Mass Festival: ఇదేక్కడి దీపావళి పండగరా బాబు… మరీ ఇలా కూడా చేసుకుంటారా
- కర్ణాటక , తమిళనాడు మధ్య సరిహద్దులో
- జరుపుకునే గోరెహబ్బ పండుగ
- ఆవుపేడను ఒకరిపై మరొకరు విసురుకుంటారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దీపావళి పండుగను.. ఇంట్లో దీపాలతో … ఇంటిని అందంగా అలంకరించి.. సంతోషంగా జరుపుకుంటారు. పిండి వంటలు, కొత్త బట్టలు, టపాసులు. సంపద, శ్రేయస్సు, ఆరోగ్యం, ఆనందంతో కూడిన మేలు కలయికగా ఈ దీపావళి వేడుకలను జరుపుకుంటారు. లక్ష్మీపూజ, దీపాల వెలుగులు, పటాసుల మోతలు వినిపిస్తుంటాయి. కానీ కర్ణాటకలో మాత్రం దీపావళి పండుగను వెరైటీగా చేసుకుంటారు. మగవాళ్లు ఆవుపేడను విసురకుంటూ.. ఆడవాళ్లు ఆవు పేడను ఒంటికి రాసుకుంటూ పండగ జరుపుకుంటారు. కర్ణాటక ,తమిళనాడు సరిహద్దులోని గుమతాపుర గ్రామంలో దీపావళి ముగింపును పురస్కరించుకుని జరుపుకునే గోరెహబ్బ పండుగ ఒక ప్రత్యేకమైన ఆవు పేడ విసిరే ఆచారం.. ఆవు పేడ శుద్ధి చేసే ,ఔషధ గుణాలను కలిగి ఉందనే నమ్మకం ఆధారంగా ఈ కార్యక్రమం శతాబ్దాల నాటి సంప్రదాయం.
Read Also:Throwing Stone:ట్రైన్ లో అవేం పనులమ్మా.. తప్పనిపించడంలేదా..
Also Read
- Nashik Forced Conversion: బలవంతపు మతమార్పిడి, లైంగిక వేధింపుల ప్రధాన నిందితురాలు నిదా ఖాన్ అరెస్టు
- DMK vs AIADMK: డీఎంకె-ఏఐఏడీఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. మూకుమ్మడిగా రాజీనామా చేస్తాం.. విజయ్ ఎమ్మెల్యేల హెచ్చరిక
- Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
- TVK Vijay: విజయ్కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్లపై వామపక్షాలు గుర్రు!
ఈ పండుగ దక్షిణ రాష్ట్రాలైన కర్ణాటక , తమిళనాడు మధ్య సరిహద్దులో ఉన్న గుమతాపుర అనే గ్రామంలో జరుగుతుంది. ప్రతి సంవత్సరం దీపావళి బలి పాడ్యమి తర్వాత రోజున గోరెహబ్బ పండగను ఎంతో వైభవంగా జరుపుకుంటారు. పండుగ మధ్యాహ్నం, గ్రామస్తులు పశువుల యజమానుల ఇళ్ల నుండి “మందుగుండు సామగ్రి” సేకరిస్తారు. పేడను ట్రాక్టర్-ట్రాలీల ద్వారా స్థానిక ఆలయానికి తరలిస్తారు. అక్కడ ఒక పూజారి ఆశీర్వాద కర్మ చేస్తారు.ఆశీర్వాదం తర్వాత, ఆవు పేడను బహిరంగ ప్రదేశంలో వేస్తారు. ఆ తరువాత పురుషులు లోపలికి వెళ్లి ఒకరిపై ఒకరు విసురుకుంటారు. స్థానికులకు, ఈ కార్యక్రమం ఒక ఆనందకరమైన, ప్రతీకాత్మకమైన శుద్ధీకరణ ఆచారం, ఇది మంచి ఆరోగ్యం, శ్రేయస్సు మరియు అదృష్టాన్ని తెస్తుందని నమ్ముతారు.
Read Also:IVF: ముసలోడే కానీ.. 93ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్న తాత
ఇందులో పాల్గొనేవారు ఆవుపేడను విసురుకోవడంతో.. కొన్ని వ్యాధులను నయం చేయగలదని కూడా నమ్ముతారు. ఈ పండుగ స్థానిక దేవత బీరేశ్వర స్వామి ఆవు పేడ నుండి జన్మించినందుకు జరుపుకుంటారు. మరొక పురాణం ప్రకారం ఆవు పేడ కుప్పలో ఒక లింగం దొరకడంతో ఈ పండగను నిర్వహించుకుంటున్నారు.
తాజావార్తలు
-
Weather Forecast Today: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. రెండు రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు!
-
Laila: జ్యోతికకు తెలిస్తే చంపేస్తుంది.. సూర్య పై ఓపెన్ కామెంట్స్ చేసిన లైలా
-
IPL Playoffs: ఐపీఎల్ ప్లేఆఫ్స్ లో.. వరుసగా ఐదు మ్యాచ్లలో ఐదు అర్ధ సెంచరీలు సాధించిన తొలి భారతీయుడు అతనే..
-
PEDDI North America Bookings : పెద్ది ఓవర్సీస్.. నార్త్ అమెరికా బుకింగ్స్ ఓపెన్.. 30 నిమిషాల్లో ఊచకోత
-
Nashik Forced Conversion: బలవంతపు మతమార్పిడి, లైంగిక వేధింపుల ప్రధాన నిందితురాలు నిదా ఖాన్ అరెస్టు