NTV Telugu Site icon

మత్స్య శాఖకు రూ. 20 వేల కోట్లు: కేంద్ర మంత్రి, మురుగన్

జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు సమీక్ష సమావేశాన్ని ఆదివారం నిర్వహిచారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మురుగన్ మాట్లాడుతూ.. 70 ఏళ్ల తర్వాత మొదటిసారి మత్స్య శాఖలో అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కేటాయించినందుకు ప్రధాన మంత్రి మోడీకి ధన్యవాదాలు తెలిపారు. ఆత్మ నిర్భర్‌ భారత్‌లో భాగంగా మత్స్య శాఖకు రూ.20వేల కోట్ల నిధులు కేటాయించారు. తమిళనాడులో సీ విడ్ పార్క్ ఏర్పాటుతో వేలాది మంది మహిళలకు ఉపాధి దొరకడంతో పాటు ఆర్థిక చేయూత నిస్తుందన్నారు. విదేశాల్లో భారతదేశ సీ ఫుడ్‌కు మంచి ఆదరణ డిమాండ్ ఉందని కేంద్ర మంత్రి మురుగన్ తెలిపారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. మత్స్య పరిశ్రమ అభివృద్ధికి తీసుకునే కార్యక్రమాలను వివరించారు. ఐదు ఫిషింగ్ హార్బర్‌లను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు. కొచ్చిన్, చెన్నై, వైజాగ్, పార్వతీపురం మోడ్రన్ ఫిషింగ్ హార్బర్స్ డిసెంబర్‌లో ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాయన్నారు.

విదేశాలకు మత్స్య సంపద ఎగుమతికి కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహిస్తోందని దీనికోసం అన్ని సదుపాయాలను సమకూరుస్తున్నామన్నారు. రైతులకు ఇచ్చినట్లు కిసాన్ క్రెడిట్ కార్డులు మత్స్యకారులకు kcc కార్డులను ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిపారు. భవిష్యత్‌లో డ్రోన్లు కీలక పాత్ర పోషించనున్నాయ్. డ్రోన్ సదుపాయంతో జాలర్లకు సాయం చేయాలని నిర్ణయించినట్టు కేంద్ర మత్స్య శాఖ మంత్రి మురుగన్‌ తెలిపారు.