TMC Crisis: మమతకు భారీ షాక్.. 60 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటు..!

  • టీఎంసీలో భారీ తిరుగుబాటు
  • 60 మంది ఎమ్మెల్యేలు రీటబ్రతకు మద్దతు
  • మమత పక్షాన కేవలం 20 మంది ఎమ్మెల్యేలు మాత్రమే
  • స్పీకర్‌కు 58 మంది ఎమ్మెల్యేల లేఖ
  • ప్రతిపక్ష నేత పదవిపై రాజకీయ పోరు
  • అభిషేక్ బెనర్జీపై పెరుగుతున్న అసంతృప్తి
Mamata Banerjee

Mamata Banerjee

TMC Crisis: తృణమూల్ కాంగ్రెస్ తన చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. మమతా అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా శోవన్‌దేబ్ చటోపాధ్యాయను నియమించడంపై వివాదం మొదలైంది. ఇప్పుడు టీఎంసీకి ఉన్న 80 మంది ఎమ్మెల్యేలలో 60 మంది వరకు మమతపై తిరుగుబాటు చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని పార్టీ నుంచి సస్పెండ్ చేసి రీటబ్రత బెనర్జీ వెనక తిరుగుబాటు ఎమ్మెల్యేలు నిలిచారు. దీంతో కేవలం 20 మంది ఎమ్మెల్యేలు మాత్రమే మమత పక్షాన ఉన్నారు. రీటబ్రతను ప్రతిపక్ష నేతగా నియమించాలని తిరుగుబాటు ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు మమతా బెనర్జీనే తమ పార్టీ నాయకురాలిగా కోరుకుంటున్నారు.

తిరుగుబాటు ఎమ్మెల్యేలు స్పీకర్‌కు సమర్పించిన లేఖలో 58 మంది ఎమ్మెల్యేల సంతకాలు ఉన్నాయి. మరో ఇద్దరు కూడా సంతకం చేస్తున్నట్లు సమాచారం. దాదాపుగా రీటబ్రత బెనర్జీ ప్రతిపక్ష నేతగా ఎన్నికైనట్లే. నిబంధనల ప్రకారం, ఒక పార్టీల్లో ఒక వర్గం మెజారిటీ సాధించాలంటే కనీసం మూడింట రెండు వంతుల సీట్లు అవసరం, అంటే టీఎంసీలో ఉన్న 80 మంది ఎమ్మెల్యేలలో 53 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఇప్పుడు రీటబ్రత దీని కన్నా ఎక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతు పొందారు.

×
×
Ad

పార్టీ నుంచి సస్పెండ్ అయిన రీటబ్రత, సందీపన్ సాహాలు ఈ మొత్తం వ్యవహారంలో కీలకంగా మారారు. మెజారిటీ ఎమ్మెల్యేలు మమత మేనల్లుడు, డైమండ్ హార్బర్ ఎంపీ అభిషేక్ బెనర్జీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. బహిష్కరణకు గురైన ఇద్దరు నేతలు అసెంబ్లీలో స్పీకర్ ఛాంబర్ లో బీజేపీ నాయకుడు, సీఎం సువేందు అధికారితో 15-20 నిమిషాలు సమావేశమైనట్లు కూడా సమాచారం. ఈ పరిణామం తర్వాత నిజమైన టీఎంసీ తమదే అని చెప్పుకునే అవకాశం రీటబ్రత వర్గం, తిరుగుబాటు ఎమ్మెల్యేలకు సలుభమైంది.