Cabinet Meet: మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ.. బండి సంజయ్ నిరాకరిస్తే.. ఎవరికి చోటుపై చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cabinet Meet: ఇవాళ ప్రధాని మోడీ అధ్యక్షతన కేబినెట్ భేటీ అనంతరం కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై స్పష్టత వస్తుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈనేపథ్యంలో తెలంగాణ నుంచి మోడీ కేబినెట్లో ఎవరికి అవకాశం దక్కుతుందనే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కేంద్రమంత్రి పదవుల రేసులో పలువురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. బండి సంజయ్కు కేంద్ర కేబినెట్లో చేరేందుకు నిరాకరిస్తే.. రాష్ట్రం నుంచి ఎవరికి చోటు కల్పిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో కిషన్రెడ్డి, బండి సంజయ్లతో పాటు నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్, ఆదిలాబాద్ నుంచి సోయం బాపురావు, యూపీ నుంచి రాజ్యసభకు నామినేట్ అయిన కె.లక్ష్మణ్లు బీజేపీ ఎంపీలుగా ఉన్నారు. దీంతో వీరిలో ఒకరికి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం లేదు. వీరిలో కె.లక్ష్మణ్ ఇప్పటికే పార్టీ పార్లమెంటరీ బోర్డు, కేంద్ర ఎన్నికల కమిటీల్లో సభ్యుడిగా ఉన్నారు. మరోవైపు మంగళవారం ఎంపీ సోయం బాపురా ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లారు. కేంద్ర మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో బీజేపీ నేతలు ఆయన్ను ఢిల్లీకి పిలిపించారు. మరోవైపు మంత్రివర్గ విస్తరణ జరిగితే తెలంగాణకు చెందిన ఇద్దరికి కేంద్ర కేబినెట్లో చోటు దక్కుతుందని ప్రచారం జరుగుతోంది. కాగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన కిషన్రెడ్డి మంగళవారం హైదరాబాద్లో ఉన్నా ఎలాంటి స్పందనా లేదు.
Read also: Bandi Sanjay: మీ అందరికి అభినందనలు.. బండి ట్విట్ వైరల్
Also Read
- Airbus C295: భారత రక్షణ రంగంలో చారిత్రాత్మక ఘట్టం.. గగనతలంలోకి తొలి 'మేడ్ ఇన్ ఇండియా' మిలిటరీ విమానం..
- Hindu Rate of Growth: ప్రధాని మోడీ ప్రస్తావించిన 'హిందూ గ్రోత్ రేట్' అంటే ఏంటి? షాకింగ్ నిజాలు..
- Excise Duty: వాహనదారులకు బంపర్ ఆఫర్.. ఆ పెట్రోల్పై ఎక్సైజ్ డ్యూటీ పూర్తిగా రద్దు చేసిన కేంద్రం!
- Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
మరోవైపు తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తనను తప్పించడం పట్ల బండి సంజయ్ సంతృప్తి చెందినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డిని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బీజేపీ అధిష్టానం నియమించినట్లు తెలుస్తోంది. త్వరలో కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుందన్న ఊహాగానాల దృష్ట్యా బండి సంజయ్కు కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. లేదంటే పార్టీ జాతీయ కార్యవర్గంలో కూడా చోటు కల్పించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రతిపాదనలపై బండి సంజయ్ విముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తాను సాధారణ పార్టీ కార్యకర్తగానే కొనసాగుతానని సంజయ్ బీజేపీ నాయకత్వానికి చెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మంగళవారం ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసిన బండి సంజయ్.. ఆ తర్వాత మీడియా కంట పడకుండా వెళ్లిపోయారు. ఈ ఏడాది చివర్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి బండి సంజయ్ను తప్పించడంపై ఆయన ధీమాగా ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర అధ్యక్షుడిగా తన పనితీరును బీజేపీ నేతలు పలు సందర్భాల్లో మెచ్చుకున్నారనే భావనలో బండి సంజయ్ ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో పార్టీ అప్పగించిన ఇతర బాధ్యతలను స్వీకరించేందుకు బండి సంజయ్ నిరాకరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Rangoli: పాతబస్తీలో విషాదం.. ప్రాణం తీసిన ‘ముగ్గు’ వివాదం
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: మరోసారి అదే నిర్లక్ష్యం.. మళ్లీ బొక్కబోర్లా పడ్డ వైభవ్.!
-
Aluminium Foil: చైనాకు భారత్ గట్టి దెబ్బ! ఈ లోహంపై యాంటీ-డంపింగ్ సుంకం పొడిగింపు..’మేక్ ఇన్ ఇండియా’కు బలం
-
Jagapathi Babu : ‘పెద్ది’ని దించాలని కొందరు ఇడియట్స్ ప్రయత్నించారు.. ట్రోలర్స్ కి జగ్గూ భాయ్ స్ట్రాంగ్ కౌంటర్
-
Airbus C295: భారత రక్షణ రంగంలో చారిత్రాత్మక ఘట్టం.. గగనతలంలోకి తొలి ‘మేడ్ ఇన్ ఇండియా’ మిలిటరీ విమానం..
-
EDLI Scheme: పీఎఫ్ ఖాతా ఉందా? ఉచితంగా రూ.7 లక్షల జీవిత బీమా.. EPF అందించే ఈ ప్రయోజనం గురించి తెలుసా?
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!