యూపీలో రాజీనామాలు పెద్ద విషయం కాదు.. కొట్టిపారేసిన కేంద్ర మంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతోన్న సమయంలో.. ఉత్తరప్రదేశ్లోని అధికార బీజేపీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.. మూడు రోజుల్లోనే ఏకంగా ముగ్గురు మంత్రులు, 11 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం సంచలనంగా మారింది.. బీజేపీ కూటమి నుంచి 11 మంది ఎమ్మెల్యేలు వైదొలగగా… ఇక, బీజేపీకి చెందినవారే యోగి ఆదిత్యానాథ్ కేబినెట్ నుంచి ముగ్గురు మంత్రులు, 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం పెద్ద చర్చగా మారింది.. ఈ పరిణామాలన్నీ ప్రతిపక్ష సమాజ్వాది పార్టీకి కలిసివస్తాయని అంచనా వేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.. ఈ ప్రభుత్వం అబద్దాలకోరు.. ఎలాంటి అభివృద్ధి చేయలేదు అని అంతా ఆరోపిస్తున్నారు. తాజా పరిస్థితులపై స్పందించిన కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్.. చాలా లైట్గా తీసుకున్నారు.
Read Also: తెలంగాణలో లాక్డౌన్..? క్లారిటీ ఇచ్చిన కేటీఆర్..
Also Read
- Jantar Mantar Protest: జంతర్ మంతర్ వద్ద మరో నిరసన.. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వేలాది మంది..
- Drugs Control Department: “UP TO 60%/70%/80% DISCOUNT” బోర్డులు.. ఫార్మసీలకు డ్రగ్స్ కంట్రోల్ సీరియస్ వార్నింగ్
- Rahul Gandhi: పెల్లెట్ గన్ ఘటనపై రాహుల్ గాంధీ ధర్నా.. ఎట్టకేలకు ఎఫ్ఐఆర్ నమోదు
- Maharashtra: కొడుకును కాపాడే ప్రయత్నం విషాదాంతం.. తల్లిదండ్రులు సహా ముగ్గురూ మృతి
ఉత్తరప్రదేశ్లో మంత్రులు, ఎమ్మెల్యేల రాజీనామాలు పెద్ద విషయం కాదు అన్నారు నరేంద్ర సింగ్ తోమర్… రాష్ట్రంలో అన్ని చోట్ల నుంచి బీజేపీకి మద్దతు లభిస్తోందన్న ఆయన.. ప్రజలు మమ్మల్ని మరోసారి ఆశీర్వదిస్తారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. ఉత్తరప్రదేశ్తో పాటు ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్లలో బీజేపీ విజయం సాధిస్తుంది.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు నరేంద్ర సింగ్ తోమర్. కాగా, మంగళవారం నుంచి ముగ్గురు మంత్రులతో సహా పది మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి గుడ్బై చెప్పారు.. మంత్రిగా ఉన్న మౌర్య నిష్క్రమణతో ఇది ప్రారంభమైంది. అదే రోజున ఆయనకు సన్నిహితులైన ముగ్గురు ఎమ్మెల్యేలు – భగవతి సాగర్, రౌషన్ లాల్ వర్మ మరియు బ్రిజేష్ ప్రజాపతి బీజేపీని వీడగా.. మొన్న మరో మంత్రి దారా సింగ్ చౌహాన్, ఎమ్మెల్యే అవతార్ సింగ్ భదానా రాజీనామా చేశారు. ఇక, నిన్న మంత్రి ధరమ్ సింగ్ సైనీ, మరో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు – వినయ్ షాక్యా, ముఖేష్ వర్మ మరియు బాలా అవస్తి కూడా పార్టీని వీడారు. బీజేపీకి గుడ్బై చెప్పిన ముగ్గురు మంత్రులూ కీలకమైన ఓబీసీ వర్గాలకు చెందిన నేతలు.. యోగి సర్కార్ వెనుకబడిన తరగతులను విస్మరించిందని వారు విమర్శలు గుప్పిస్తున్నారు.
తాజావార్తలు
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
-
CM Revanth Reddy : ఆక్స్ఫర్డ్కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్లో కొత్త క్యాంపస్.?
-
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
-
OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!