Mass Festival: ఇదేక్కడి దీపావళి పండగరా బాబు… మరీ ఇలా కూడా చేసుకుంటారా
- కర్ణాటక , తమిళనాడు మధ్య సరిహద్దులో
- జరుపుకునే గోరెహబ్బ పండుగ
- ఆవుపేడను ఒకరిపై మరొకరు విసురుకుంటారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దీపావళి పండుగను.. ఇంట్లో దీపాలతో … ఇంటిని అందంగా అలంకరించి.. సంతోషంగా జరుపుకుంటారు. పిండి వంటలు, కొత్త బట్టలు, టపాసులు. సంపద, శ్రేయస్సు, ఆరోగ్యం, ఆనందంతో కూడిన మేలు కలయికగా ఈ దీపావళి వేడుకలను జరుపుకుంటారు. లక్ష్మీపూజ, దీపాల వెలుగులు, పటాసుల మోతలు వినిపిస్తుంటాయి. కానీ కర్ణాటకలో మాత్రం దీపావళి పండుగను వెరైటీగా చేసుకుంటారు. మగవాళ్లు ఆవుపేడను విసురకుంటూ.. ఆడవాళ్లు ఆవు పేడను ఒంటికి రాసుకుంటూ పండగ జరుపుకుంటారు. కర్ణాటక ,తమిళనాడు సరిహద్దులోని గుమతాపుర గ్రామంలో దీపావళి ముగింపును పురస్కరించుకుని జరుపుకునే గోరెహబ్బ పండుగ ఒక ప్రత్యేకమైన ఆవు పేడ విసిరే ఆచారం.. ఆవు పేడ శుద్ధి చేసే ,ఔషధ గుణాలను కలిగి ఉందనే నమ్మకం ఆధారంగా ఈ కార్యక్రమం శతాబ్దాల నాటి సంప్రదాయం.
Read Also:Throwing Stone:ట్రైన్ లో అవేం పనులమ్మా.. తప్పనిపించడంలేదా..
Also Read
- Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
- BRICS Summit 2026: పుతిన్-మోడీ-జిన్పింగ్.. ప్రపంచం చూపంతా ఢిల్లీ వైపే!
- Maharashtra: నాందేడ్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కు-టాటా మ్యాజిక్ ఢీ.. 9 మంది మృతి
- IndiGo Flight: టిష్యూ పేపర్పై ‘బాంబు’ బెదిరింపు.. అహ్మదాబాద్లో ఇండిగో ఎమర్జెన్సీ ల్యాండింగ్
ఈ పండుగ దక్షిణ రాష్ట్రాలైన కర్ణాటక , తమిళనాడు మధ్య సరిహద్దులో ఉన్న గుమతాపుర అనే గ్రామంలో జరుగుతుంది. ప్రతి సంవత్సరం దీపావళి బలి పాడ్యమి తర్వాత రోజున గోరెహబ్బ పండగను ఎంతో వైభవంగా జరుపుకుంటారు. పండుగ మధ్యాహ్నం, గ్రామస్తులు పశువుల యజమానుల ఇళ్ల నుండి “మందుగుండు సామగ్రి” సేకరిస్తారు. పేడను ట్రాక్టర్-ట్రాలీల ద్వారా స్థానిక ఆలయానికి తరలిస్తారు. అక్కడ ఒక పూజారి ఆశీర్వాద కర్మ చేస్తారు.ఆశీర్వాదం తర్వాత, ఆవు పేడను బహిరంగ ప్రదేశంలో వేస్తారు. ఆ తరువాత పురుషులు లోపలికి వెళ్లి ఒకరిపై ఒకరు విసురుకుంటారు. స్థానికులకు, ఈ కార్యక్రమం ఒక ఆనందకరమైన, ప్రతీకాత్మకమైన శుద్ధీకరణ ఆచారం, ఇది మంచి ఆరోగ్యం, శ్రేయస్సు మరియు అదృష్టాన్ని తెస్తుందని నమ్ముతారు.
Read Also:IVF: ముసలోడే కానీ.. 93ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్న తాత
ఇందులో పాల్గొనేవారు ఆవుపేడను విసురుకోవడంతో.. కొన్ని వ్యాధులను నయం చేయగలదని కూడా నమ్ముతారు. ఈ పండుగ స్థానిక దేవత బీరేశ్వర స్వామి ఆవు పేడ నుండి జన్మించినందుకు జరుపుకుంటారు. మరొక పురాణం ప్రకారం ఆవు పేడ కుప్పలో ఒక లింగం దొరకడంతో ఈ పండగను నిర్వహించుకుంటున్నారు.
తాజావార్తలు
-
OTR : నెల్లిమర్ల నగర పంచాయతీలో ఛైర్మన్ సీటు పంచాయితీ
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్లో 350 పరుగులు.. తొలి బ్యాటర్గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?