Rs.2000 Notes: నేడే లాస్ట్ ఛాన్స్.. రూ. 2000 నోట్లను మార్చుకోండి లేదంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rs.2000 Notes: నేటితో రూ.2000 నోట్ల మార్పిడి, డిపాజిట్లకు ఆర్బీఐ ఇచ్చిన గడువు ముగియనుంది. రేపటి నుంచి రూ. 2 వేల నోటు చెల్లదు. అయితే.. ఇప్పటికే చాలా మంది తమ వద్ద ఉన్న రూ.2000 నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేశారు. మరికొందరు ఇతర లావాదేవీల ద్వారా నోట్లను మార్చుకున్నారు. అయితే.. కొందరు మాత్రం నిర్లక్ష్యంగా.. ఏమరపాటుతో ఉన్నారు. అలాంటి వారు ఈరోజు చివరి అవకాశం. ఈరోజు తమ వద్ద ఉన్న పెద్ద నోట్లను బ్యాంకులకు వెళ్లి మార్చుకోవాలని బ్యాంకర్లు కోరుతున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మే 19, 2023న దేశంలో అతిపెద్ద కరెన్సీని డీమోనిటైజేషన్ చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయం ప్రకారం.. రూ. 2,000 నోటును చెలామణి నుంచి తొలగించారు.
అయితే.. ఈ నోట్లను మార్కెట్ లో మార్చుకునేందుకు సెప్టెంబర్ 30 వరకు వెసులుబాటు కల్పించింది. ఆర్బీఐ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, మార్చి 31, 2023 నాటికి రూ.3.62 లక్షల కోట్ల విలువైన నోట్లు చెలామణిలో ఉన్నాయి. సెప్టెంబరు 1, 2023న ఆర్బీఐ విడుదల చేసిన లెక్కల ప్రకారం రూ.24,000 కోట్ల విలువైన రూ.2000 నోట్లు ఇప్పటికీ సామాన్య ప్రజల వద్దనే ఉన్నాయని, ఇంకా బ్యాంకులకు తిరిగి రావాల్సి ఉందన్నారు. అందులో రూ.3.32 లక్షల కోట్లు అంటే 93 శాతం నోట్లు బ్యాంకింగ్ వ్యవస్థకు తిరిగి వచ్చాయి. మిగిలిన 7 శాతం రూ. 24,000 కోట్లు రూ. 2000 నోట్లు ఇంకా వాపస్ రావాల్సి ఉంది. రూ.2000 నోట్లను డిపాజిట్ చేయడానికి లేదా మార్చుకోవడానికి గడువు ముగిసిన తర్వాత.. ఆర్బిఐ తన ప్రాంతీయ కార్యాలయాల్లో కొంత కాలం పాటు మరిన్ని నోట్లను మార్చుకోవడానికి అనుమతించాలని భావిస్తోంది, తద్వారా ప్రజలకు ఉపశమనం లభిస్తుంది. అయితే దీనిపై RBI తన స్టాండ్ను 30 సెప్టెంబర్ 2023న స్పష్టం చేయవచ్చు.
Also Read
- Sana Malik: పాకిస్తాన్లోని ఇస్లామిక్ చట్టాన్ని భారత్ లో అమలు చేయాలి.. ఎమ్మెల్యే సనా మాలిక్ సంచలన వ్యాఖ్యలు
- Ketan Agarwal Murder: 6 నెలల ప్లానింగ్.. 2004 ఫోన్ కాల్స్, 238 గంటల టాక్ టైమ్.. వణుకు పుట్టిస్తున్న మర్డర్ స్కెచ్..
- PM Modi: వెనెజువెలాకు భారత్ అండ.. సహాయ సహకారాలు అందిస్తామన్న ప్రధాని మోడీ..
- Ayodhya: రామాలయ నిధుల వివాదంలో కొత్త ట్విస్ట్.. PMOకు సైతం లెక్కలు ఇవ్వని రామ్ మందిర్ ట్రస్ట్!
గడువు పొడిగిస్తారా?
పెద్ద నోట్ల మార్పిడికి గడువు పొడిగిస్తారా? అనే ప్రశ్న అందరికి ప్రశ్నార్థకంగా మారింది. సాధారణంగా పాన్ను ఆధార్తో లింక్ చేయడం.. లేదా నామినీ పేరును డీమ్యాట్తో లింక్ చేయడం.. అలాంటి ఫైనాన్స్ సంబంధిత పనులకు గడువు తేదీ పొడిగించబడుతుంది. ఈ విషయంలోనూ గడువు పొడిగిస్తారన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. ఎందుకంటే వరుసగా బ్యాంకులకు సెలవుల కారణంగా ఆర్బీఐ మరో నెల పొడిగించే అవకాశం ఉందని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Mirzapur The Movie : మిర్జాపూర్: ది మూవీ’ టీజర్ విడుదల
-
OTT Movies: ఈ వారం ఓటీటీలో అదిరిపోయే తెలుగు, తమిళ సినిమాలు
-
YS Jagan: మహిళలకు మరో మోసం.. డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేస్తున్నారు!
-
iQOO Neo11s: ఐకూ Neo11s వచ్చేస్తోంది.. 8000mAh భారీ బ్యాటరీ, 144Hz 2K డిస్ప్లేతో గేమర్లకు కొత్త పవర్హౌస్!
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
ట్రెండింగ్
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!
-
IND vs BAN: నేడు టీమిండియాకు కీలక మ్యాచ్.. గెలవకుంటే ఇంటికే.. కొడితే గట్టిగా కొట్టాల్సిందే!
-
ట్యాబ్లెట్ కాదు.. మినీ ల్యాప్టాప్! 13-అంగుళాల 3.5K డిస్ప్లే, 144Hz డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో Moto Pad 70 Pro..