్నబిడ్డల్ని కడతేర్చిన కసాయి తల్లి
- నిందితురాలి స్టేట్మెంట్తో షాకైన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నవమాసాలు మోసి.. కని పెంచిన బిడ్డల్ని ఓ కసాయి తల్లి అర్ధాంతరంగా కడతేర్చింది. ముక్కుపచ్చలారని చిన్నారులకు నిండు నూరేళ్ల నిండిపోయేలా చేసింది. ఈ హృదయ విదారకరమైన సంఘటన ఉత్తరప్రదేశ్లోని ఔరయ్యలో చోటుచేసుకుంది.
ఔరయ్యలోని బరావా గ్రామానికి చెందిన ప్రియాంకకు నలుగురు పిల్లలు. ఏడాదిన్నర క్రితం భర్త చనిపోయాడు. అనంతరం ఆమె తన దగ్గర బంధువుతో సహజీవనం చేస్తోంది. అయితే గురువారం ఉదయం ప్రియాంక తన పిల్లలను కేశంపూర్ ఘాట్ దగ్గర తీసుకెళ్లి ఇష్టానుసారంగా కొట్టి చంపి నదిలో పడేసింది. ఈ ఘటనలో 4, 5 ఏళ్ల పిల్లలిద్దరూ ఘాట్ దగ్గర శవాలుగా కనిపించారు.. మరో ఆరేళ్ల బాలుడు అదృష్టవశాత్తూ ఘటనాస్థలం నుంచి తప్పించుకుని సురక్షింగా బయటపడ్డాడు. మరో ఏడాదన్నర చిన్నారి మాత్రం కనిపించకుండాపోయింది.
Also Read
సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనాస్థలికి చేరుకుని నిందితురాలు ప్రియాంకను అదుపులోకి తీసుకున్నారు. తానే పిల్లలను చంపినట్లుగా నేరం అంగీకరించింది. పిల్లల్ని పోషించలేక.. బిడ్డల ఆకలి బాధ చూడలేక చంపేసినట్లు తెలిపింది. ఆమె మాటలు విన్న పోలీసులు షాక్కు గురయ్యారు. ఇదిలా ఉంటే ప్రియాంక భర్త చనిపోయాక.. దగ్గర బంధువుతో రిలేషన్ కొనసాగిస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారులు నది ఒడ్డున విగతజీవులుగా పడి ఉన్న దృశ్యాలు మనసును కలిచి వేస్తున్నాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!