Yogi Adityanath: రాహుల్ గాంధీ నీ వ్యాఖ్యలకు సిగ్గుపడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UP CM Yogi Adityanath slams Rahul Gandhi over China remarks: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్-చైనా ఘర్షణలపై చేసిన వ్యాఖ్యలపై ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ మండిపడ్డారు. అరుణాచల్ ప్రదేశ్ లో భారత జవాన్లను చైనా సైనికులు కొడుతున్నారని రాహుల్ గాంధీ శుక్రవారం కామెంట్స్ చేశాడు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ శ్రేణులు కాంగ్రెస్ పార్టీపై, రాహుల్ గాంధీపై విరుచుకుపడుతున్నారు. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను యోగి ఆదిత్యనాథ్ ఖండించారు. భారత సైన్యంపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు సిగ్గు చేటని, దేశానికి, సైన్యానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధినేత ప్రకటన అసభ్యకరంగా ఉందని విమర్శించారు.
Read Also: Pathaan: వివాదంలో షారుఖ్ ఖాన్ “పఠాన్” మూవీ.. ఈ సారి ముస్లిం బోర్డు నుంచి అభ్యంతరం
Also Read
- National Mourning: ఖతార్ మాజీ ఎమిర్ కన్నుమూత.. భారత్ కీలక నిర్ణయం..
- Success story: గ్రామీణ నేపథ్యం, IIT చదువు లేదు.. కానీ, రూ. 2.6 కోట్ల ప్యాకేజీ సాధించిన కుర్రాడు..
- Karnataka: ‘‘చిల్లర లేకపోతే దిగిపో..’’ మంత్రికే షాక్ ఇచ్చిన బస్ కండక్టర్..
- Monsoon: రైతులకు గుడ్ న్యూస్.. జోరందుకోనున్న రుతుపవనాలు.. జూలై 18-25 మధ్య భారీ వర్ష సూచన
రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు చైల్డిష్ గా ఉన్నాయని.. దేశ వ్యతిరేక శక్తులకు స్పూర్తినిచ్చేలా ఆయన మాట్లాడుతున్నారని అన్నారు. ఆయన ఇలా చేయడం ఇదే తొలిసారి కాదని.. డోక్లామ్ ప్రతిష్టంభన సమయంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారని, భారత సైనికుల పరాక్రమాన్ని గౌరవించే బదులు కించపరుస్తున్నారంటూ మండిపడ్డారు. గతంలో రాహల్ గాంధీ చైనా రాయబారిని కలవడాన్ని గుర్తు చేస్తూ.. కాంగ్రెస్ పార్టీ చైనీయులను కలవడం ద్వారా దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. దేశం, ప్రపంచం మొత్తం భారత వీర జవాన్లు, చైనా దురాక్రమణను తిప్పి కొట్టారని చెబుతున్నా.. వారు మాత్రం నమ్మడం లేదని అన్నారు.
శుక్రవారం రాజస్థాన్ భారత్ జోడో యాత్రలో ఉన్న రాహుల్ గాంధీ, బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. చైనా దురాక్రమణకు పాల్పడుతుంటే కేంద్ర ప్రభుత్వం నిద్రపోతుందని విమర్శించారు. భారతదేశంలో 2000 చదరపు కిలోమీటర్లు స్వాధీనం చేసుకున్నారని..ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ లో భారత సైనికులను కొడుతున్నారంటూ కామెంట్స్ చేశాడు రాహుల్ గాంధీ. ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ సెక్టార్ లో భారత సైన్యం, చైనా సైన్యానికి మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. చైనా, భారత భూభాగాలను ఆక్రమించుకేందుకు ప్రయత్నిస్తే, భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఈ ఘర్షణల్లో ఇరు వైపుల సైనికులు గాయపడ్డారు. అయితే భారత సైన్యం దాడిలో చైనా సైనికులు పెద్ద ఎత్తున గాయపడినట్లు అంతర్జాతీయ మీడియా పలు కథనాలను ప్రచురించింది.
తాజావార్తలు
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Congress: తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీకి తెర.. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామెల్ భేటీ.!
-
National Mourning: ఖతార్ మాజీ ఎమిర్ కన్నుమూత.. భారత్ కీలక నిర్ణయం..
-
Varanasi: రూమరా? నిజమా? రాజమౌళి – మహేష్ బాబు సినిమాతో ఎన్టీఆర్ కొడుకు ఎంట్రీ!
-
Bihar: లవ్ ఎఫైర్.. మహిళా కానిస్టేబుల్ కిడ్నాప్, అత్యాచారం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..