ఇండియా కరోనా కేసులు మళ్లీ క్రమంగా పెరిగిపోతున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం… గత 24 గంటల్లో కొత్తగా 8,503 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో 624 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు వదిలారు. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,46,74,744 కు చేరుకుంది. అలాగే మరణాల సంఖ్య 4,74,735 కు చేరుకుంది. ఇక, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 94,943 యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులెటిన్లో పేర్కొంది కేంద్రం. ఇక గత 24 గంటల్లో 65,32,43,539 శాంపిల్స్ పరీక్షించారు. అలాగే మరో వైపు.. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతుండగా.. ఇప్పటి వరకు 1,31,18,87,257 మందికి పైగా టీకా వేసినట్లు బులెటిన్లో పేర్కొంది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.