Uttar Pradesh: అబ్బాయిగా నిద్రపోయి, అమ్మాయిగా లేచాడు.. తెలియకుండా లింగమార్పిడి..
- ఉత్తర్ ప్రదేశ్లో ఘోరం..
- తెలియకుండా అబ్బాయికి లింగమార్పిడి..
- వ్యక్తితో కుమ్మక్కై ఆస్పత్రి దారుణం..
- పెళ్లికి సిద్ధపడ్డ నిందితుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఘోరం చోటు చేసుకుంది. ఒక పురుషుడికి బలవంతంగా ‘‘లింగమార్పిడి’’ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. యూపీలోని ముజఫర్నగర్లోని స్థానిక వైద్య కళాశాలకు చెందిన వైద్యులు, మరో వ్యక్తితో కుమ్మక్కై బాధితుడికి ఇలా సర్జరీ చేశారు. ఈ ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఈ కేసు భారతీయ కిసాన్ యూనియర్(బీకేయూ) నిరసనలకు దారి తీసింది. మన్సూర్పూర్ లోని బేగ్రాజ్పూర్ మెడికల్ కాలేజీలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితుడిని సంజక్ గ్రామ నివాసి ముజాహిద్గా గుర్తించారు. తాను ఓం ప్రకాష్ చేతిలో మోసపోయానని ఆరోపించారు. ఓం ప్రకాష్, ముజాహిద్కి శస్త్రచికిత్స చేయాలని వైద్య కళాశాలలో వైద్యులను ఒప్పి్ంచాడని, తన జననాంగాలను తొలగించి బలవంతంగా లింగ మార్పిడి చేయించాడని ఆరోపించారు.
Read Also: JBL Live Beam 3 Price: జేబీఎల్ నుంచి సరికొత్త ఇయర్బడ్స్.. 48 గంటల ప్లేబ్యాక్ టైమ్!
Also Read
- Gas Pipeline: భారత్ మాస్టర్ ప్లాన్.. సముద్రగర్భంలో భారీ గ్యాస్ పైప్లైన్..
- Kamal Haasan: పొదుపు మంత్రంపై కమల్హాసన్ కీలక వ్యాఖ్యలు
- 1991 India Gold Crisis: రాత్రికి రాత్రి బ్రిటన్కు 47,000 కిలోల బంగారం తరలింపు.. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే!
- LayOffs: స్టార్బక్స్లో మళ్లీ ఉద్యోగుల తొలగింపు.. 300 మంది కార్పొరేట్ స్టాఫ్పై వేటు.. కొన్ని ఆఫీసుల మూసివేత..
గత రెండేళ్లుగా ఓం ప్రకాష్ తనను బెదిరిస్తూ వేధిస్తున్నాడని ముజాహిద్ పేర్కొన్నాడు. ముజాహిద్కి వైద్యపరమైన సమస్య ఉందని చెప్పి ప్రకాష్ అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఆస్పత్రి సిబ్బంది మత్తుమందు ఇచ్చి లింగమార్పిడి చేసినట్లు బాధితుడు వాపోయాడు. ‘‘ అతను నన్ను ఇంటికి తీసుకువచ్చిన ఒక రోజు తర్వాత స్పృహలోకి వచ్చాను. నేను అబ్బాయి నుంచి అమ్మాయిగా మార్చబడ్డాను’’ అని ముజాహిద్ తనకు జరిగిన అన్యాయాన్ని వివరించాడు. ఇప్పుడు తనతో కలిసి జీవించాల్సి ఉంటుందని ఓం ప్రకాష్ తనతో చెప్పాడని, సమాజం, తన కుటుంబం ఎవరూ నన్ను అంగీకరించాడని చెప్పాడని ముజాహిద్ చెప్పాడు. ఇదే కాకుండా తన తండ్రిని చంపుతానని, తన కుటుంబానికి చెందిన భూమిని స్వాధీనం చేసుకుంటానని బెదిరించాడని ఆరోపించాడు.
మగవాడి నుంచి అమ్మాయిలా మార్చానని, తనతోనే జీవించాలని, కోర్టు మ్యారేజ్ కోసం న్యాయవాదిని సిద్ధం చేసినట్లు ఓం ప్రకాష్ చెప్పడాని ముజాహిద్ వెల్లడించారు. ఈ ఘటనపై స్పందించిన బీకేయూ కార్మికులు ఓంప్రకాష్పైనా, సంబంధిత వైద్యులపైనా వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రైతు నాయకుడు శ్యామ్పాల్ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీ వద్ద నిరసనకు దిగారు. సమగ్ర విచారణ జరిపిస్తామని పోలీసులు ఆందోళనకారులకు హామీ ఇచ్చారు. ఆస్పత్రి అక్రమ అవయవాల వ్యాపారానికి కేంద్రంగా మారిందని, లింగమార్పిడి సర్జరీలు చేస్తున్నాంటూ అతను ఆరోపించాడు. ఈ ఘటనపై ముజాహిద్ తండ్రి జూన్ 16న పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఓం ప్రకాష్ని అరెస్ట్ చేశారు. దీనిపై బాధితుడు ముజాహిద్కి రూ. 2 కోట్ల పరిహారం ఇవ్వాలని బీకేయూ డిమాండ్ చేసింది.
తాజావార్తలు
-
CA Student Suspicious Death: భాగ్యనగరంలో విషాదం.. మియాపూర్ సీఏ విద్యార్థి మృతిలో భారీ ట్విస్ట్
-
CSK Vs LSG: లక్నో గ్రౌండ్లో కార్తీక్ శర్మ వీరవిహారం.. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై భారీ స్కోరు..
-
Ragi Aratikaya Bajji: రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.. సాయంత్రం పూట సింపుల్గా ఇలా హెల్తీ స్నాక్స్ చేసుకోండి
-
Vizag: నమ్మినవాడే ప్రాణాలు తీశాడు.. వీడిన అక్కయ్యపాలెం మర్డర్ మిస్టరీ
-
Crime: కాపాడాల్సిన బాబాయే కీచకుడయ్యాడు.. ప్రైవేట్ ఫోటోలతో బెదిరించి బాలికపై దారుణం..
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..