5G Auction: ‘5జీ’ వేలానికి సూపర్ రెస్పాన్స్.. తొలిరోజే ఇలా..
5జీ స్పెక్ట్రం కేటాయింపుల కోసం ఇవాళ వేలం ప్రారంభమైంది.. తొలిరోజు వేలానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.. ఈ ప్రక్రియ రెండు రోజుల్లో పూర్తవుతుందని అధికార వర్గాలు తెలిపాయి. జియో, ఎయిర్టెల్, వొడాఫోన్-ఐడియాతోపాటు ఈసారి అదానీ నెట్వర్క్ కూడా ఈ ఆక్షన్లో ప్రధాన పోటీదారుగా పాల్గొంది.. 5జీ స్పెక్ట్రం వేలం ద్వారా ప్రభుత్వానికి లక్ష కోట్ల రూపాయలకు పైగా ఆదాయం వస్తుందని అంచనాలు ఉండగా.. ప్రస్తుతం మనం వాడుతున్న 4జీ నెట్వర్క్తో పోల్చితే 5జీ నెట్వర్క్లో పది రెట్లు వేగంగా ఆన్లైన్ సర్వీసులు అందనున్నాయి. ఇవాళ 72 గిగాహెర్జ్ 5జీ స్పెక్ట్రమ్ కేటాయింపుల కోసం వేలం ప్రారంభం అయ్యింది.. మొదటి రోజున బిడ్డింగ్ రూ.1.45 లక్షల కోట్లు దాటింది అంతే.. 5జీకి ఉన్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు..
Read Also: Gas Cylinder Blast: గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు మృతి.. తెరవెనుక కుట్ర?
Also Read
- Aadhaar Card: మీకు ఇది తెలుసా? మీ ఆధార్ కార్డు మీ పుట్టిన తేదీకి గ్యారెంటీ కాదట! ఎందుకో తెలుసా..
- Stock Market Crash: రెండు గంటల్లోనే రూ.3.7 లక్షల కోట్లు లాస్.. ఇన్వెస్టర్లను ముంచేసిన మంగళవారం!
- Salary Delay: సారీ బాస్.. ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్! ఈసారి 'ఫస్ట్'కు శాలరీ రాదు.. ఎందుకో తెలుసా?
- Sun Pharma: అమెరికా గడ్డపై భారత ఫార్మా జెండా.. లక్ష కోట్లతో దిగ్గజ కంపెనీని కొనుగోలు చేసిన సన్ ఫార్మా!
భారత్ లో టెలికాం స్పెక్ట్రమ్ కోసం ఇంత భారీ వేలం నిర్వహించడం ఇదే తొలిసారి కావడం విశేషం.. వేలంలో.. జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా, అదానీ గ్రూప్ కు చెందిన యాక్టివ్ లీ వంటి సంస్థలు పాల్గొనడంతో అనూహ్యంగా స్పందన వచ్చిందని అంచనా వేస్తున్నారు.. తొలిరోజు వేలంలో నాలుగు రౌండ్లు నిర్వహించామని, బిడ్డింగ్ మొత్తం రూ.1.45 లక్షల కోట్లు దాటిందని కేంద్ర టెలికాం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఇక, బుధవారం ఐదో రౌండ్ వేలం చేపట్టనున్నారు.. అయితే, ఇది అల్ట్రా-హై స్పీడ్లను (4G కంటే దాదాపు 10 రెట్లు ఎక్కువ) అందిస్తుంది. ఉచిత కనెక్టివిటీ, డేటాను పంచుకోవడానికి బిలియన్ల కొద్దీ కనెక్ట్ చేయబడిన పరికరాలను ప్రారంభించవచ్చు. ఐదో రౌండ్ వేలం రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఆగస్ట్ 15 నాటికి స్పెక్ట్రమ్ కేటాయింపును పూర్తి చేయాలని భావిస్తున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు.. 2022 చివరి నాటికి చాలా నగరాల్లో 5జీ సేవలు అందుతాయని వైష్ణవ్ చెప్పారు. 3300 MHz మరియు 26 GHz బ్యాండ్లు బలమైన బిడ్లను ఆకర్షించాయి – మిడ్ మరియు హై-ఎండ్ బ్యాండ్లు ఆసక్తిని కనబరిచాయి. 700 మెగాహెర్ట్జ్ బ్యాండ్కు బిడ్లు కూడా వచ్చాయని మంత్రి విలేకరులకు తెలిపారు. నలుగురు బిడ్డర్లు పాల్గొనడం కలిసే వచ్చే అంశంగా అభివర్ణించారు.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో