TMC Crisis: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇప్పటికే పార్టీలో చీలిక వచ్చింది. తిరుగుబాటు నేతలు తమదే అసలైన టీఎంసీ అని చెప్పుకుంటున్నారు. పార్టీకి ఉన్న 80 మంది ఎమ్మెల్యేలలో 60 మంది మమతా బెనర్జీని కాదని రీటబ్రత బెనర్జీ వెనక చేరారు. ఇక ఎంపీలు అంతా టీఎంసీకి దూరయ్యారు.
ఇదిలా ఉంటే, మమతా బెనర్జీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. టీఎంసీకి చెందిన ముగ్గురు మాజీ సీనియర్ నాయకులు, రాజ్యసభ ఎంపీలు బీజేపీలో చేరారు. సుఖేందు శేఖర్ రాయ్, సుష్మితా దేవ్, ప్రకాష్ చిక్ బారాయిక్లు బీజేపీలో చేరుతున్నారని బీజేపీ సీనియర్ నేత షామిక్ భట్టాచార్య అధికారికంగా ప్రకటించారు. ఈ ముగ్గురు గురువారం బీజేపీలో చేరారని వెల్లడించారు. బీజేపీలో చేరడానికి ముందు ఈ ముగ్గురు నేతల తమ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.

