One nation-One election: “భయపడొద్దు”.. జమిలీ ఎన్నికలపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
One nation-One election: కేంద్రం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలకు పిలుపునివ్వడం పలు రకాల ఊహాగానాలకు తెరతీసింది. ముఖ్యంగా ‘ఒకే దేశం-ఒకే ఎన్నికలు’ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా మాజీ రాష్ట్రపతి నేతృత్వంలో కేంద్ర జమిలీ ఎన్నికలపై ఓ కమిటీని ఏర్పాటు చేసింది. దీంతో ఇదే ప్రధాన ఎజెండా అవుతుందని అంతా అనుకుంటున్నారు.
Read Also: Fire Accident: ఫిలిప్పీన్స్లోని గార్మెంట్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. 16 మంది మృతి
Also Read
- Siya Goyal: సియా గోయల్ కుటుంబానికి FDA షాక్.. రూ.8 లక్షల విలువైన వస్తువుల స్వాధీనం
- PM Modi: ఘనంగా ప్రారంభమైన పూరీ జగన్నాథ రథయాత్ర.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు..
- King Cobra Rescue: అమ్మబాబోయ్.. 10 అడుగుల రాచనాగుని చుట్టుకుని బయటకు వచ్చిన మహిళ (వీడియో)
- BMC Taj Mahal Palace Hotel: 26/11 తర్వాత రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు.. తాజ్ హోటల్కు రూ. 22 కోట్ల నోటీసు జారీ
ఇదిలా ఉంటే కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి జమిలీ ఎన్నిలకపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’పై ఒక కమిటీని ఏర్పాటు చేశామని, కమిటీ నివేదిక వస్తుంది, దానిపై చర్చ జరుగుతుందని అన్నారు. పార్లమెంట్ పరిపక్వమైందని, చర్చలు జరుగుతాయి, భయపడాల్సిన అవసరం లేదని, భారత్ ప్రజాస్వామ్యానికి తల్లిలాంటిదని, పరిణామం ఉంటుందని అన్నారు. రెండు మూడు రోజుల్లో ప్రత్యేక సమావేశాల ఎజెండాను తెలియజేస్తామని తెలిపారు.
ఇదిలా ఉంటే ఢిల్లీలో జమిలీ ఎన్నికలపై హాట్ హాట్ చర్చ నడుస్తోంది. మోడీ సర్కార్ జమిలీకి సిద్ధం అవుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. దీనికి బలం చేకూరుస్తూ.. ఈ రోజు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, జమిలీ ఎన్నికల కమిటీ హెడ్ గా ఉన్న మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఇంటికి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.
అంతకుముందు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలపై ప్రకటన చేశారు. సెప్టెంబర్ 18-22 మధ్య ఐదు రోజుల పాటు సమావేశాలు జరుగుతాయని ప్రకటించారు. వినాయక చతుర్థి సమయంలో సమావేశాలేంటని ప్రతిపక్షాలు పెదవి విరుస్తున్నాయి.
#WATCH | On 'One nation, One election', Union Parliamentary Affairs Minsiter Pralhad Joshi says "Right now, a committee has been constituted. A report of the committee will come out which be discussed. The Parliament is mature, and discussions will take place, there is no need to… pic.twitter.com/iITyAacPBq
— ANI (@ANI) September 1, 2023
తాజావార్తలు
-
Vivo T5 Lite: వివో T5 లైట్ 44W 5G ఫోన్ రిలీజ్.. 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, MediaTek Dimensity 6300 ప్రాసెసర్
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
Iran Missile Attack: అమెరికా-ఇరాన్ యుద్ధం మరింత ఉధృతం.. గల్ఫ్ దేశాల్లో అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు
-
FIFA WC 2026: 39 ఏళ్ల మెస్సీని ఇప్పటికీ ఎందుకు ఎవరూ ఆపలేకపోతున్నారు? కారణం ఇదే!
-
Fauzi Release Date : ‘ఫౌజీ’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. డిసెంబర్లో థియేటర్స్ దద్దరిల్లాల్సిందే
ట్రెండింగ్
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!