Ujjain Case: రక్తంతో సాయం కోసం 8 కి.మీ నడక.. ఆటో డ్రైవర్, మరో ముగ్గురి అరెస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ujjain Case: ఉజ్జయిని అత్యాచార ఘటన సభ్య సమాజం తలదించుకునేలా చేసింది. 15 ఏళ్ల బాలిక దారుణంగా అత్యాచారానికి గురై సాయం కోసం బతిమిలాడితే కనీసం ఒక్కరు కూడా పట్టించుకోలేదు. చివరకు రూ.50, 100 ఇవ్వాలని ప్రయత్నించారే తప్పితే తీవ్రం బాధపడుతున్న బాలికను ఆస్పత్రిలో చేర్చాలని చూడలేదు. ఈ అత్యాచార ఘటనలో ప్రజలు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారనేది కళ్లకు కట్టినట్లు చూపించింది.
అర్థనగ్నంగా 8 కిలోమీటర్లు నడిచి ఇంటింటికి వెళ్లి వేడుకున్నా ఒక్కరూ కనికరించలేదు, ఓ నివాసం వద్దకు వెళ్లగా ఓ వ్యక్తి ఆమెను తరిమి కొట్టడం సీసీ కెమెరాల్లో రికార్డైంది. చివరకు ఓ పూజారి బాలికకు కొత్త బట్టలు ఇచ్చి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమెను ఆస్పత్రికి తరలించారు. బాలిక పరిస్థితిని చూసి కొందరు ఆర్థికంగా సాయం చేసేందుకు చూశారని ఉజ్జయిని ఎస్పీ సచిన్ శర్మ అన్నారు.
Also Read
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- IMD Rain Alert: దక్షిణ, ఈశాన్య రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
- India At UN: పాక్కు భారత్ షాక్.. కాశ్మీర్ రాగం పాడితే ఇదే సమాధానం!
ఈ కేసులో ఇప్పటి వరకు ఒక ఆటో డ్రైవర్ తో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఆటో డ్రైవర్ ని రాకెష్(38) గా గుర్తించారు. బాధిత బాలిక జీవన్ ఖేరీ వద్ద ఆటో ఎక్కిందని, దానికి సంబంధించిన సీసీటీవీ వీడియో లభించిందని పోలీసులు తెలిపారు. ఆటోపై రక్తపు మరకలు ఉండటంతో వాటి నమూనాలను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపామని పోలీసులు వెల్లడించారు.
Read Also: Chinese Hackers: అమెరికా ప్రభుత్వానికి చెందిన 60వేల ఈ మెయిల్స్ దొంగిలించిన చైనీస్ హ్యాకర్లు
ఈ సంఘటన వెలుగులోకి రావడానికి ఒక రోజు ముందు మైనర్ బాలిక తప్పిపోయినట్లు తెలిసిందని, బాలిక వేర్వేరు ప్రాంతాల్లో ఐదుగురిని కలుసుకుందని అందర్ని విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ తో పాటు దేశం మొత్తాన్ని షాక్ కి గురిచేసింది. ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం రావడంతో మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేశారు.
అయితే ఈ ఘటనలో బాలిక ప్రత్యేకంగా సాయం గురించి మాత్రమే అడగ లేదని, తనను ఎవరో వెంబడిస్తున్నారని చెప్పిందని పోలీసులు తెలిపారు. నేను ప్రమాదంలో ఉన్నాను, నా వెనక ఎవరో వస్తున్నారని బాలిక పదేపదే చెప్పినట్లు పలువురు పోలీసులకు తెలిపినట్లు సమాచారం. తీవ్రగాయాల పాలైన బాలిక పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది. ఉజ్జయినికి 700 కి.మీ దూరంలో ఉన్న మధ్యప్రదేశ్ లోని మరో జిల్లాలో ఆమె తాతా, అన్నయ్యతో కలిసి ఉంటున్నట్లు తెలసింది. ఆదివారం బయటకు వెళ్లిన బాలిక మళ్లీ ఇంటికి తిరిగి రాకపోవడంతో మిస్సింగ్ కంప్లైట్ నమోదైంది.
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!