Waqf Issue: కేరళలో వక్ఫ్ బోర్డు వివాదం.. బాధితుల్ని పరామర్శించిన కేంద్రమంత్రి..
- కేరళలో వక్ఫ్ చిచ్చు..
- వక్ఫ్ బోర్డుకు వ్యతిరేకంగా ఎర్నాకులంలో ఆందోళన..
- తమ భూముల్ని అక్రమంగా క్లెయిమ్ చేసిందని బాధితుల నిరసన..
- బాధితులకు అండగా నిలిచిన కేంద్రమంత్రి సురేష్ గోపి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Waqf Issue: కేరళలో ‘వక్ఫ్’ వివాదం రాజుకుంది. తమ భూమిపై వక్ఫ్ బోర్డు క్లెయిమ్పై ఎర్నాకులం జిల్లాలోని మునంబం గ్రామంలోని 610 కుటుంబాలు ఆందోళన చేస్తున్నాయి. ఆందోళన చేస్తున్న బాధితులకు కేంద్ర మంత్రి సురేష్ గోపి మద్దతు తెలిపారు. బుధవారం వీరిని కలిసి పరామర్శించారు. ఈ సమస్య పరిష్కారానికి కేంద్రం కట్టుబడి ఉందని చెప్పారు. ఈ కుటుంబాలు వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేస్తున్న వారి భూమికి రెవెన్యూ హక్కుల్ని డిమాండ్ చేస్తున్నారు.
Read Also: Amaran : ప్రపంచవ్యాప్తంగా 3200థియేటర్లలో రిలీజైన అమరన్
Also Read
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
- No Petrol: సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు.. థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ లేకపోతే ఇంధనం బంద్..
- Kangana Ranaut: త్రిషపై ఉదయనిధి వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఏమన్నారంటే..!
ఈ వివాదంపై సురేష్ గోపి మాట్లాడుతూ.. నరేంద్రమోడీ నేతృత్వంలోని ప్రభుత్వం నిరసనకారులకు మద్దతు ఇస్తుందని, వారి సమస్యల్ని పరిష్కరిస్తుందని అన్నారు. వక్ఫ్ సవరణ బిల్లు పార్లమెంట్లో ఉందని, అది ఆమోదం పొంది చట్టంగా మారగానే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని వక్ఫ్ ఆక్రమణల్ని పరిష్కరిస్తామన్నారు. 2019లో తన భూముల్ని వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేసినట్లుగా బాధితులు చెప్పారు. 2022లో వారి ఆస్తులకు భూమి పన్ను చెల్లించలేరని చెప్పారని, కేరళ ప్రభుత్వం కలుగజేసుకుని పన్ను చెల్లించేందుకు అనుమతించిందని చెప్పారు.
అయితే, ఈ చర్యను వక్ఫ్ సంరక్షణ సమితి (వక్ఫ్ రక్షణ కమిటీ) కేరళ హైకోర్టులో సవాలు చేసింది. నిరసన తెలిపిన కుటుంబాలను పన్ను చెల్లించేందుకు అనుమతించాలన్న కేరళ ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు నిలిపేసింది. బాధితులు చెబుతున్నదాని ప్రకారం.. తమ భూమిని విద్యా అవసరాల కోసం 1950లో సిద్ధిక్ సైత్ అనే వ్యక్తి ఫరూక్ కాలేజీకి ఇచ్చారు. ఇది వక్ఫ్ భూమి కాదని, కళాశాల యాజమాన్య భూమికి తాము డబ్బు చెల్లించామని చెప్పారు. అయితే, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ చట్టంలో సవరణ కోసం బిల్లును ప్రతిపాదించింది. దీనిని చర్చించేందుకు పార్లమెంట్ జాయింట్ కమిటీ(జేపీసీ)ని ఏర్పాటు చేసింది. ఈ శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టనున్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!