Uttar Pradesh: కోర్టుగా మారిన యూపీ అసెంబ్లీ.. ఆరుగురు పోలీసులకు జైలు శిక్ష
UP Assembly turns into courtroom: ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ చరిత్రలోనే కీలక పరిణామం చోటు చేసుకుంది. 58 ఏళ్ల తర్వాత యూపీ అసెంబ్లీ కోర్టుగా మారింది. కోర్టుగా మారడమే కాదు ఏకంగా ఆరుగురు పోలీసులకు జైలు శిక్ష విధించింది. దాదాపుగా రెండు దశాబ్ధాల కాలం ముందు బీజేపీ ఎమ్మెల్యే సలీల్ విష్ణోయ్ ఇచ్చిన ప్రివిలేజ్ నోటీసు ఉల్లంఘనకు సంబంధించి అసెంబ్లీ విచారించింది. ఆరుగురు పోలీసులకు ఒక రోజు జైలు శిక్షను విచారించింది అసెంబ్లీ.
2004లో బీజేపీ ఎమ్మెల్యే విష్ణోయ్ తన కార్యకర్తలతో కలిసి కాన్పూర్ లో విద్యుత్ కోతలకు వ్యతిరేకంగా జిల్లా కలెక్టర్ కు ఒక మెమోరాండం సమర్పించడానికి వెళ్లే సమయంలో పోలీసులు ఆయన పట్ల అనుచితంగా ప్రవర్తించారు. ఈ కేసులో అసెంబ్లీ వ్యవహారాల మంత్రి సురేష్ ఖన్నా ఆరుగరు పోలీసులు ఒకరోజు (అర్దరాత్రి 12 గంటల వరకు) జైలులో ఉండాలని ఆదేశించారు. విచారణ సమయంలో మొత్తం ఆరుగురు పోలీసులు బోనులో నిలబడ్డారు. నిందితుల్లో ఒకరైన అప్పటి సర్కిల్ ఇన్స్పెక్టర్ అబ్దుల్ సమద్, సభకు క్షమాపణలు చెప్పారు. అయినా కూడా శిక్ష నుంచి తప్పించుకోలేకపోయారు. వీరిని అర్దరాత్రి వరకు విధాన సభలోని ఓ గదికి పరిమితం చేసి భోజనం, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నారు.
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
Read Also: Olivia Morris: మా జెన్నీ పాపకు కూడా ఒక అవార్డు ఇస్తే.. సంతోషిస్తాం
ఈ కేసులో కాన్పూర్ నగర్ లోని బాబూ పూర్వా అప్పటి సర్కిల్ ఆఫీసర్ అబ్దుల్ సమద్, కిద్వాయ్ నగర్ ఎస్ హెచ్ ఓ శ్రీకాంత్ శుక్లా, ఎస్ఐ త్రిలోకి సింగ్, కానిస్టేబుళ్లు చోటే సింగ్, వినోద్ మిశ్రా, మెహర్బన్ సింగ్ ఉన్నారు. కోర్టు విచారణ సమయంలో సమాజ్ వాదీ పార్టీ సభ్యులెరు అసెంబ్లీలో లేరు. ప్రతిపక్ష నాయకుడు అఖిలేష్ యాదవ్ తో పాటు అంతా ఎమ్మెల్యేలు సభలో తమకు తక్కువ సమయం ఇచ్చారని వాకౌట్ చేశారు.
1964లో చివరి అసెంబ్లీ కోర్టు నిర్వహించారు. మార్చి 14,1964న అప్పటి ఎమ్మెల్యే నర్సింహ్ నారాయణ్ పాండే తనపై సభలో అవినీతికి సంబంధించిన పోస్టర్లు వేయడంపై అప్పటి యూపీ అసెంబ్లీ స్పీకర్కి ఫిర్యాదు చేశారు. ఈ కేసులో నలుగురు అసెంబ్లీ సభ్యులపై అధికార ఉల్లంఘన నోటీసును జారీ చేశారు. ముగ్గురు సభ్యులు అసెంబ్లీ కమిటీ ముందు హాజరు కాగా, స్పీకర్ పదే పదే విన్నవించినా కేశవ్ సింగ్ అనే వ్యక్తి హాజరుకాలేదు. అనంతరం స్పీకర్ ఆదేశాల మేరకు మార్షల్స్ను గోరఖ్పూర్కు పంపించి కేశవ్సింగ్ను అరెస్టు చేసి సభలో ప్రవేశపెట్టారు. ఉల్లంఘనపై సింగ్కు 7 రోజుల శిక్ష మరియు రూ. 2 జరిమానా కూడా విధించబడింది.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!