UP: వికటించిన జుట్టు మార్పిడి శస్త్రచికిత్స.. ఇద్దరు ఇంజనీర్లు మృతి
- ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో దారుణం
- వికటించిన జుట్టు మార్పిడి శస్త్రచికిత్స
- ఇద్దరు ఇంజనీర్లు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జట్టు.. ముఖ సౌందర్యానికి అందం. జట్టు లేకపోతే ఎన్ని ఇబ్బందులో వాళ్లకే మాత్రమే తెలుస్తోంది. బట్టతలతో చాలా ఇబ్బందులు పడుతుంటారు. బయటకు వెళ్లాలన్నా.. నలుగురిలో కలవాలన్నా.. ఇబ్బంది ఫీలవుతుంటారు. అలాంటి వాళ్ల కోసం వైద్య రంగంలో ఎన్నో శస్త్ర చికిత్సలు వచ్చాయి. శస్త్ర చికిత్సల ద్వారా వెంట్రుకలు మొలిపిస్తున్నారు. అయితే ఏమైందో.. ఏమో తెలియదు గానీ.. అలా శస్త్ర చికిత్స చేసుకున్న ఇద్దరు ఇంజనీర్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది. ఇందుకు కారణమైన డాక్టర్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి: Heavy Rains: హైదరాబాద్లో వర్షం.. భారీగా ట్రాఫిక్ జామ్..
Also Read
- Liquor Ban: ఏంటి! ఇన్ని రోజులు "బ్రాండెడ్ విషం" తాగారా? ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్ సహా ఈ బ్రాండ్ల గుట్టు రట్టు..
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
- No Petrol: సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు.. థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ లేకపోతే ఇంధనం బంద్..
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో వినిత్ కుమార్ దూబే, ప్రమోద్ కటియార్ అనే ఇద్దరు ఇంజనీర్లు మార్చి 13న జట్టుకు సంబంధించి శస్త్ర చికిత్స చేయించుకున్నారు. అయితే శస్త్ర చికిత్స వికటించింది. దీంతో వారు వేరే ఆస్పత్రిలో చేరారు. శస్త్ర చికిత్స జరిగిన 48 గంటల్లోనే వినిత్ కుమార్ దూబే, ప్రమోద్ కటియార్ ప్రాణాలు కోల్పోయారు.
ఇది కూడా చదవండి: PM Modi: నుదిట సిందూరాన్ని తుడిచిన వాళ్లను మట్టిలో కలిపేశాం
అయితే శస్త్ర చికిత్స వికటించడం వల్లే తన భర్త ప్రాణాలు కోల్పోయాడని వినిత్ కుమార్ దూబే భార్య జయ త్రిపాఠి పోలీసులుకు చెప్పింది. కానీ పట్టించుకోలేదు. తిరిగి ఆమె మే 9న పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే కేసు నమోదు చేసుకున్న పోలీసులు వైద్యురాలి కోసం వెతికారు. కానీ దొరకలేదు. దీంతో వైద్యురాలు అనుష్క తివారీ సోమవారం పోలీసులు ఎదుట లొంగిపోయింది.

పోలీసులు తొలుత కేసు సీరియస్గా తీసుకోలేదని.. అందుకే ఫిర్యాదు చేయడంలో ఆలస్యం అయిందని త్రిపాఠి తెలిపారు. ముఖ్యమంత్రి ఫిర్యాదుల విభాగంలో ఫిర్యాదు చేశాకే.. కేసు ముందుకు సాగిందని.. దీంతో మే 9న పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పింది. మార్చి 14న ఫోన్ కాల్ వచ్చిందని.. వెళ్లి చూస్తే తన భర్త ముఖం వాచిపోయి ఉందని చెప్పింది. వైద్యురాలిని సంప్రదించడానికి ప్రయత్నిస్తే అందుబాటులోకి రాలేదని తెలిపింది.

ఇక వైద్యురాలు అనుష్క తివారీపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. శస్త్ర చికిత్స అనేది ఆమె రంగానికి సంబంధించినది కాదని తేలింది. ఇందుకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని ప్రభుత్వ న్యాయవాది దిలీప్ సింగ్ తెలిపారు. కాకదేశ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని.. ప్రాథమికంగా అనుష్క తివారీ దోషి అని తేలిందని చెప్పారు. కేసు తీవ్రతను బట్టి సోమవారం వైద్యురాలి కోర్టులో లొంగిపోయింది. అనంతరం జైలుకు తరలించారు.
తాజావార్తలు
-
Salman Khan: ఒక బాత్రూమ్కు 70 మంది.. జైల్లో గడిపిన రోజులు గుర్తు చేసుకున్న సల్మాన్ ఖాన్..
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Liquor Ban: ఏంటి! ఇన్ని రోజులు “బ్రాండెడ్ విషం” తాగారా? ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్ సహా ఈ బ్రాండ్ల గుట్టు రట్టు..
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని అడ్డంకులే, తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకూడదు!
-
Oppo A7 Pro Max: ఒప్పో A7 ప్రో మాక్స్ రిలీజ్.. 10000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. ధర, ఫీచర్లు ఇవే!
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!