ఇండియాలో కరోనా కేసులు పెరుగుతూ, తగ్గుతూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా కరోనా బులిటెన్ను విడుదల చేసింది. ఈ బులిటెన్ ప్రకారం, గడిచిన 24 గంటల్లో ఇండియాలో 43,393 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,07,52,950 కి చేరింది. ఇందులో 2,98,88,284 మంది కోలుకొని డిశ్చార్జ్కాగా, 4,58,727 కేసులు యాక్టీవ్గా ఉన్నాయి. ఇక, గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 911 మంది మృతి చెందారు. దేశంలో ఇప్పటి వరకు మొత్తం 4,05,939 మంది కరోనాతో మృతి చెందారు. ఒక్క రోజులో దేశంలో 44,459 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఇప్పటి వరకు దేశంలో 36,89,91,222 మందికి వ్యాక్సిన్ అందించారు.