యూపీలో రాజీనామాలు పెద్ద విషయం కాదు.. కొట్టిపారేసిన కేంద్ర మంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతోన్న సమయంలో.. ఉత్తరప్రదేశ్లోని అధికార బీజేపీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.. మూడు రోజుల్లోనే ఏకంగా ముగ్గురు మంత్రులు, 11 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం సంచలనంగా మారింది.. బీజేపీ కూటమి నుంచి 11 మంది ఎమ్మెల్యేలు వైదొలగగా… ఇక, బీజేపీకి చెందినవారే యోగి ఆదిత్యానాథ్ కేబినెట్ నుంచి ముగ్గురు మంత్రులు, 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం పెద్ద చర్చగా మారింది.. ఈ పరిణామాలన్నీ ప్రతిపక్ష సమాజ్వాది పార్టీకి కలిసివస్తాయని అంచనా వేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.. ఈ ప్రభుత్వం అబద్దాలకోరు.. ఎలాంటి అభివృద్ధి చేయలేదు అని అంతా ఆరోపిస్తున్నారు. తాజా పరిస్థితులపై స్పందించిన కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్.. చాలా లైట్గా తీసుకున్నారు.
Read Also: తెలంగాణలో లాక్డౌన్..? క్లారిటీ ఇచ్చిన కేటీఆర్..
Also Read
- Tamil Nadu: మార్పు మొదలైంది.. అర్చకుల అవినీతిపై మంత్రి స్టింగ్ ఆపరేషన్.! రూ.4 వేలు లంచం ఇచ్చి..
- LPG Rule Changes: ఎల్పీజీ నిబంధనల్లో కీలక మార్పులు.. ఉల్లంఘిస్తే గ్యాస్ కనెక్షన్ కట్..!
- Suvendu Adhikari: బంగ్లాదేశ్ గుండెల్లో వణుకు పుట్టిస్తోన్న బెంగాల్ సీఎం.. అక్రమ వలసదారుల తాట తీస్తున్నాడుగా!
- Secret Wedding: ఎంపీ మాజీ భార్యను వివాహం చేసుకున్న బీజేపీ నేత.. అక్కడ సీక్రెట్ వెడ్డింగ్.!
ఉత్తరప్రదేశ్లో మంత్రులు, ఎమ్మెల్యేల రాజీనామాలు పెద్ద విషయం కాదు అన్నారు నరేంద్ర సింగ్ తోమర్… రాష్ట్రంలో అన్ని చోట్ల నుంచి బీజేపీకి మద్దతు లభిస్తోందన్న ఆయన.. ప్రజలు మమ్మల్ని మరోసారి ఆశీర్వదిస్తారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. ఉత్తరప్రదేశ్తో పాటు ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్లలో బీజేపీ విజయం సాధిస్తుంది.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు నరేంద్ర సింగ్ తోమర్. కాగా, మంగళవారం నుంచి ముగ్గురు మంత్రులతో సహా పది మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి గుడ్బై చెప్పారు.. మంత్రిగా ఉన్న మౌర్య నిష్క్రమణతో ఇది ప్రారంభమైంది. అదే రోజున ఆయనకు సన్నిహితులైన ముగ్గురు ఎమ్మెల్యేలు – భగవతి సాగర్, రౌషన్ లాల్ వర్మ మరియు బ్రిజేష్ ప్రజాపతి బీజేపీని వీడగా.. మొన్న మరో మంత్రి దారా సింగ్ చౌహాన్, ఎమ్మెల్యే అవతార్ సింగ్ భదానా రాజీనామా చేశారు. ఇక, నిన్న మంత్రి ధరమ్ సింగ్ సైనీ, మరో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు – వినయ్ షాక్యా, ముఖేష్ వర్మ మరియు బాలా అవస్తి కూడా పార్టీని వీడారు. బీజేపీకి గుడ్బై చెప్పిన ముగ్గురు మంత్రులూ కీలకమైన ఓబీసీ వర్గాలకు చెందిన నేతలు.. యోగి సర్కార్ వెనుకబడిన తరగతులను విస్మరించిందని వారు విమర్శలు గుప్పిస్తున్నారు.
తాజావార్తలు
-
Shubman Gill Vs Vaibhav Suryavanshi: గిల్ మ్యాచ్ గెలిచాడు.. మనస్సులను గెలిచింది మాత్రం వైభవ్ సూర్యవంశే..!
-
Kishan Reddy: సన్న బియ్యం పేరుతో పేదలను మోసం చేస్తున్నారా?.. ప్రభుత్వంపై కిషన్రెడ్డి తీవ్ర విమర్శలు
-
Tamil Nadu: మార్పు మొదలైంది.. అర్చకుల అవినీతిపై మంత్రి స్టింగ్ ఆపరేషన్.! రూ.4 వేలు లంచం ఇచ్చి..
-
Kumar Sangakkara: కెప్టెన్ పరాగ్ మాటలను బహిరంగంగా ఖండించిన కోచ్ సంగక్కర.. అసలు రాజస్థాన్లో ఏం జరుగుతోంది?
-
LPG Rule Changes: ఎల్పీజీ నిబంధనల్లో కీలక మార్పులు.. ఉల్లంఘిస్తే గ్యాస్ కనెక్షన్ కట్..!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..