Mass Festival: ఇదేక్కడి దీపావళి పండగరా బాబు… మరీ ఇలా కూడా చేసుకుంటారా
- కర్ణాటక , తమిళనాడు మధ్య సరిహద్దులో
- జరుపుకునే గోరెహబ్బ పండుగ
- ఆవుపేడను ఒకరిపై మరొకరు విసురుకుంటారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దీపావళి పండుగను.. ఇంట్లో దీపాలతో … ఇంటిని అందంగా అలంకరించి.. సంతోషంగా జరుపుకుంటారు. పిండి వంటలు, కొత్త బట్టలు, టపాసులు. సంపద, శ్రేయస్సు, ఆరోగ్యం, ఆనందంతో కూడిన మేలు కలయికగా ఈ దీపావళి వేడుకలను జరుపుకుంటారు. లక్ష్మీపూజ, దీపాల వెలుగులు, పటాసుల మోతలు వినిపిస్తుంటాయి. కానీ కర్ణాటకలో మాత్రం దీపావళి పండుగను వెరైటీగా చేసుకుంటారు. మగవాళ్లు ఆవుపేడను విసురకుంటూ.. ఆడవాళ్లు ఆవు పేడను ఒంటికి రాసుకుంటూ పండగ జరుపుకుంటారు. కర్ణాటక ,తమిళనాడు సరిహద్దులోని గుమతాపుర గ్రామంలో దీపావళి ముగింపును పురస్కరించుకుని జరుపుకునే గోరెహబ్బ పండుగ ఒక ప్రత్యేకమైన ఆవు పేడ విసిరే ఆచారం.. ఆవు పేడ శుద్ధి చేసే ,ఔషధ గుణాలను కలిగి ఉందనే నమ్మకం ఆధారంగా ఈ కార్యక్రమం శతాబ్దాల నాటి సంప్రదాయం.
Read Also:Throwing Stone:ట్రైన్ లో అవేం పనులమ్మా.. తప్పనిపించడంలేదా..
Also Read
- Kerala: విషాదం.. పెదవి గాయానికి ఆస్పత్రికి వెళ్తే, చిన్నారి ప్రాణమే పోయింది..
- Vietnam: వియత్నాంలో ఘోర బోటు ప్రమాదం.. 18 మంది తెలుగు టూరిస్ట్లు మృతి
- PM Modi: న్యూజిలాండ్లో కన్నీళ్లు పెట్టుకున్న ప్రధాని మోడీ .. ఆ గిఫ్ట్ను చూపిస్తూ స్టేజ్ పైనే భావోద్వేగం!
- అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
ఈ పండుగ దక్షిణ రాష్ట్రాలైన కర్ణాటక , తమిళనాడు మధ్య సరిహద్దులో ఉన్న గుమతాపుర అనే గ్రామంలో జరుగుతుంది. ప్రతి సంవత్సరం దీపావళి బలి పాడ్యమి తర్వాత రోజున గోరెహబ్బ పండగను ఎంతో వైభవంగా జరుపుకుంటారు. పండుగ మధ్యాహ్నం, గ్రామస్తులు పశువుల యజమానుల ఇళ్ల నుండి “మందుగుండు సామగ్రి” సేకరిస్తారు. పేడను ట్రాక్టర్-ట్రాలీల ద్వారా స్థానిక ఆలయానికి తరలిస్తారు. అక్కడ ఒక పూజారి ఆశీర్వాద కర్మ చేస్తారు.ఆశీర్వాదం తర్వాత, ఆవు పేడను బహిరంగ ప్రదేశంలో వేస్తారు. ఆ తరువాత పురుషులు లోపలికి వెళ్లి ఒకరిపై ఒకరు విసురుకుంటారు. స్థానికులకు, ఈ కార్యక్రమం ఒక ఆనందకరమైన, ప్రతీకాత్మకమైన శుద్ధీకరణ ఆచారం, ఇది మంచి ఆరోగ్యం, శ్రేయస్సు మరియు అదృష్టాన్ని తెస్తుందని నమ్ముతారు.
Read Also:IVF: ముసలోడే కానీ.. 93ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్న తాత
ఇందులో పాల్గొనేవారు ఆవుపేడను విసురుకోవడంతో.. కొన్ని వ్యాధులను నయం చేయగలదని కూడా నమ్ముతారు. ఈ పండుగ స్థానిక దేవత బీరేశ్వర స్వామి ఆవు పేడ నుండి జన్మించినందుకు జరుపుకుంటారు. మరొక పురాణం ప్రకారం ఆవు పేడ కుప్పలో ఒక లింగం దొరకడంతో ఈ పండగను నిర్వహించుకుంటున్నారు.
తాజావార్తలు
-
Akkineni Akhil : నా వల్ల సినిమా దెబ్బ తింటుందేమోనని భయపడ్డాను!
-
Kerala: విషాదం.. పెదవి గాయానికి ఆస్పత్రికి వెళ్తే, చిన్నారి ప్రాణమే పోయింది..
-
Vaibhav Sooryavanshi: 3 మ్యాచ్లు.. కేవలం 42 పరుగులు.. వైభవ్ సూర్యవంశీకి నేడే ‘అగ్ని పరీక్ష’!
-
Vietnam: వియత్నాంలో ఘోర బోటు ప్రమాదం.. 18 మంది తెలుగు టూరిస్ట్లు మృతి
-
Jaipur Murder: ప్రభుత్వ ఉద్యోగం కోసం తల్లిని మాత్రమే కాదు, తండ్రిని కూడా చంపింది.!
ట్రెండింగ్
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!