Uddhav Thackeray: ఉద్ధవ్ శివసేన మళ్లీ చీలిపోయింది.. ఎంపీల తిరుగుబాటు..
- ఉద్ధవ్ ఠాక్రే శివసేన (యూబీటీ)కి చెందిన 6 మంది ఎంపీల తిరుగుబాటు.
- ప్రత్యేక గ్రూప్గా గుర్తించాలని స్పీకర్ ఓం బిర్లాకు లేఖ.
- తిరుగుబాటు ఎంపీలు షిండే శివసేనలో చేరే అవకాశం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uddhav Thackeray: శివసేన మరోసారి చీలిపోయింది. ఉద్ధవ్ ఠాక్రేకు చెందిన శివసేన(యూబీటీ) ఎంపీలు బిగ్ షాక్ ఇచ్చారు. 9 మంది ఎంపీల్లో ఆరుగురు తిరుగుబాటు చేశారు. ఉద్ధవ్ వర్గాన్ని వీడి, వీరంతా అసలైన శివసేన ఏక్నాథ్ షిండే వర్గంలో చేరేందుకు సిద్ధమయ్యారు. తమను ఒక ప్రత్యేక బృందంగా పరిగణించాలని కోరుతూ ఆరుగురు ఎంపీలు స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. లేఖ రాసిన వారిలో ఉద్ధవ్ ఎంపీలు సంజయ్ జాదవ్, సంజయ్ దేశ్ముఖ్, నగేష్ పాటిల్ అస్తికర్, ఓంరాజే నింబాల్కర్, భౌసాహెబ్ వాక్చౌరే, సంజయ్ దిన పాటిల్ ఉన్నారు. ప్రస్తుతం ముగ్గురు ఎంపీలు మాత్రమే ఉద్ధవ్ వర్గంలో ఉన్నారు.
ఉద్ధవ్ ఠాక్రేకు చెందిన ఆరుగురు తిరుగుబాటు ఎంపీలు బుధవారం నాందేడ్, పూణే, ముంబైల నుంచి ప్రైవేట్ విమానంలో ఢిల్లీకి చేరుకున్నారు. వీరితో పాటు ఏక్నాథ్ షిండే శివసేనకు చెందిన ఒక సీనియర్ నాయకుడు కూడా ఢిల్లీకి వచ్చి, స్పీకర్కు మద్దతు లేఖను సమర్పించారు. తిరుగుబాటు ఊహాగానాల నేపథ్యంలో, ఉద్ధవ్ సన్నిహితుడు, రాజ్యసభ సంజయ్ రౌత్ ఢిల్లీ నివాసంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో శివసేన(యూబీటికి) చెందిన ఎంపీలు అవింద్ సావంత్, అనిల్ దేశాయ్, రాజభౌ ఉన్నారు.
Also Read
- CM Vijay: మెట్రోలో ప్రయాణించిన సీఎం విజయ్.. ప్రయాణికులతో సంభాషణ.. అభిమానులు కేరింతలు
- IMD Alert: దేశ వ్యాప్తంగా రుతుపవనాలు.. ఈ రాష్ట్రాలకు భారీ వర్షాలు
- Nitin Gadkari: 2016కు ముందు వాహనాలకు కొన్ని మార్పులు అవసరం.. E20 పెట్రోల్పై గడ్కరీ..
- Trump-Iran: జోర్డాన్లో అమెరికా స్థావరంపై ఇరాన్ క్షిపణి దాడి.. తీవ్ర ప్రతీకారం ఉంటుందని ట్రంప్ హెచ్చరిక
మా ఎంపీలు ఉద్ధవ్ ఠాక్రే నేత నేతృత్వంలోని శివసేన కాగడా గుర్తపై ఎన్నికయ్యారుని, వారు ప్రధాని మోడీ పేరు మీద గెలవలేదని, ఎవరైనా తిరుగుబాటు చేస్తే వారిని వదిలిపెట్టేది లేదని సంజయ్ రౌత్ హెచ్చరించారు. వెళ్లాలనుకునే వారు రాజీనామా చేసి వెళ్లవచ్చని అన్నారు. మరోవైపు, ఈ తిరుగుబాటుపై ఎంపీలపై విలేకరుల సమావేశంలోనే రౌత్ బూతుల వర్షం కురిపించడం వివాదంగా మారింది.
తాజావార్తలు
-
Off The Record: కందుకూరు పాలిటిక్స్లో కొత్త ట్విస్ట్.. మానుగుంట మహీధర్ రెడ్డి మళ్లీ రంగంలోకి?
-
OTR : హైకోర్టు తీర్పుతో BRSకు బ్రహ్మాస్త్రమా? HYDRAపై కొత్త వ్యూహంతో గ్రేటర్ ఎన్నికలే టార్గెట్!
-
Sleeping Less Than 5 Hours?: రోజుకు 5 గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
-
CM Vijay: మెట్రోలో ప్రయాణించిన సీఎం విజయ్.. ప్రయాణికులతో సంభాషణ.. అభిమానులు కేరింతలు
-
China: అమెరికా శత్రువులతో చైనా ఒప్పందం.. ప్రపంచం ముందు మరో సంక్షోభం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్టాప్లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!