Uttar Pradesh: కోర్టుగా మారిన యూపీ అసెంబ్లీ.. ఆరుగురు పోలీసులకు జైలు శిక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UP Assembly turns into courtroom: ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ చరిత్రలోనే కీలక పరిణామం చోటు చేసుకుంది. 58 ఏళ్ల తర్వాత యూపీ అసెంబ్లీ కోర్టుగా మారింది. కోర్టుగా మారడమే కాదు ఏకంగా ఆరుగురు పోలీసులకు జైలు శిక్ష విధించింది. దాదాపుగా రెండు దశాబ్ధాల కాలం ముందు బీజేపీ ఎమ్మెల్యే సలీల్ విష్ణోయ్ ఇచ్చిన ప్రివిలేజ్ నోటీసు ఉల్లంఘనకు సంబంధించి అసెంబ్లీ విచారించింది. ఆరుగురు పోలీసులకు ఒక రోజు జైలు శిక్షను విచారించింది అసెంబ్లీ.
2004లో బీజేపీ ఎమ్మెల్యే విష్ణోయ్ తన కార్యకర్తలతో కలిసి కాన్పూర్ లో విద్యుత్ కోతలకు వ్యతిరేకంగా జిల్లా కలెక్టర్ కు ఒక మెమోరాండం సమర్పించడానికి వెళ్లే సమయంలో పోలీసులు ఆయన పట్ల అనుచితంగా ప్రవర్తించారు. ఈ కేసులో అసెంబ్లీ వ్యవహారాల మంత్రి సురేష్ ఖన్నా ఆరుగరు పోలీసులు ఒకరోజు (అర్దరాత్రి 12 గంటల వరకు) జైలులో ఉండాలని ఆదేశించారు. విచారణ సమయంలో మొత్తం ఆరుగురు పోలీసులు బోనులో నిలబడ్డారు. నిందితుల్లో ఒకరైన అప్పటి సర్కిల్ ఇన్స్పెక్టర్ అబ్దుల్ సమద్, సభకు క్షమాపణలు చెప్పారు. అయినా కూడా శిక్ష నుంచి తప్పించుకోలేకపోయారు. వీరిని అర్దరాత్రి వరకు విధాన సభలోని ఓ గదికి పరిమితం చేసి భోజనం, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నారు.
Also Read
- Supreme Court : ప్రైవేట్ వర్సిటీల ఇష్టారాజ్యంపై సుప్రీంకోర్టు సీరియస్.!
- Geetanjali Angmo: సుప్రీంకోర్టు మెట్లెక్కిన సోనమ్ వాంగ్చుక్ భార్య.. హైకోర్టు తీర్పుపై సవాల్!
- Sonam Wangchuk: సోనమ్ వాంగ్చుక్ను ఆస్పత్రికి తరలించడం సరైనదే: ఢిల్లీ హైకోర్టు
- Congress: డీలిమిటేషన్కు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా? క్లారిటీ ఇచ్చిన జైరాం రమేష్.
Read Also: Olivia Morris: మా జెన్నీ పాపకు కూడా ఒక అవార్డు ఇస్తే.. సంతోషిస్తాం
ఈ కేసులో కాన్పూర్ నగర్ లోని బాబూ పూర్వా అప్పటి సర్కిల్ ఆఫీసర్ అబ్దుల్ సమద్, కిద్వాయ్ నగర్ ఎస్ హెచ్ ఓ శ్రీకాంత్ శుక్లా, ఎస్ఐ త్రిలోకి సింగ్, కానిస్టేబుళ్లు చోటే సింగ్, వినోద్ మిశ్రా, మెహర్బన్ సింగ్ ఉన్నారు. కోర్టు విచారణ సమయంలో సమాజ్ వాదీ పార్టీ సభ్యులెరు అసెంబ్లీలో లేరు. ప్రతిపక్ష నాయకుడు అఖిలేష్ యాదవ్ తో పాటు అంతా ఎమ్మెల్యేలు సభలో తమకు తక్కువ సమయం ఇచ్చారని వాకౌట్ చేశారు.
1964లో చివరి అసెంబ్లీ కోర్టు నిర్వహించారు. మార్చి 14,1964న అప్పటి ఎమ్మెల్యే నర్సింహ్ నారాయణ్ పాండే తనపై సభలో అవినీతికి సంబంధించిన పోస్టర్లు వేయడంపై అప్పటి యూపీ అసెంబ్లీ స్పీకర్కి ఫిర్యాదు చేశారు. ఈ కేసులో నలుగురు అసెంబ్లీ సభ్యులపై అధికార ఉల్లంఘన నోటీసును జారీ చేశారు. ముగ్గురు సభ్యులు అసెంబ్లీ కమిటీ ముందు హాజరు కాగా, స్పీకర్ పదే పదే విన్నవించినా కేశవ్ సింగ్ అనే వ్యక్తి హాజరుకాలేదు. అనంతరం స్పీకర్ ఆదేశాల మేరకు మార్షల్స్ను గోరఖ్పూర్కు పంపించి కేశవ్సింగ్ను అరెస్టు చేసి సభలో ప్రవేశపెట్టారు. ఉల్లంఘనపై సింగ్కు 7 రోజుల శిక్ష మరియు రూ. 2 జరిమానా కూడా విధించబడింది.
తాజావార్తలు
-
US – Iran War: ఇరాన్పై ఒత్తిడి పెంచుతున్న అమెరికా.. వరుస దాడులతో ఉద్రిక్తత.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
-
Lionel Messi: మైదానంలోనే బోరున విలపించిన మెస్సీ..!
-
IND vs ENG 3rd ODI: లార్డ్స్లో భారత్ ఓటమి.. రోహిత్ సెంచరీ వృథా.. వన్డే సిరీస్ కూడా పాయే!
-
JD Vance Fourth Child: నాలుగోసారి తండ్రైన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్.. 150 ఏళ్ల అమెరికా చరిత్రలో అరుదైన ఘట్టం
-
Spain Wins FIFA World Cup 2026: ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్.. అర్జెంటీనాపై 1-0 తేడాతో చారిత్రాత్మక విజయం
ట్రెండింగ్
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!