Union Minister Anurag Thakur: లిక్కర్ స్కామ్ లో అసలు నిందితుడు కేజ్రీవాలే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Union Minister Anurag Thakur criticizes Delhi CM Kejriwal in liquor scam: బీజేపీ, ఆప్ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఏ1గా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అని సీబీఐ ఎఫ్ఐఆర్ లో పేర్కొంది. మరో 15 మందిపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది సీబీఐ. ఈ వ్యవహారంపై బీజేపీ, ఆప్ నాయకులు విమర్శలు ప్రతివిమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ శనివారం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, డిఫ్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read Also: Vivek Agnihotri: కరీనా కపూర్కి దర్శకుడు స్ట్రాంగ్ కౌంటర్
Also Read
- Kangana Ranaut: సియా గోయల్ తల్లిదండ్రులకు కంగనా రనౌత్ మద్దతు!.. కేతన్ హ*త్య కేసు గురించి మాట్లాడుతూ..
- Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
- Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
- Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
లిక్కర్ స్కామ్ కేసులో మనీష్ సిసోడియా ఏ 1 కావచ్చు.. కానీ కింగ్ పిన్ మాత్రం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాలే అని ఆరోపించారు. అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. ఈ స్కామ్ బయటపడిన తర్వాత మనీష్ సిసోడియా అతని ముఖంలో రంగు ఎలా మారిపోయిందో స్పష్టంగా కనిపిస్తుందని.. మీడియా అడిగిన ఏ ప్రశ్నకు కూడా అతడు సరిగ్గా సమాధానం ఇవ్వలేదని.. అన్నారు. మద్యం పాలసీ మంచిదైతే వెనక్కి ఎందుకు తీసుకున్నారని..మద్యం వ్యాపారులపై మెతక వైఖరి ఎందుకని.. ఢిల్లీ సీఎం 24 గంటల్లో దేశం ముందుకు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు అనురాగ్ ఠాకూర్. మనీష్ సిసోడియా తన పేరు స్పెల్లింగ్ ను ‘‘ మని ష్’’(M O N E Y SHH)గా మార్చుకొవాలని..ఎందుకంటే అతను డబ్బులు సంపాదించి మౌనంగా ఉంటారని విమర్శించారు.
మరోవైపు 2024లో లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోదీ, అరవింద్ కేజ్రీవాల్ మధ్య జరుగుతాయని సిసోడియా చేసిన వ్యాఖ్యలపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. 2024లో అరవింద్ కేజ్రీవాల్ ప్రతిపక్షాల పీఎం అభ్యర్థి అయితే బీజేపీకే మంచిదని.. మరింత మెజారిటీతో గెలుస్తానమి ఆయన వ్యాఖ్యానించారు. ఇటీవల రోహింగ్యాల విషయంలో కూడా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఆప్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అక్రమంగా భారత్ లోకి వచ్చిన రోహింగ్యాలకు ఉచిత నీరు, ఉచిత విద్యుత్, రేషన్ ఇస్తున్నారని.. విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.
తాజావార్తలు
-
TVS NTORQ 125: కొత్త కలర్స్, స్పోర్టీ గ్రాఫిక్స్తో టీవీఎస్ NTORQ 125.. యువత కోసం స్టైలిష్ అప్డేట్, ధరలు ఇవే!
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
-
Andhra Pradesh Rain Alert: ద్రోణి, తుఫాన్ ఆవర్తనం ప్రభావం.. ఏపీలో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
-
Abhishek Sharma: మ్యాచ్ ఓడినా వరల్డ్ రికార్డ్ సృష్టించిన కాటేరమ్మకొడుకు.. ప్రపంచంలోనే బ్యాటర్గా ఘనత..
-
Moringa Health Benefits: మునగను ‘మిరాకిల్ ట్రీ’ అని ఎందుకు అంటారు? కారణాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ట్రెండింగ్
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!