Uddhav Thackeray: కాంగ్రెస్లో కలుపుతారనే భయం.. ఉద్ధవ్ ఎంపీల తిరుగుబాటు వెనక అసలు స్టోరీ..
- ఉద్ధవ్ ఠాక్రే శివసేన (యూబీటీ) నుంచి ఆరుగురు ఎంపీలు తిరుగుబాటు.
- పక్కా స్కెచ్తో ఢిల్లీకి చేరిన ఎంపీలు..
- ఏక్నాథ్ షిండే వర్గంలో చేరేందుకు ఢిల్లీలో కీలక భేటీలు.
- లోక్సభ స్పీకర్కు ప్రత్యేక గ్రూప్ గుర్తింపు కోరుతూ లేఖ.
- కాంగ్రెస్లో పార్టీ విలీనంపై ఎంపీల ఆందోళన.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uddhav Thackeray: ఉద్ధవ్ ఠాక్రే పార్టీ మరోసారి చీలిపోయింది. శివసేన(యూబీటీ) ఎంపీలు తిరుగుబాటు చేశారు. ఉద్ధవ్ సేనకు 9 మంది ఎంపీలు ఉంటే, వీరిలో ఆరుగురు రెబల్ వర్గంగా విడిపోయారు. చడిచప్పుడు కాకుండా అర్ధరాత్రి ఢిల్లీకి చేరుకోవడం, మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేతో రహస్య భేటీ, లోక్సభ స్పీకర్కు లేఖ ఇవ్వడం ఇలా అన్ని ప్రణాళికాబద్ధంగా సాగాయి. శివసేన యూబీటీ ఎంపీలు తిరుగుబాటు ఎవరికీ తెలియకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించారు.
పక్కా ప్లాన్తో ఢిల్లీకి..
తిరుగుబాటు చేసిన ఎంపీల్లో సంజయ్ జాదవ్, సంజయ్ దేశ్ముఖ్, ఓమ్రాజే నింబాల్కర్, భాసాహెబ్ వాక్చౌరే, నాగేశ్ పాటిల్ అష్టికర్, సంజయ్ దినా పాటిల్ ఉన్నారు. వీరంతా జూన్ 14న పార్టీ సమావేశానికి హాజరుకాలేదు. దీని తర్వాత జరిగిన ఆదిత్య ఠాక్రే పుట్టినరోజుకు కూడా వీరు దూరంగా ఉన్నారు. జూన్ 16న ఢిల్లీకి చేరుకున్న మొదటి ఎంపీగా నాగేష్ అష్టికర్ ఉన్నారు. ఆయన తెల్లవారజామును నాందేడ్ నుంచి ప్రైవేట్ జెట్లో దేశ రాజధానిలో ల్యాండ్ అయ్యారు. ఆ తర్వాత మిగతా ఎంపీలు కూడా ప్రత్యేక విమానాల్లో ఢిల్లీకి చేరారు. జూన్ 16తెల్లవారుజామున శివసేన అధినేత ఏక్నాథ్ షిండే కూడా ఢిల్లీకి వెళ్లారు. జూన్ 17న ఉదయం 7 గంటలకు స్పీకర్ ఓం బిర్లాను కలిసి, తామంతా ఏక్నాథ్ షిండే శివసేనలో విలీనం అవుతున్నామని, సభలో తమకు సీట్లను మార్చాలని లేఖ సమర్పించారు.
Also Read
- Modi-Putin: మోడీతో పుతిన్ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
- China: బ్రిక్స్ సదస్సు భారత్ విజయవంతంగా నిర్వహించాలి.. మోడీ-జిన్పింగ్ భేటీకి ముందు చైనా కీలక వ్యాఖ్యలు
- BRICS Summit: పుతిన్, జిన్పింగ్ ఎక్కడ బస చేస్తున్నారు? ఢిల్లీలో స్టార్ హోటళ్లన్నీ హైసెక్యూరిటీ జోన్లే!
- Putin Car: బుల్లెట్లు, బాంబులు ఏం చేయలేవు.. పుతిన్ ‘‘ఆరస్ సెనాట్’’ కారు ప్రత్యేకతలు ఇవే..
కాంగ్రెస్లో విలీనం చేస్తారనే భయం..
ఎంపీలు సమర్పించిన లేఖలో ఉద్ధవ్ ఠాక్రే తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తారనే భయాన్ని వ్యక్తం చేశారు. ఇదే కాకుండా 9 మంది ఎంపీల్లో ఆరుగురు తిరుగుబాటు చేయడంతో, ఫిరాయింపు నిరోధక చట్టం కింద అనర్హత తప్పించుకోవడానికి అవసరమైన మూడింట రెండొతుల మెజారిటీ ఉంది. శివసేన ఆవిర్భావ దినోత్సవం జూన్ 20న తిరుగుబాటు ఎంపీలు షిండేను కలవనున్నారు. ఉద్ధవ్ వర్గాన్ని ఎందుకు వీడాల్సి వచ్చిందనే వివరాలను వెల్లడించనున్నారు.
తాజావార్తలు
-
Modi-Putin: మోడీతో పుతిన్ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
-
Rain Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. 13 జిల్లాలకు అలర్ట్ జారీ..
-
China: బ్రిక్స్ సదస్సు భారత్ విజయవంతంగా నిర్వహించాలి.. మోడీ-జిన్పింగ్ భేటీకి ముందు చైనా కీలక వ్యాఖ్యలు
-
BRICS Summit: పుతిన్, జిన్పింగ్ ఎక్కడ బస చేస్తున్నారు? ఢిల్లీలో స్టార్ హోటళ్లన్నీ హైసెక్యూరిటీ జోన్లే!
-
Nethanna Bharosa: పెన్షన్లకు దరఖాస్తు చేసుకునే వారికి శుభవార్త.. దరఖాస్తులో ఆ నిబంధన మినహాయింపు..
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?