ఇండియాలో ఇవాళ కరోనా కేసులు కాస్త తగ్గిపోయాయి. 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 10,229 కేసులు నమోదయ్యాయి. ఇక దేశంలో 3,38,49,785 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1,34,096 కేసులు యాక్టీవ్గా ఉన్నాయి.ఇక గడిచిన 24 గంటల్లో కరోనాతో 125 మంది మృతి చెందారు. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు కరోనాతో 4,63,655 మంది మృతి చెందినట్టు గణాంకాలు చెబుతున్నాయి. 24 గంటల్లో ఇండియాలో 11,926 మంది కరోనా నుంచి కోలుకోగా 30,20,119 మంది టీకాలు తీసుకున్నారు. దేశంలో ఇప్పటి వరకు మొత్తం 1,12,34,30,478 కోట్ల మందికి టీకాలు తీసుకున్నారు.