CM Yogi: అసద్ ఎన్కౌంటర్.. వైరల్ అవుతున్న సీఎం యోగి “మట్టిలో కలిపేస్తా” కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yogi Adityanath: గ్యాంగ్స్టర్ అతిక్ అహ్మద్ కొడుకు ఎన్కౌంటర్లో హతమైన తర్వాత యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాత వ్యాఖ్య మళ్లీ ట్రెండ్ అవుతోంది. యూపీ అసెంబ్లీ వేదికగా ఆయన చేసిన హెచ్చరికలు మరోసారి నిజం అయ్యాయి. తాజాగా ఈ రోజు (గురువారం) మధ్యాహ్నం కరడుగట్టిన నేరస్తుడు, గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ కొడుకు అసద్ అహ్మద్, మరో నిందితుడు గులాంలను ఝాన్సీ సమీపంలో జరిగిన ఎన్ కౌంటర్ లో చంపేశారు. యూపీ ఎస్టీఎఫ్ టీం, నిందితులకు మధ్య దాదాపుగా 40 రౌండ్లకు పైగా కాల్పులు జరిగాయి.
2005 బీఎస్పీ ఎమ్మెల్యే రాజుపాల్ హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్న ఉమేష్ పాల్ ను అత్యంత దారుణంగా కాల్చిచంపారు. ఈ ఘటన ఈ ఏడాది ఫిబ్రవరిలో చోటు చేసుకుంది. ఈ కేసులో అసద్ తో పాటు గులాం అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యారు. గత రెండు నెలల నుంచి తప్పించుకుతిరుగుతున్నారు. ఈ రోజు జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు హతం అయ్యారు.
Also Read
- Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై "సింగం" ఫార్ములా బ్లాక్బస్టర్!!
- Delhi: ఢిల్లీ అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు బట్టబయలు.. వంటవాడి నిర్లక్ష్యానికి 21 మంది బలి..
- TMC Rebellion: కోల్కతా టు ఢిల్లీ.. పార్లమెంట్కు పాకిన టీఎంసీ తిరుగుబాటు సెగ.. దీదీకి తప్పని అగ్నిపరీక్ష!
- Delhi: అభిజీత్ దిప్కే పిలుపునకు భారీ స్పందన.. ‘కాక్రోచ్ మాస్కులు’ ధరించి నిరసన బాట పట్టిన యువత..
Read Also: Akhilesh Yadav: అసద్ అహ్మద్ది బూటకపు ఎన్కౌంటర్.. బీజేపీకి కోర్టులపై నమ్మకం లేదు..
https://twitter.com/SmokingLiberals/status/1646418302628159488
ఇదిలా ఉంటే ప్రస్తుతం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. సీఎం తన మాటను నిలబెట్టుకున్నారంటూ పలువురు నెటిజెట్లు ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. ఉమేష్ పాల్ హత్య అనంతరం సీఎం యోగీ అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష నాయకుడు, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ వైపు వేటు చూపిస్తూ… ‘‘నేను మాఫియాను నేలమట్టం చేస్తా, మట్టిలో కలిపేస్తా’’ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అతీక్ అహ్మద్ ను పెంచి పోషించిందే సమాజ్ వాదీ పార్టీ అని, దాని వెన్ను విరిచే పనిలో మేము ఉన్నామని అన్నారు.
అతిక్ అహ్మద్ ను ఉద్దేశిస్తూ..‘‘స్పీకర్ సార్, అతను అన్ని ప్రొఫెషనల్ క్రిమినల్స్, మాఫియాకు గాడ్ పాథర్, వారి నరాల్లో నేరం ఉంది, నేను ఈ రోజు సభకు చెబుతున్నాను, నేను ఈ మాఫియాను మట్టిలో కలిపేస్తా’’అంటూ వ్యాఖ్యానించారు. తాజాగా జరిగిన ఎన్ కౌంటర్ నేపథ్యంలో మరోసారి యోగి చేసిన మాస్ వార్నింగ్ వీడియో ట్రెండ్ అవుతోంది. ఇదిలా ఉంటే ఇది బూటకపు ఎన్ కౌంటర్ అని అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. బీజేపీకి కోర్టులపై నమ్మకం లేదని అన్నారు.
తాజావార్తలు
-
Fish Prasadam 2026 : ఈనెల 8న రాత్రి 9 గంటల నుంచి ‘చేప ప్రసాదం’ పంపిణీ..
-
Varansi: అదంతా ఫేకు.. వారణాసి బడ్జెట్’పై స్టార్ యాక్టర్ సంచలనం!
-
Kalki 2: వచ్చే నెల నుంచే ‘కల్కి 2’ నాన్-స్టాప్ షూటింగ్!
-
SlumDog – 33 Temple Road: ‘స్లమ్డాగ్ – 33 టెంపుల్ రోడ్’ కు డబ్బింగ్ చెప్పిన విజయ్ సేతుపతి… టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
-
Nag Ashwin: కమల్ హాసన్ మిస్ చేసుకున్న కథతో.. నాన్-స్టాప్ మ్యూజికల్ వింతగా ‘సింగ్ గీతం’
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!