Udhayanidhi Stalin: వారికి మాత్రమే దీపావళి శుభాకాంక్షలు.. దుమారం రేపుతున్న ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు
- వారికి మాత్రమే దీపావళి శుభాకాంక్షలు
- దుమారం రేపుతున్న ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు
- ఉదయనిధి స్టాలిన్పై మండిపడ్డ బీజేపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దీపావళి పండుగ వేళ తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ వ్యవహార శైలి రాజకీయ దుమారం రేపుతోంది. దీపావళి పండుగను పురస్కరించుకుని ఆ విశ్వాసం ఉన్నవారికి మాత్రమే దీపావళి శుభాకాంక్షలు అంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
ఒక కార్యక్రమంలో ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ.. ‘‘నేను వేదికపైకి వస్తున్నప్పుడు చాలామంది నాకు పుష్పగుచ్ఛాలు, పుస్తకాలు ఇచ్చారు. మరి కొందరు నాకు ఏమి చెప్పాలో తెలియలేదు. కొందరు దీపావళికి శుభాకాంక్షలు చెప్పాలా వద్దా అని సంకోచించారు. నేను ఏమనుకుంటానో అని వెనక్కి తగ్గారు. అయితే ఆ విశ్వాసం ఉన్నవారికి నేను దీపావళి శుభాకాంక్షలు చెబుతున్నాను.’’ అని వ్యాఖ్యానించారు.
Also Read
- Prakash Chik Baraik: టీఎంసీకి మరో ఎదురు దెబ్బ.. మూడో రాజ్యసభ సభ్యుడు రాజీనామా..
- Airbus C295: భారత రక్షణ రంగంలో చారిత్రాత్మక ఘట్టం.. గగనతలంలోకి తొలి 'మేడ్ ఇన్ ఇండియా' మిలిటరీ విమానం..
- Hindu Rate of Growth: ప్రధాని మోడీ ప్రస్తావించిన 'హిందూ గ్రోత్ రేట్' అంటే ఏంటి? షాకింగ్ నిజాలు..
- Excise Duty: వాహనదారులకు బంపర్ ఆఫర్.. ఆ పెట్రోల్పై ఎక్సైజ్ డ్యూటీ పూర్తిగా రద్దు చేసిన కేంద్రం!
ఇది కూడా చదవండి: UP: మేనల్లుడితో పారిపోయిన ఇద్దరు పిల్లల తల్లి.. 6 నెలల తర్వాత ఏమైందంటే..!
ప్రస్తుతం ఈ వ్యాఖ్యలే రాజకీయ దుమారం రేపుతున్నాయి. డీఎంకే హిందువులపై వివక్ష చూపుతోందని బీజేపీ ధ్వజమెత్తింది. తెలంగాణ మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నాయకురాలు తమిళిసై మండిపడ్డారు. ‘‘వారు అంగీకరించినా.. అంగీకరించకపోయినా వారు ప్రాథమికంగా హిందువులు. నమ్మేవారిని మాత్రమే మేము కోరుకోము. ఉదయనిధి వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను.’’ అని అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్లకు తమిళిసై దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘మీరు ఇతర మతాల వారిని పలకరించేటప్పుడు అది నమ్మేవారి కోసమే అని మీరు అనరు. కానీ హిందూ మతం విషయానికి వస్తే మాత్రం అది నమ్మేవారి కోసమే అని మీరు అంటున్నారు’’. అని మండిపడ్డారు.
ఇది కూడా చదవండి: Gold Rates: దీపావళి రోజున గోల్డ్ లవర్స్కు స్వల్ప ఊరట.. నేడు ధరలు ఇలా..!
ఇక తమిళనాడు బీజేపీ అధికార ప్రతినిధి ఎఎన్ఎస్ ప్రసాద్ మాట్లాడుతూ.. పండుగల సమయంలో హిందువులను పలకరించడానికి డీఎంకే ప్రభుత్వానికి ప్రాథమిక దయ కూడా లేదా అని ధ్వజమెత్తారు. ‘‘డీఎంకే హిందూ వ్యతిరేక పార్టీ అనేది అందరికీ తెలిసిన విషయమే. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి పౌరుడిని సమానత్వంతో చూసుకోవాల్సిన బాధ్యత వారిపై ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా జాగ్రత్తగా రూపొందించిన రాజ్యాంగం ఈ ఆవశ్యకతను స్పష్టంగా నొక్కి చెబుతుంది. అయినప్పటికీ డీఎంకే పాలనలో హిందూ పండుగలకు శుభాకాంక్షలు తెలిపే ప్రాథమిక దయ కూడా లేదా? బదులుగా హిందూ విశ్వాసానికి వ్యతిరేకంగా ప్రత్యేకంగా నిరంతరాయంగా దుమ్మెత్తిపోయడమే ఎంచుకుంది.’’ అని ఎఎన్ఎస్ ప్రసాద్ మండిపడ్డారు.
2023లో కూడా సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సనాతన ధర్మం సామాజిక న్యాయం అనే ఆలోచనకు విరుద్ధమని.. దీన్ని నిర్మూలించాలని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులతో పోల్చారు. అప్పట్లో ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. తాజాగా దీపావళి శుభాకాంక్షలు.. విశ్వసించేవారికి మాత్రమే అని వ్యాఖ్యానించారు.
వచ్చే ఏడాది ప్రారంభంలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం అన్ని పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. మరోసారి అధికారం కోసం డీఎంకే.. ఈసారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని ఎన్డీఏ కూటమి భావిస్తోంది.
ఇది కూడా చదవండి: Trump-Modi: రష్యా చమురు కొనడం ఆపేయాలి.. లేదంటే భారీ సుంకాలుంటాయి.. భారత్కు మళ్లీ ట్రంప్ హెచ్చరిక
తాజావార్తలు
-
Aus vs Ban: ఆస్ట్రేలియాకు దెబ్బ మీద దెబ్బ.. బంగ్లాదేశ్ బౌలర్ల ధాటికి పరుగుల ఖాతా తెరవకముందే మూడు వికెట్లు డౌన్.!
-
Tollywood : తెలుగులో అప్పట్లో హ్యాట్రిక్ ఫ్లాప్స్.. అయినా వరుస ఛాన్సులు
-
తెలంగాణ Inter Advanced Supplementary Results విడుదల.. ఫస్ట్ ఇయర్లో 68.84%, సెకండ్ ఇయర్లో 49.29% ఉత్తీర్ణత.!
-
Intelligent Bird : ప్రపంచంలోనే అత్యంత తెలివైన పక్షి! దీనికి 5 ఏళ్ల పిల్లాడి తెలివితేటలు…
-
Mahabharat Facts: మహాభారత యుద్ధంలో పాల్గొనని ఈ నలుగురు మహా యోధులు.. వీళ్లు తలుచుకుంటే ఫలితం వేరేలా ఉండేది!
ట్రెండింగ్
-
Fact Check: హీరోయిన్తో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..