Waqf Issue: కేరళలో వక్ఫ్ బోర్డు వివాదం.. బాధితుల్ని పరామర్శించిన కేంద్రమంత్రి..
- కేరళలో వక్ఫ్ చిచ్చు..
- వక్ఫ్ బోర్డుకు వ్యతిరేకంగా ఎర్నాకులంలో ఆందోళన..
- తమ భూముల్ని అక్రమంగా క్లెయిమ్ చేసిందని బాధితుల నిరసన..
- బాధితులకు అండగా నిలిచిన కేంద్రమంత్రి సురేష్ గోపి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Waqf Issue: కేరళలో ‘వక్ఫ్’ వివాదం రాజుకుంది. తమ భూమిపై వక్ఫ్ బోర్డు క్లెయిమ్పై ఎర్నాకులం జిల్లాలోని మునంబం గ్రామంలోని 610 కుటుంబాలు ఆందోళన చేస్తున్నాయి. ఆందోళన చేస్తున్న బాధితులకు కేంద్ర మంత్రి సురేష్ గోపి మద్దతు తెలిపారు. బుధవారం వీరిని కలిసి పరామర్శించారు. ఈ సమస్య పరిష్కారానికి కేంద్రం కట్టుబడి ఉందని చెప్పారు. ఈ కుటుంబాలు వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేస్తున్న వారి భూమికి రెవెన్యూ హక్కుల్ని డిమాండ్ చేస్తున్నారు.
Read Also: Amaran : ప్రపంచవ్యాప్తంగా 3200థియేటర్లలో రిలీజైన అమరన్
Also Read
- Bihar: 1992 నాటి కేసు.. 34 ఏళ్ల తర్వాత తీర్పు.. 84 ఏళ్ల వృద్ధుడిని దోషిగా తేల్చిన కోర్టు
- Congress: సంచలన నిర్ణయాలు దిశగా కాంగ్రెస్.. భారీ నాయకత్వ మార్పుల వైపు అడుగులు?
- Lalit Modi: 'ఆమె డబ్బు కోసం ఆశపడేది కాదు', సుష్మితా సేన్తో తన బ్రేకప్పై మౌనం వీడిన లలిత్ మోడీ..
- Sonam Bail Cancellation: రాజా రఘువంశీ హత్య కేసు.. బెయిల్ పై సోనమ్.. మేఘాలయ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఈ వివాదంపై సురేష్ గోపి మాట్లాడుతూ.. నరేంద్రమోడీ నేతృత్వంలోని ప్రభుత్వం నిరసనకారులకు మద్దతు ఇస్తుందని, వారి సమస్యల్ని పరిష్కరిస్తుందని అన్నారు. వక్ఫ్ సవరణ బిల్లు పార్లమెంట్లో ఉందని, అది ఆమోదం పొంది చట్టంగా మారగానే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని వక్ఫ్ ఆక్రమణల్ని పరిష్కరిస్తామన్నారు. 2019లో తన భూముల్ని వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేసినట్లుగా బాధితులు చెప్పారు. 2022లో వారి ఆస్తులకు భూమి పన్ను చెల్లించలేరని చెప్పారని, కేరళ ప్రభుత్వం కలుగజేసుకుని పన్ను చెల్లించేందుకు అనుమతించిందని చెప్పారు.
అయితే, ఈ చర్యను వక్ఫ్ సంరక్షణ సమితి (వక్ఫ్ రక్షణ కమిటీ) కేరళ హైకోర్టులో సవాలు చేసింది. నిరసన తెలిపిన కుటుంబాలను పన్ను చెల్లించేందుకు అనుమతించాలన్న కేరళ ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు నిలిపేసింది. బాధితులు చెబుతున్నదాని ప్రకారం.. తమ భూమిని విద్యా అవసరాల కోసం 1950లో సిద్ధిక్ సైత్ అనే వ్యక్తి ఫరూక్ కాలేజీకి ఇచ్చారు. ఇది వక్ఫ్ భూమి కాదని, కళాశాల యాజమాన్య భూమికి తాము డబ్బు చెల్లించామని చెప్పారు. అయితే, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ చట్టంలో సవరణ కోసం బిల్లును ప్రతిపాదించింది. దీనిని చర్చించేందుకు పార్లమెంట్ జాయింట్ కమిటీ(జేపీసీ)ని ఏర్పాటు చేసింది. ఈ శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టనున్నారు.
తాజావార్తలు
-
RUPEE vs DOLLAR: క్షణాల్లో ఫుడ్ బుక్ చేసుకోకపోతే పస్తులుండాల్సిందే.. విదేశాల్లో దయనీయ దుస్థితిలో భారతీయ విద్యార్థులు.. కారణాలు ఇవే!
-
Bihar: 1992 నాటి కేసు.. 34 ఏళ్ల తర్వాత తీర్పు.. 84 ఏళ్ల వృద్ధుడిని దోషిగా తేల్చిన కోర్టు
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
Psychology Facts: ప్రతి పనికీ 10నిమిషాలు ముందుగా వచ్చే వ్యక్తులు గురించి షాకింగ్ ఫ్యాక్ట్.. తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు!
-
Nikhil : స్వయంభు కోసం 45 రోజుల కఠినమైన శిక్షణ తీసుకున్న హీరో నిఖిల్
ట్రెండింగ్
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!