Uddhav Thackeray: ఉద్ధవ్ శివసేన మళ్లీ చీలిపోయింది.. ఎంపీల తిరుగుబాటు..
- ఉద్ధవ్ ఠాక్రే శివసేన (యూబీటీ)కి చెందిన 6 మంది ఎంపీల తిరుగుబాటు.
- ప్రత్యేక గ్రూప్గా గుర్తించాలని స్పీకర్ ఓం బిర్లాకు లేఖ.
- తిరుగుబాటు ఎంపీలు షిండే శివసేనలో చేరే అవకాశం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uddhav Thackeray: శివసేన మరోసారి చీలిపోయింది. ఉద్ధవ్ ఠాక్రేకు చెందిన శివసేన(యూబీటీ) ఎంపీలు బిగ్ షాక్ ఇచ్చారు. 9 మంది ఎంపీల్లో ఆరుగురు తిరుగుబాటు చేశారు. ఉద్ధవ్ వర్గాన్ని వీడి, వీరంతా అసలైన శివసేన ఏక్నాథ్ షిండే వర్గంలో చేరేందుకు సిద్ధమయ్యారు. తమను ఒక ప్రత్యేక బృందంగా పరిగణించాలని కోరుతూ ఆరుగురు ఎంపీలు స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. లేఖ రాసిన వారిలో ఉద్ధవ్ ఎంపీలు సంజయ్ జాదవ్, సంజయ్ దేశ్ముఖ్, నగేష్ పాటిల్ అస్తికర్, ఓంరాజే నింబాల్కర్, భౌసాహెబ్ వాక్చౌరే, సంజయ్ దిన పాటిల్ ఉన్నారు. ప్రస్తుతం ముగ్గురు ఎంపీలు మాత్రమే ఉద్ధవ్ వర్గంలో ఉన్నారు.
ఉద్ధవ్ ఠాక్రేకు చెందిన ఆరుగురు తిరుగుబాటు ఎంపీలు బుధవారం నాందేడ్, పూణే, ముంబైల నుంచి ప్రైవేట్ విమానంలో ఢిల్లీకి చేరుకున్నారు. వీరితో పాటు ఏక్నాథ్ షిండే శివసేనకు చెందిన ఒక సీనియర్ నాయకుడు కూడా ఢిల్లీకి వచ్చి, స్పీకర్కు మద్దతు లేఖను సమర్పించారు. తిరుగుబాటు ఊహాగానాల నేపథ్యంలో, ఉద్ధవ్ సన్నిహితుడు, రాజ్యసభ సంజయ్ రౌత్ ఢిల్లీ నివాసంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో శివసేన(యూబీటికి) చెందిన ఎంపీలు అవింద్ సావంత్, అనిల్ దేశాయ్, రాజభౌ ఉన్నారు.
Also Read
- Colleges Closed: బిగ్షాక్.. దేశవ్యాప్తంగా 58 ఇంజనీరింగ్ కళాశాలలు మూసివేత.. తెలంగాణ, ఏపీ నుంచి ఎన్నంటే..
- PM Modi: ప్రధాని మోడీ ఇండోనేషియా పర్యటన.. బ్రహ్మోస్ ఒప్పందమే కీలకం..
- E20 protest: E20 పెట్రోల్కు వ్యతిరేకంగా దేశంలో తొలిసారి నిరసన..
- Ayodhya Ram mandir: అయోధ్య రామాలయంలో "బంగారు రామచరితమానస్" మాయం.?
మా ఎంపీలు ఉద్ధవ్ ఠాక్రే నేత నేతృత్వంలోని శివసేన కాగడా గుర్తపై ఎన్నికయ్యారుని, వారు ప్రధాని మోడీ పేరు మీద గెలవలేదని, ఎవరైనా తిరుగుబాటు చేస్తే వారిని వదిలిపెట్టేది లేదని సంజయ్ రౌత్ హెచ్చరించారు. వెళ్లాలనుకునే వారు రాజీనామా చేసి వెళ్లవచ్చని అన్నారు. మరోవైపు, ఈ తిరుగుబాటుపై ఎంపీలపై విలేకరుల సమావేశంలోనే రౌత్ బూతుల వర్షం కురిపించడం వివాదంగా మారింది.
తాజావార్తలు
-
Nara Lokesh : ప్రవాసాంధ్రులంతా ఏపీ బ్రాండ్ అంబాసిడర్లే..
-
Kishan Reddy : మజ్లిస్ ను ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో రేవంత్ ప్రభుత్వం
-
Kapil Dev: విరాట్ కోహ్లీ తొందరపడ్డాడు.. 37 ఏళ్ల వయసులో ఆ రేంజ్ ఫామ్ పెట్టుకుని ఏంటా నిర్ణయం?
-
Pakistan: పాక్ ఎయిర్ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ అసిమ్ తారిఖ్ హతం..
-
Colleges Closed: బిగ్షాక్.. దేశవ్యాప్తంగా 58 ఇంజనీరింగ్ కళాశాలలు మూసివేత.. తెలంగాణ, ఏపీ నుంచి ఎన్నంటే..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!